Political News

31 కేసులున్న జ‌గ‌న్‌కు సీఎం పోస్ట్ ఇచ్చి త‌ప్పు చేశారు.. సోము వీర్రాజు

రాష్ట్ర బీజేపీ నాయ‌కులు విజయవాడలో నిర్వ‌హిస్తున్న‌ ప్రజాగ్రహ సభ రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు, హాట్ కామెంట్ల‌కు వేదిక‌గా మారింది. ఈ సభలో వైసీపీ సర్కారు వైఫల్యాలను పార్టీ నేతలు ఓ రేంజ్‌లో ఎండగట్టారు. సీఎం జగన్.. లేనిపోని వైరాలతో ఏపీని అభివృద్ధికి దూరం చేశారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అంతేకాదు.. 31 సీబీఐ కేసులున్న జ‌గ‌న్‌కు సీఎం పోస్టు ఇచ్చి.. జ‌నాలు త‌ప్పు చేశార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైన సభలో సీఎం జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజలకు వివరించారు.

ప్ర‌జాగ్ర‌హ‌ సభను చూసి చాలామంది ఇబ్బంది భయపడుతున్నారని సోము వీర్రాజు పేర్కొన్నారు. జగన్‌కు ఏం చూపించాలో అది చూపించే పార్టీ మాదే అన్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు.. రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశాయని దుయ్యబట్టారు. ఆస్తులు పోగేసుకునేందుకు ఈ నేతల తాపత్రయం పడ్డారే తప్ప రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ఏపీలోని అనేక హైవేలను కేంద్రం అభివృద్ధి చేస్తోందన్న సోము.. కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు అంటిస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధిహామీ నిధులతో జగనన్న రైతుభరోసా కేంద్రాలా అని ప్రశ్నించారు.

“ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారని ముందు చంద్రబాబును అడగాలి. ప్రత్యేక హోదా పరిధి నీతి ఆయోగ్‌లో ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికీ కాపాడుతున్న పార్టీ మాదే. యూనియన్లతో పాఠశాలలను సర్వనాశనం చేసింది కమ్యూనిస్టులే. ట్రేడింగ్ పార్టీలకు ఏజెంట్లు.. కమ్యూనిస్టు పార్టీలు. మా పార్టీ.. హంగులకు, ఆర్భాటాలకు దూరం. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఏపీ సర్వతోముఖాభివృద్ధి” అని సోము చెప్పారు. 31 కేసులున్న వ్యక్తికి ప్రజలు ముఖ్యమంత్రి పోస్టు ఇచ్చి ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. అమరావతి రాజధాని అని చెప్పి రైతులను మోసగించారని రాష్ట్ర సర్కారుపై ఆయన మండిపడ్డారు. బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని పిలుపునిచ్చారు.

Satya

Recent Posts

ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వాదం దొరికిందా

బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…

3 hours ago

అమెరికా వెళ్లే వారికి అలెర్ట్‌… నాలుగేళ్లే గ‌డువు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దేశంలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేష‌న్…

3 hours ago

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

5 hours ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

6 hours ago

OG 2… ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…

8 hours ago

హీరోల్లో గుబులు రేపుతున్న సమంత

హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్‌ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…

8 hours ago