సినిమా టికెట్లకు సంబంధించిన వ్యవహారం ఏపీలో కొంత కాలంగా ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. రాష్ట్రంలో ఇంకే సమస్యలూ లేనట్లుగా ప్రభుత్వం దీని మీద పెడుతున్న శ్రద్ధా అంతా ఇంతా కాదు. ఓపక్క మంత్రులు.. ఇంకో పక్క అధికారులు ఈ అంశాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లుగా కనిపిస్తున్నారు.
టికెట్ల రేట్ల మీద పాత జీవోను బయటికి తీసి ఆదేశాలు జారీ చేయడం.. ధరల విషయమై థియేటర్ల మీద దాడులు చేయడం.. సమావేశాలు నిర్వహించడం.. ప్రెస్ మీట్లు పెట్టడం.. ధరల విషయమై, అలాగే ఆన్ లైన్ టికెటింగ్కు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయడం.. అబ్బో ఈ తతంగం మామూలుగా లేదు.
చివరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం ఈ అంశం మీద నూతన సంవత్సర వేడుకల్లో మాట్లాడటం గమనార్హం. రాష్ట్రంలో జనాల్ని అతలాకుతలం చేస్తున్న ప్రధాన సమస్యల సంగతేంటి అని ఎవరెంత మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా ఈ అంశాన్నే చర్చనీయాంశంగా మారుతున్నారు అధికార పార్టీ నాయకులు. పేర్ని నాని సహా మంత్రులు, ఇతర నాయకులు ఇప్పటికే సినిమా టికెట్ల విషయంలో చిత్ర విచిత్రమైన లాజిక్స్ తీస్తూ మాట్లాడటం తెలిసిందే. ఇప్పుడు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ లైన్లోకి వచ్చారు. ఆయనో చిత్రమైన సూత్రీకరణ చేశారు.
జగన్ సర్కారు ఈ అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడానికి ఆయనో విడ్డూరమైన కారణం చెప్పారు. ఏపీలో సీఎం జగన్ వివిధ పథకాల రూపంలో జనాలకు బాగా డబ్బులు ఇస్తుంటే.. ఆ డబ్బులు అటు తిరిగి ఇటు తిరిగి సినిమా వాళ్ల జేబుల్లోకి వెళ్తున్నాయని భరత్ అన్నారు.
జనాలు బట్టలు, ఇతర విషయాల కోసం కూడా ఖర్చు పెడుతున్నప్పటికీ ఎక్కువ డబ్బులు సినిమాల కోసమే వెచ్చిస్తున్నారని, ఇలా వాళ్ల డబ్బులు వృథా అయిపోతుండటంతోనే టికెట్ల రేట్ల మీద నియంత్రణ తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నట్లుగా మాట్లాడారు ఎంపీ. ఐతే అర్థం లేని ఈ లాజిక్తో జనాలకు దిమ్మదిరిగిపోతోంది. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యి భరత్ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
This post was last modified on January 4, 2022 5:41 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…