తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊహించిన స్థాయిలో మీడియా మద్దతు ఉండడం లేదా? అందుకే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఓ ఛానెల్ పెట్టేందుకు సిద్దమవుతున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో నిలబడాలంటే ప్రజల మద్దతు ఉండాలి. కానీ ప్రజల దగ్గరకు చేరువ కావాలంటే అందుకు మీడియా ఓ సాధనంగా ఉపయోగపడుతోంది. ఇప్పుడు మీడియా పెద్దల ఆశీర్వాదం రాజకీయ పార్టీలకు ఎంతో అవసరం. ఈ విషయాన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి ఏ మీడియా నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోవడంతో సొంతంగా ఛానెల్ పెట్టేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం సాగుతోంది.
రాజకీయ పార్టీ ప్రజల నోళ్లలో నానాలంటే అందుకు మీడియా ప్రధాన కారణం. ఈ విషయం రేవంత్కు తెలియంది కాదు. అందుకే ఆయన పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకముందే తెలుగు రాష్ట్రాల్లోని మీడియా అధినేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. కానీ వాళ్ల నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకే ఆయనే సొంతంగా ఓ శాటిలైట్ ఛానెల్ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. లేకపోతే ప్రస్తుతం ఏదైనా ఓ ఛానెల్కు ఆర్థికంగా అండగా నిలబడి వార్తలు ప్రసారం చేయించుకోవాలనే యోచన కూడా చేస్తున్నట్లు టాక్. కానీ చివరకు సొంత ఛానెల్కు ఆయన మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ముందుగా ఓ యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టి.. ఆ తర్వాత అదే పేరుతో శాటిలైట్ ఛానెల్ నెలకొల్పాలన్నది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది.
దాని కోసం ఇప్పటికే ఆయన గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే తనతో సన్నిహితంగా ఉండే కొందరు మీడియా ప్రతినిధులతో రేవంత్ సంప్రదించారని టాక్. ఓ టాప్ న్యూస్ ఛానెల్లోని ఓ సీనియర్ జర్నలిస్ట్ రాజీనామా వెనక కూడా రేవంత్ ఛానెల్ కారణంగా ఉందని ప్రచారం సాగుతోంది. ఆ జర్నలిస్ట్ రేవంత్ ఛానెల్ బాధ్యతలు చూసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేరుగా టీవీ ఛానెల్ పెట్టడం కంటే కూడా యూట్యూబ్ ఛానెల్ పెట్టి దాన్ని విజయవంతం చేసిన తర్వాత పార్టీ తరపున అదే పేరుతో శాటిలైట్ ఛానెల్ పెట్టబోతున్నారని తెలిసింది.
This post was last modified on January 3, 2022 7:54 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…