Political News

కాపుల్లో ఆధిపత్య గొడవలు?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానాలు మొదలయ్యాయి. కాపులకు రాజ్యాధికారం దక్కాలనే డిమాండ్ ఎప్పటినుండో వినిపిస్తున్నదే. ఇదే విషయమై ఇప్పటికి కాపుల్లోని ప్రముఖులతో చాలా సమావేశాలే జరిగాయి. అయితే సమావేశాలు సమావేశాల్లాగే మిగిలిపోయాయి. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇపుడు కాపు ప్రముఖుల మధ్య సమావేశాలు మొదలయ్యాయి. గడచిన నెలరోజుల్లో మూడుసార్లు సమావేశమయ్యారు.

ఇక్కడే అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. అదేమిటంటే కాపులకు నాయకత్వం వహించేందుకు పోటీ మొదలైనట్లే అనుమానంగా ఉంది. వైజాగ్ లో టీడీపీ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. అలాగే విజయవాడలో వంగవీటి రాధా స్పీడయ్యారు. కాకినాడలో ముద్రగడ పద్మనాభం కేంద్రంగా రాజకీయాలు స్పీడయ్యాయి.

ఇదే సమయంలో మాజీమంత్రి, కాపునేత హరిరామ జోగయ్య జోక్యం పెరిగిపోయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉండగా కాపులకు మరో పార్టీ ఎందుకంటు గోల మొదలుపెట్టారు. జనసేన ఉన్నంతవరకు కాపులకు ప్రత్యేకంగా వేరే పార్టీ అవసరమే లేదని కూడా చెప్పారు. పైగా హైదరాబాద్ లో సమావేశమైన కాపు నేతల్లో ఎవరికీ సామాజికవర్గాన్ని లీడ్ చేసేంత సీన్ లేదని కూడా తేల్చేశారు.

ఇంతకీ హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నదెవరు ? ఎవరంటే గంటా, రాధా, జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు అండ్ కో. సమావేశంలో పాల్గొన్నవాళ్ళని చూస్తే మటుకు జోగయ్య చెప్పింది నిజమే అని కాపుల్లోనే ప్రచారం జరుగుతోంది.  85 ఏళ్ళవయసులో ఉన్న జోగయ్య గోలేమిటంటే కాపు ప్రముఖలంతా కలిసి తనను ఎక్కడ దూరం పెట్టేస్తారేమో అని. జోగయ్య జోక్యాన్ని మిగిలిన వాళ్ళు అంగీకరించటంలేదు. ఎందుకంటే ఈయన మాట్లాడితే పవన్ జిందాబాద్ అంటారు.

మొత్తంమీద అందరికీ అర్ధమవుతున్నదేమంటే అసలు ఏర్పాటవుతుందో లేదో కూడా తెలీని  కాపుల పార్టీ విషయంలో ఆధిపత్యం గొడవలు మొదలైపోయాయని. గంటా ఆధిపత్యాన్ని ఉభయగోదావరి జిల్లాల నేతలు అంగీకరించటంలేదు. గోదావరి జిల్లా నేతల ఆధిపత్యాన్ని కోస్తా జిల్లాల నేతలు ఒప్పుకోవటంలేదు. ఇంకా రాయలసీమ జిల్లాల నేతలెవరు యాక్టవ్ కాలేదు. వీళ్ళు కూడా యాక్టివ్ అయితే గానీ చివరకు ఏమవుతుందో తెలీదు. 

This post was last modified on January 5, 2022 12:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

4 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

7 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

8 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

9 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

9 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

9 hours ago