విజయవాడలో జరుగుతున్న బీజేపీ ప్రజాగ్రహ సభలో ఆ పార్టీ నేతలు ఏపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ శారదా పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022 చివర్లో కానీ.. 2023 మొదట్లోనే వైసీపీ పాలన పోతుందన్నారు. జగన్కు శంకరగిరి మాన్యాలు తప్పేలా లేవని వ్యాఖ్యానించారు. 2022 జనవరి తర్వాత ఏపీలో వేసే ప్రతి అడుగు.. 2024లో బీజేపీని అధికారంలోకి తెప్పిస్తుందని వ్యాఖ్యానించారు.
బొట్టు పెట్టుకునేందుకు జంకే ముఖ్యమంత్రి జగన్ హిందువనని నమ్మించడం ఎందుకని పరిపూర్ణానంద ప్రశ్నించారు. అంతర్వేది లో రథాన్ని కాల్చేస్తే ఓ మంత్రి చెక్కేకదా! అని హేళనగా మాట్లాడాడని, అది సంస్కారమా? అని ప్రశ్నించారు. దేవాలయాల్లోని డబ్బులన్నీ ఆవిరైపోతున్నాయని పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘విజయవాడలో 42 గుడులను గతంలో కూల్చేస్తే ఈ ప్రభుత్వం ఒక్క ఆలయానికైనా శంకుస్ధాపన చేసిందా?. ఏపీలో మహానేత ఎన్టీఆర్. తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం ఎన్టీఅర్ రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ బొమ్మను పెట్టుకున్నారు కాని 2018లో ఆయన సిద్ధాంతాలను చంద్రబాబు కాంగ్రెస్ కాళ్ల కింద పెట్టారు. అందుకే చంద్రబాబు 2019లో ఓడిపోయారు. జగన్ తెలుగు భాషను జెరూసలేంలో తాకట్టు పెట్టారు. జగన్ పిల్లలు లండన్లో చదువుతున్నారు. లండన్ విద్యాలయాల్లో మొదట వేద మంత్రాలు చదివిస్తారు. ఆ విషయాన్ని జగన్ తెలుసుకోవాలి. ఏపీకి చంద్రబాబు, జగన్ ఇద్దరూ అన్యాయం చేశారు’’ అని పరిపూర్ణానంద స్వామి చెప్పారు.
బీజేపీ శ్రేణులు రెండేళ్లు కష్టపడితేనే ఏపీలో కాషాయం జెండా ఎగురవేయొచ్చని పరిపూర్ణానంద స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీని ఏపీ ప్రజలు పక్కన పెట్టేశారని, వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిచేశారని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ 350 సీట్లతో మళ్ళీ అధికారం చేపడుతుంది. గుర్తు పెట్టుకో అసదుద్దీన్.. మోడీ, యోగి కలసి మీ అన్నదమ్ముల ఢంకా మోగిస్తారు. మీకోసం ఢిల్లీ నుండి వస్తారు చూస్తూ వుండండి. ఏపీలో బిజెపి అధికారంలోకి వస్తే గుడిసెలను బంగ్లాలుగా మారుస్తాం. బీజేపీ శ్రేణులంతా నగరాలు వీడి పల్లెల్లో తిరగాలి. రాష్ట్రాన్ని మనందరం కలిసి కాపాడుకోవాలి. బీజేపీ అధికారంలోకి వస్తేనే అందరి తలరాతలు మారతాయి.’’ అని పరిపూర్ణానంద స్వామి వ్యాఖ్యానించారు.
This post was last modified on December 29, 2021 7:05 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…