Political News

మోడీ భేటీతో ఏపీకి మరో అప్పు

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో.. తొలి రోజున ప్రధాని నరేంద్ర మోడీని కలవటం.. ఆ సందర్భంగా ఆయన పాత డిమాండ్లను సరికొత్తగా ఆయన ముందు పెట్టటం.. వాటిని పరిశీలిస్తానని చెప్పటం.. అదే విషయం మీడియాలో రావటం తెలిసిందే. మోడీతో సీఎం జగన్ భేటీ తర్వాత ఏం జరిగింది? అన్న విషయానికి వస్తే..

ఏపీకి రూ.2500 కోట్ల కొత్త అప్పునకు ఓకే చెప్పటమే కాదు.. గంటల వ్యవధిలోనే ఏపీకి ఆ మొత్తం సర్దుబాటు అయ్యింది.
సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం జగన్ కలిసిన తర్వాత.. కొత్త అప్పునకు ఓకే చెప్పటంతో మంగళవారం యుద్ధ ప్రాతిపదికన అన్ని పనులు చకచకా జరిగిపోయాయి. ఉదయాన్నే ఆర్బీఐలో బాండ్లు.. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ.2500 కోట్ల అప్పు తీసుకొచ్చింది.

నిజానికి జగన్ ఢిల్లీకి రాక ముందు.. ఏపీ ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు విపరీతంగా ప్రయత్నించినా కొత్త అప్పునకు ఓకే చెప్పలేదు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సీఎం.. అనుకున్నట్లే రూ.2500కోట్ల అప్పును సాధించగలిగారు. మొత్తానికి రాష్ట్రం చేతికి వచ్చిన రూ.2500 కోట్ల కొత్త అప్పును దేనికి వినియోగించారు? అన్న విషయంలోకి వెళితే.. ఆ వివరాలు తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. రూ.2500 కోట్లలో కొంత మొత్తాన్ని ఓవర్ డ్రాఫ్టు కింద ఆర్ బీఐ జమ చేసుకోగా.. మిగిలిన డబ్బుతో పెన్షనర్లకు పెన్షన్లు.. ఉద్యోగుల జీతాల్ని కొంతమేర సర్దుబాటు చేయగలిగారు.

గడిచిన 8 రోజుల్లో ఏపీ ప్రభుత్వం మొత్తంగా రూ.4750 కోట్ల అప్పు చేసింది. ఈ లెక్కన చూసినప్పుడు రోజుకురాష్ట్ర ప్రభుత్వం రూ.594 కోట్ల మొత్తాన్ని అప్పు చేస్తున్నట్లుగా చెప్పాలి. క్యాలెండర్ లో నాలుగో తేదీ దాటినా.. ఉద్యోగులు.. పెన్షనర్లకు ప్రభుత్వం ఇంకా రూ.3200 కోట్లమేర బకాయిలు ఉంది. అవ్వాతాతల పింఛన్ల కోసం డబ్బుల్ని సర్దుబాటు చేయాల్సి ఉంది. మరేం చేస్తారో చూడాలి. ఇలా.. ఎప్పటికప్పుడు అప్పులు చేస్తూ.. జీతాలు.. పెన్షన్లు.. ఫించన్లను ఇచ్చుకుంటూ పోతే.. రాష్ట్రాన్ని డెవలప్ చేసేందుకు అవసరమైన నిధుల్ని ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారు? అన్నది అసలైన ప్రశ్నగా మారింది.

This post was last modified on January 5, 2022 1:17 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

2 hours ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

2 hours ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

3 hours ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

3 hours ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

3 hours ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

4 hours ago