ఏపీలో టీడీపీ-జనసేన పార్టీల పొత్తు ఫిక్స్ అవుతుందో లేదో తెలియదు గానీ..ఆ రెండు పార్టీల పొత్తు గురించి చర్చలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ సారి ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య పొత్తు మాత్రం ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అసలు రెండు పార్టీలు కలిస్తేనే జగన్కు చెక్ పెట్టడం సాధ్యం అవుతుందని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ మేరకు టీడీపీ – జనసేన పార్టీ నేతల అంతర్గత చర్చల్లోనూ ఇదే విషయం ప్రస్తావనకు వస్తోంది. అలాగే టీడీపీ-జనసేనలు కూడా పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తిగానే ఉన్నాయని తెలుస్తోంది.
ఓ వైపు పొత్తు గురించి ప్రచారం జరుగుతుండగానే.. మరోవైపు జనసేనకు కేటాయించే సీట్లపై కూడా చర్చలు జరిగిపోతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. పొత్తులో భాగంగా జనసేనకు టీడీపీ కొన్ని సీట్లు ఇవ్వనుందని, అందులో భాగంగా గుంటూరు జిల్లాలోని తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారని టాక్. ఇప్పటికే పలు సీట్లపై చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే.
పైగా జనసేనకు కేటాయించే సీట్లలో చంద్రబాబు, టీడీపీ నేతలకు ఇంచార్జ్ పదవులని సైతం కన్ఫామ్ చేయలేదు. ఉదాహరణకు విజయవాడ వెస్ట్, కైకలూరు, భీమవరం లాంటి నియోజకవర్గాల్లో జనసేనకు అనుకూలంగా టీడీపీ నేతలని పెట్టినట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో తెనాలి సీటుని సైతం మాజీ మంత్రి ఆలపాటి రాజాకు ఇంకా ఫిక్స్ చేయలేదని ప్రచారం జరుగుతుంది. ఇక్కడ జనసేన తరపున మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పొత్తు ఫిక్స్ అయితే మాత్రం తెనాలి సీటు నాదెండ్లకు ఇస్తారని, ఇక రాజాకు వేరే సీటు గానీ, లేదా అధికారంలోకి వస్తే ఏదైనా పదవి గానీ ఇవ్వొచ్చని తెలుస్తోంది.
రాజాకు గుంటూరు వెస్ట్ పేరు వినిపిస్తోంది. అయితే గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్లే తెనాలిలో టీడీపీ ఓడిపోయింది. జనసేన నుంచి పోటీ చేసి నాదెండ్ల 30 వేల ఓట్ల వరకు తెచ్చుకున్నారు. ఇలా ఓట్లు చీల్చడం వల్ల వైసీపీ గెలిచేసింది. కానీ నెక్స్ట్ ఇలా జరగకుండా టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకుంటున్నాయని, పొత్తులో భాగంగా తెనాలి సీటు నాదెండ్లకు ఇస్తున్నారని జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్ ?
This post was last modified on January 5, 2022 4:54 pm
ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంటే..అసెంబ్లీ+పార్లమెంటు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని…
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…