Political News

మోడీ భేటీతో ఏపీకి మరో అప్పు

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో.. తొలి రోజున ప్రధాని నరేంద్ర మోడీని కలవటం.. ఆ సందర్భంగా ఆయన పాత డిమాండ్లను సరికొత్తగా ఆయన ముందు పెట్టటం.. వాటిని పరిశీలిస్తానని చెప్పటం.. అదే విషయం మీడియాలో రావటం తెలిసిందే. మోడీతో సీఎం జగన్ భేటీ తర్వాత ఏం జరిగింది? అన్న విషయానికి వస్తే..

ఏపీకి రూ.2500 కోట్ల కొత్త అప్పునకు ఓకే చెప్పటమే కాదు.. గంటల వ్యవధిలోనే ఏపీకి ఆ మొత్తం సర్దుబాటు అయ్యింది.
సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం జగన్ కలిసిన తర్వాత.. కొత్త అప్పునకు ఓకే చెప్పటంతో మంగళవారం యుద్ధ ప్రాతిపదికన అన్ని పనులు చకచకా జరిగిపోయాయి. ఉదయాన్నే ఆర్బీఐలో బాండ్లు.. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ.2500 కోట్ల అప్పు తీసుకొచ్చింది.

నిజానికి జగన్ ఢిల్లీకి రాక ముందు.. ఏపీ ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు విపరీతంగా ప్రయత్నించినా కొత్త అప్పునకు ఓకే చెప్పలేదు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సీఎం.. అనుకున్నట్లే రూ.2500కోట్ల అప్పును సాధించగలిగారు. మొత్తానికి రాష్ట్రం చేతికి వచ్చిన రూ.2500 కోట్ల కొత్త అప్పును దేనికి వినియోగించారు? అన్న విషయంలోకి వెళితే.. ఆ వివరాలు తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. రూ.2500 కోట్లలో కొంత మొత్తాన్ని ఓవర్ డ్రాఫ్టు కింద ఆర్ బీఐ జమ చేసుకోగా.. మిగిలిన డబ్బుతో పెన్షనర్లకు పెన్షన్లు.. ఉద్యోగుల జీతాల్ని కొంతమేర సర్దుబాటు చేయగలిగారు.

గడిచిన 8 రోజుల్లో ఏపీ ప్రభుత్వం మొత్తంగా రూ.4750 కోట్ల అప్పు చేసింది. ఈ లెక్కన చూసినప్పుడు రోజుకురాష్ట్ర ప్రభుత్వం రూ.594 కోట్ల మొత్తాన్ని అప్పు చేస్తున్నట్లుగా చెప్పాలి. క్యాలెండర్ లో నాలుగో తేదీ దాటినా.. ఉద్యోగులు.. పెన్షనర్లకు ప్రభుత్వం ఇంకా రూ.3200 కోట్లమేర బకాయిలు ఉంది. అవ్వాతాతల పింఛన్ల కోసం డబ్బుల్ని సర్దుబాటు చేయాల్సి ఉంది. మరేం చేస్తారో చూడాలి. ఇలా.. ఎప్పటికప్పుడు అప్పులు చేస్తూ.. జీతాలు.. పెన్షన్లు.. ఫించన్లను ఇచ్చుకుంటూ పోతే.. రాష్ట్రాన్ని డెవలప్ చేసేందుకు అవసరమైన నిధుల్ని ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారు? అన్నది అసలైన ప్రశ్నగా మారింది.

This post was last modified on January 5, 2022 1:17 pm

Share

Recent Posts

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

2 hours ago

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

5 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

5 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

5 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

6 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

7 hours ago