Political News

జగన్: సేమ్ టు సేమ్.. ఏమీ మారలేదు

సేమ్ టు సేమ్ ఏమీ మారలేదు. రెండున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి  అవే విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి అదే సమాధానం చెబుతున్నారు. విజ్ఞప్తులూ మారలేదు..సమాధానంలోనూ మార్పులేదు.  జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిసిన ప్రతిసారి విజ్ఞప్తులు చేస్తునే ఉన్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. షరామామూలుగానే చాలా విషయాలే మాట్లాడారు.

2017-18 సంవత్సరాల సవరించిన అంచనాల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని 55,657 కోట్లకు ఆమోదించాలని, పెండింగ్ బిల్లులు రు. 2100 కోట్లు వెంటనే మంజూరు చేయించాలన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వని కారణంగా రాష్ట్రం బాగా వెనకబడిపోయిందన్నారు. విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదని గుర్తుచేశారు. విభజన సమయం నుండి ఏపీకి తెలంగాణా విద్యుత్ సంస్ధ నుండి రావాల్సిన రు. 6400 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించాలని..ఇలా చాలానే చెప్పారు.

జగన్ విజ్ఞప్తులను పరిశీలిస్తామని మోడి సమాధానమిచ్చారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఏపీ ప్రయోజనాల్లో ఒక్కటి కూడా నెరవేర్చే ఉద్దేశ్యంలో మోడి లేరన్నది వాస్తవం. ఈ విషయం జగన్ తో పాటు అందరికీ తెలుసు. కావాలనే కేంద్రప్రభుత్వం విభజన హామీలను తుంగలో తొక్కేస్తొంది. విభజన హామీలు తూచా తప్పకుండా అమల్లోకి రావాలంటే మోడీకి ఏపితో రాజకీయ అనివార్యత రావాల్సిందే. ఏపీ ఎంపీలతో అవసరం అనుకుంటే తప్ప రాష్ట్రాన్ని మోడి పట్టించుకోరు.

రాజకీయ అనివార్యత అనేది 2024 ఎన్నికల్లో గానీ తేలదు. అప్పటి ఎన్నికల్లో ఎన్డీయే బలం తగ్గిపోయి ఏపీ ఎంపీల మద్దతు లేనిదే ప్రభుత్వం ఏర్పాటు సాధ్యంకాదు అని తేలినపుడు మాత్రమే ఏపి ప్రయోజనాలు నెరవేరుతాయి. అంతవరకు ఏదో ఢిల్లీకి వెళ్ళటం మోడీని కలవటం నమస్కారం పెట్టుకుని రావటం తప్ప జగన్ చేయగలిగేది ఏమీలేదు. అప్పటివరకు అవే విజ్ఞప్తులు, అవే హామీలు సైకిల్ చక్రంలాగ తిరుగుతునే ఉంటాయంతే.

విచిత్రం ఏమిటంటే రాష్ట్రంలోని బీజేపీ నేతలకు కూడా ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఒప్పించాలని లేకపోవటం. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అయితే రాష్ట్రప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేసినట్లే ఉన్నారు. ఏపీ నుండి కేంద్రంలో కానీ జాతీయ పార్టీలో కానీ చాలామందే ప్రముఖులున్నప్పటికీ ఎవరి వల్లా ఒక్కపిసరంత ఉపయోగం కూడా రాష్ట్రానికి కనిపించటంలేదు. ఏం చేస్తాం 2024 వరకు వెయిట్ చేయకతప్పదంతే.

This post was last modified on January 4, 2022 1:21 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

హీరామండి రిపోర్ట్ ఏంటి

మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…

1 hour ago

జ్యోతికృష్ణ గెలవాల్సిన సవాల్ పెద్దదే

ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…

2 hours ago

హాట్ టాపిక్‌గా చంద్ర‌బాబు ‘టోపీ’.. ఏంటిది?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. అటు…

2 hours ago

ఇక్కడే చస్తానంటున్న బండ్ల గణేష్ !

బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…

3 hours ago

ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని ఆగుతున్నాం: బొత్స

ఏపీ అధికార పార్టీ వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని…

5 hours ago

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

14 hours ago