ప్రధాని నరేంద్ర మోడీ భద్రతకు రూ.12 కోట్ల ఖరీదైన ‘మెర్సిడీస్-మేబాక్ ఎస్-650 గార్డ్’ను వినియోగిస్తున్నారు. సాయుధ దాడుల నుంచి ఈ కారు బలమైన రక్షణ ఇస్తుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ మహీంద్రా స్కార్పియో వినియోగించేవారు. ఆ తర్వాత ప్రధాని అయ్యాక బీఎండబ్ల్యూ 7 సిరీస్ హైసెక్యూరిటీ ఎడిషన్, రేంజ్రోవర్ వోగ్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ను వినియోగించారు. అయితే.. ఇప్పుడు ప్రధాని భద్రతా విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సరికొత్త కారును తీసుకొంది. ‘మెర్సిడీస్-మేబాక్ ఎస్-650 గార్డ్’ను కొనుగోలు చేసింది.
ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన సందర్భంగా ప్రధాని ఈ కారులోనే హైదరాబాద్ హౌస్కు చేరుకొన్నారు. ఈ కారు ఖరీదు రూ.12 కోట్లు పైమాటే. ఇది వీఆర్-10 స్థాయి భద్రతను కల్పిస్తుంది. సాయుధ దాడుల నుంచి ఈ కారు బలమైన రక్షణ ఇస్తుంది. ఇటీవల స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధాని భద్రతకు కొన్ని అవసరాలను గుర్తించింది. ఆయన వాహనాన్ని మార్చాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండు ఎస్-650 గార్డ్ కార్లను కొనుగోలు చేసింది. ఒక దానిలో ప్రధాని ఉండగా.. మరో కారును డికాయ్(ప్రధాని ఉన్నట్లు తలపించే వాహనం)గా వినియోగిస్తారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ మహీంద్రా స్కార్పియో వినియోగించేవారు. ఆ తర్వాత ప్రధాని అయ్యాక బీఎండబ్ల్యూ 7 సిరీస్ హైసెక్యూరిటీ ఎడిషన్, రేంజ్రోవర్ వోగ్, టయోటా ల్యాండ్ క్రూయిజర్లను వినియోగించారు. ఇక, ఈ విలాసవంతమైన ఎస్-650 గార్డ్ కారు వినియోగదారులకు అత్యున్నత శ్రేణి రక్షణ కల్పించేలా మెర్సిడీస్ జాగ్రత్తలు తీసుకొంది. కారు బాడీ, విండోస్ ఏకే-47 తూటాలను తట్టుకొని నిలబడతాయి. కారుకు ఈవీఆర్ (ఎక్సప్లోజివ్ రెసిస్టెంట్ వెహికల్) 2010 రేటింగ్ లభించింది. ఇది దాదాపు రెండు మీటర్ల దూరంలోపు జరిగే 15 కిలోల టీఎన్టీ పేలుడు శక్తిని నుంచి ప్రయాణికులకు కాపాడుతుంది.
కారు విండోస్కు పాలీకార్బొనేట్ ప్రొటెక్షన్ ఇస్తుంది. కారు కింద జరిగే పేలుడు నుంచి తట్టుకొనేలా రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. ఇక విషవాయువులతో దాడి జరిగినా.. లోపల ఉన్న వీవీఐపీని రక్షించేలా కారు లోపలే ప్రత్యేకమైన ఆక్సిజన్ సరఫరా విభాగం ఉంది. ఈ వాహనంలో అత్యంత శక్తిమంతమైన 6.0లీటర్ ట్విన్ టర్బో ఇంజిన్ అమర్చారు. ఇది 516 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. 900ఎన్ఎం పీక్ టార్క్ను అందుకొంటుంది. భారీ ఇంజిన్ ఉన్నా.. కారు వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకే పరిమితి చేశారు. ఈ కారుకు ప్రత్యేకమైన టైర్లను వినియోగించారు. పంక్చర్లు పడినా.. దెబ్బతిన్నా ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు అవకాశం ఉంది.
This post was last modified on December 28, 2021 7:55 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…