Political News

జగన్: సేమ్ టు సేమ్.. ఏమీ మారలేదు

సేమ్ టు సేమ్ ఏమీ మారలేదు. రెండున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి  అవే విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి అదే సమాధానం చెబుతున్నారు. విజ్ఞప్తులూ మారలేదు..సమాధానంలోనూ మార్పులేదు.  జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిసిన ప్రతిసారి విజ్ఞప్తులు చేస్తునే ఉన్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. షరామామూలుగానే చాలా విషయాలే మాట్లాడారు.

2017-18 సంవత్సరాల సవరించిన అంచనాల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని 55,657 కోట్లకు ఆమోదించాలని, పెండింగ్ బిల్లులు రు. 2100 కోట్లు వెంటనే మంజూరు చేయించాలన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వని కారణంగా రాష్ట్రం బాగా వెనకబడిపోయిందన్నారు. విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదని గుర్తుచేశారు. విభజన సమయం నుండి ఏపీకి తెలంగాణా విద్యుత్ సంస్ధ నుండి రావాల్సిన రు. 6400 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించాలని..ఇలా చాలానే చెప్పారు.

జగన్ విజ్ఞప్తులను పరిశీలిస్తామని మోడి సమాధానమిచ్చారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఏపీ ప్రయోజనాల్లో ఒక్కటి కూడా నెరవేర్చే ఉద్దేశ్యంలో మోడి లేరన్నది వాస్తవం. ఈ విషయం జగన్ తో పాటు అందరికీ తెలుసు. కావాలనే కేంద్రప్రభుత్వం విభజన హామీలను తుంగలో తొక్కేస్తొంది. విభజన హామీలు తూచా తప్పకుండా అమల్లోకి రావాలంటే మోడీకి ఏపితో రాజకీయ అనివార్యత రావాల్సిందే. ఏపీ ఎంపీలతో అవసరం అనుకుంటే తప్ప రాష్ట్రాన్ని మోడి పట్టించుకోరు.

రాజకీయ అనివార్యత అనేది 2024 ఎన్నికల్లో గానీ తేలదు. అప్పటి ఎన్నికల్లో ఎన్డీయే బలం తగ్గిపోయి ఏపీ ఎంపీల మద్దతు లేనిదే ప్రభుత్వం ఏర్పాటు సాధ్యంకాదు అని తేలినపుడు మాత్రమే ఏపి ప్రయోజనాలు నెరవేరుతాయి. అంతవరకు ఏదో ఢిల్లీకి వెళ్ళటం మోడీని కలవటం నమస్కారం పెట్టుకుని రావటం తప్ప జగన్ చేయగలిగేది ఏమీలేదు. అప్పటివరకు అవే విజ్ఞప్తులు, అవే హామీలు సైకిల్ చక్రంలాగ తిరుగుతునే ఉంటాయంతే.

విచిత్రం ఏమిటంటే రాష్ట్రంలోని బీజేపీ నేతలకు కూడా ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఒప్పించాలని లేకపోవటం. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అయితే రాష్ట్రప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేసినట్లే ఉన్నారు. ఏపీ నుండి కేంద్రంలో కానీ జాతీయ పార్టీలో కానీ చాలామందే ప్రముఖులున్నప్పటికీ ఎవరి వల్లా ఒక్కపిసరంత ఉపయోగం కూడా రాష్ట్రానికి కనిపించటంలేదు. ఏం చేస్తాం 2024 వరకు వెయిట్ చేయకతప్పదంతే.

This post was last modified on January 4, 2022 1:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago