Political News

సంజ‌య్ దీక్ష అందుకేనా?

తెలంగాణ ప్ర‌భుత్వం ఉద్యోగాల భ‌ర్తీ చేయాల‌నే డిమాండ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేప‌ట్టారు. నెల రోజుల్లోగా ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇవ్వ‌క‌పోతే వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల‌ను అడ్డుకుంటామ‌ని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో జ‌రిగిన ఈ దీక్ష‌లో సంజ‌య్ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య ప్ర‌ధానంగా ఉంది. ఎవైనా ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే ఉద్యోగాల నోటిఫికేష‌న్ల‌ను తెర‌పైకి తెస్తున్న ప్ర‌భుత్వం.. ఆ త‌ర్వాత వాటిని మ‌రిచిపోతుంద‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఎదుగుతున్న బీజేపీ.. నిరుద్యోగ స‌మ‌స్య‌పై పోరాటం చేయ‌డం మంచిదే. కానీ ఈ స‌మ‌యంలో అది నిరుద్యోగ స‌మ‌స్య‌ను భుజాల‌కెత్తుకోవ‌డంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మ‌రి ఆ స‌మ‌స్య‌..
రాష్ట్రంలో రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే సంజ‌య్ నిరుద్యోగ దీక్ష‌కు పూనుకున్నార‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్‌, బీజేపీ క‌లిసి రైతుల‌ను మోసం చేస్తున్నాయ‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. రేవంత్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో సంజ‌య్ దీక్ష చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో వ‌రి కొనుగోళ్ల విషయంపై కేసీఆర్ ప్ర‌భుత్వానికి, కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుకు మ‌ధ్య యుద్ధం న‌డుస్తూనే ఉంది.

వ‌రి కొనుగోళ్ల బాధ్య‌త రాష్ట్రానిద‌ని కేంద్రం.. లేదు కేంద్ర‌మే మొత్తం కొనాల‌ని రాష్ట్రం వాదులాడుకుంటూనే ఉన్నాయి. ఈ విష‌యమై టీఆర్ఎస్ నేత‌లు ఢిల్లీకి కూడా వెళ్లారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్ప‌ష్ట‌త లేకుండానే తిరిగి వ‌చ్చారు. మ‌రోవైపు వ‌రి వేస్తే ప్ర‌భుత్వాలు కొంటాయో లేదో అని రైతులు అయోమ‌యంలో ఉన్నారు. ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌ధాన స‌మ‌స్య‌గా ఉన్న వ‌రి కొనుగోళ్ల‌ను క‌న‌మ‌రుగు చేసేందుకే సంజ‌య్ నిరుద్యోగ దీక్ష చేశార‌న్న‌ది రేవంత్ ఆరోప‌ణ‌.

ఆ పార్టీలు కూడా..
ఇప్ప‌టికే తెలంగాణ‌లో పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పైనే వైస్ ష‌ర్మిల పోరాడుతున్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను విమ‌ర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ప్ర‌స్తుతం రైతుల స‌మ‌స్య‌పై ఫోక‌స్ పెట్టి రైతు ఆవేద‌న యాత్ర‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్న అన్న‌దాత‌ల కుటుంబాల‌ను ఆమె ప‌రామ‌ర్శిస్తున్నారు. మ‌రోవైపు గ‌తంలో నిరుద్యోగ జంగ్ సైర‌న్ పేరుతో ఆందోళ‌నలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు రైతు స‌మ‌స్య‌ల‌పైనే దృష్టి పెట్టింది. ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మం పేరుతో రైతుల‌ను క‌లిసే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టింది. కానీ ఈ స‌మ‌యంలో బీజేపీ మాత్రం రైతు స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌కుపెట్టి నిరుద్యోగుల ప‌క్షాల పోరాటం చేసేందుకు సిద్ధం కావ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. 

This post was last modified on December 28, 2021 12:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

27 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago