Political News

31 కేసులున్న జ‌గ‌న్‌కు సీఎం పోస్ట్ ఇచ్చి త‌ప్పు చేశారు.. సోము వీర్రాజు

రాష్ట్ర బీజేపీ నాయ‌కులు విజయవాడలో నిర్వ‌హిస్తున్న‌ ప్రజాగ్రహ సభ రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు, హాట్ కామెంట్ల‌కు వేదిక‌గా మారింది. ఈ సభలో వైసీపీ సర్కారు వైఫల్యాలను పార్టీ నేతలు ఓ రేంజ్‌లో ఎండగట్టారు. సీఎం జగన్.. లేనిపోని వైరాలతో ఏపీని అభివృద్ధికి దూరం చేశారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అంతేకాదు.. 31 సీబీఐ కేసులున్న జ‌గ‌న్‌కు సీఎం పోస్టు ఇచ్చి.. జ‌నాలు త‌ప్పు చేశార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైన సభలో సీఎం జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజలకు వివరించారు.

ప్ర‌జాగ్ర‌హ‌ సభను చూసి చాలామంది ఇబ్బంది భయపడుతున్నారని సోము వీర్రాజు పేర్కొన్నారు. జగన్‌కు ఏం చూపించాలో అది చూపించే పార్టీ మాదే అన్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు.. రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశాయని దుయ్యబట్టారు. ఆస్తులు పోగేసుకునేందుకు ఈ నేతల తాపత్రయం పడ్డారే తప్ప రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ఏపీలోని అనేక హైవేలను కేంద్రం అభివృద్ధి చేస్తోందన్న సోము.. కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు అంటిస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధిహామీ నిధులతో జగనన్న రైతుభరోసా కేంద్రాలా అని ప్రశ్నించారు.

“ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారని ముందు చంద్రబాబును అడగాలి. ప్రత్యేక హోదా పరిధి నీతి ఆయోగ్‌లో ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికీ కాపాడుతున్న పార్టీ మాదే. యూనియన్లతో పాఠశాలలను సర్వనాశనం చేసింది కమ్యూనిస్టులే. ట్రేడింగ్ పార్టీలకు ఏజెంట్లు.. కమ్యూనిస్టు పార్టీలు. మా పార్టీ.. హంగులకు, ఆర్భాటాలకు దూరం. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఏపీ సర్వతోముఖాభివృద్ధి” అని సోము చెప్పారు. 31 కేసులున్న వ్యక్తికి ప్రజలు ముఖ్యమంత్రి పోస్టు ఇచ్చి ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. అమరావతి రాజధాని అని చెప్పి రైతులను మోసగించారని రాష్ట్ర సర్కారుపై ఆయన మండిపడ్డారు. బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని పిలుపునిచ్చారు.

This post was last modified on December 29, 2021 12:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

1 hour ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

2 hours ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

2 hours ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

3 hours ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

3 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

4 hours ago