తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయాలనే డిమాండ్తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపట్టారు. నెల రోజుల్లోగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ దీక్షలో సంజయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ప్రధానంగా ఉంది. ఎవైనా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఉద్యోగాల నోటిఫికేషన్లను తెరపైకి తెస్తున్న ప్రభుత్వం.. ఆ తర్వాత వాటిని మరిచిపోతుందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతున్న బీజేపీ.. నిరుద్యోగ సమస్యపై పోరాటం చేయడం మంచిదే. కానీ ఈ సమయంలో అది నిరుద్యోగ సమస్యను భుజాలకెత్తుకోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరి ఆ సమస్య..
రాష్ట్రంలో రైతుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే సంజయ్ నిరుద్యోగ దీక్షకు పూనుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి రైతులను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శలు చేశారు. రేవంత్ ఆరోపణల నేపథ్యంలో సంజయ్ దీక్ష చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో వరి కొనుగోళ్ల విషయంపై కేసీఆర్ ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ సర్కారుకు మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది.
వరి కొనుగోళ్ల బాధ్యత రాష్ట్రానిదని కేంద్రం.. లేదు కేంద్రమే మొత్తం కొనాలని రాష్ట్రం వాదులాడుకుంటూనే ఉన్నాయి. ఈ విషయమై టీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి కూడా వెళ్లారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత లేకుండానే తిరిగి వచ్చారు. మరోవైపు వరి వేస్తే ప్రభుత్వాలు కొంటాయో లేదో అని రైతులు అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన సమస్యగా ఉన్న వరి కొనుగోళ్లను కనమరుగు చేసేందుకే సంజయ్ నిరుద్యోగ దీక్ష చేశారన్నది రేవంత్ ఆరోపణ.
ఆ పార్టీలు కూడా..
ఇప్పటికే తెలంగాణలో పార్టీ పెట్టినప్పటి నుంచి నిరుద్యోగ సమస్యలపైనే వైస్ షర్మిల పోరాడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను విమర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ప్రస్తుతం రైతుల సమస్యపై ఫోకస్ పెట్టి రైతు ఆవేదన యాత్రతో ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. మరోవైపు గతంలో నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో ఆందోళనలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు రైతు సమస్యలపైనే దృష్టి పెట్టింది. రచ్చబండ కార్యక్రమం పేరుతో రైతులను కలిసే ప్రయత్నాలు మొదలెట్టింది. కానీ ఈ సమయంలో బీజేపీ మాత్రం రైతు సమస్యలను పక్కకుపెట్టి నిరుద్యోగుల పక్షాల పోరాటం చేసేందుకు సిద్ధం కావడం ఆశ్చర్యంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.
This post was last modified on December 28, 2021 12:03 pm
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…