Political News

వంగ‌వీటి రాధాకు స‌ర్కారు భ‌ద్ర‌త‌..

కాపు నాయ‌కుడు వంగ‌వీటి రంగా కుమారుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు ఏపీ ప్ర‌భుత్వం 2+2 గన్‌మెన్లతో భ‌ద్ర‌త క‌ల్పించింది. ఇటీవ‌ల రంగా వ‌ర్ధంతి సంద‌ర్భంగా.. వంగవీటి రాధా సంచ‌లన వ్యాఖ్య లు చేశారు. త‌నను చంపేందుకు రెక్కీ నిర్వ‌హించార‌ని అన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఈ నేప‌థ్యంలో మంత్రి కొడాలి నాని ఈ విష‌యాన్ని సీఎం జ‌గ‌న్‌.. కు చేర‌వేశారు. ఈ నేప‌థ్యంలో రాధాకు భ‌ద్రత క‌ల్పిస్తూ.. నిర్ణ‌యించారు. దీనిపై మంత్రి నాని మాట్లాడుతూ.. వెంటనే రాధాకు భద్రత కల్పించాలని, రాధాపై ఎవరు రెక్కీ చేశారో దర్యాప్తు జరపాలని ఇంటెలిజెన్స్ డీజీని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు.

అయితే.. టీడీపీ నేత‌గా ఉన్న రాధాకు వైసీపీ ప్ర‌భుత్వం హుటాహుటిన భ‌ద్ర‌త క‌ల్పించ‌డంపై అనేక సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే.. మంత్రి మాత్రం.. వైసీపీలోకి వస్తానని రాధా చెప్పలేదని.. తాము రమ్మనలేదని  స్పష్టం చేశారు. రాధా వైసీపీలోకి వస్తానంటే అప్పుడే సీఎంతో మాట్లాడతామన్నారు. రాధా పిలిస్తేనే రంగా విగ్రహావిష్కరణకు వెళ్లామ‌ని, అంతకంటే మరేం లేదంటూ   వ్యాఖ్యానించారు.

“రాధాకు 2+2 గన్‌మెన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వెంటనే భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్ డీజీకి ఆదేశించారు. రాధాపై ఎవరు రెక్కీ చేశారో దర్యాప్తు జరపాలని సీఎం ఆదేశించారు. వైసీపీలోకి వస్తానని రాధా చెప్పలేదు.. మేమూ రమ్మనలేదు. రాధా వైసీపీలోకి వస్తానంటే అప్పుడే సీఎంతో మాట్లాడతాం. పిలిస్తేనే రంగా విగ్రహావిష్కరణకు వెళ్లాం.. అంతకంటే మరేం లేదు“ అనిమంత్రి వ్యాఖ్యానించారు.

కొందరు తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని..  వంగవీటి రాధా ఆరోపించారు. చంపాలని చూసినా భయపడేది లేదన్న ఆయన.. దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని తేల్చిచెప్పారు. వంగవీటి రంగా కీర్తి, ఆశయాల సాధనే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

వాస్త‌వానికి టీడీపీ నేత‌ల‌కు ఉన్న భ‌ద్ర‌త‌ను ఏపీ ప్ర‌భుత్వం త‌గ్గిస్తూ..వ‌స్తోంది. అలాంటి స‌మ‌యంలో ఇప్పుడు అనూహ్యంగా రాధాకు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వైసీపీలో ఉన్న రాధా.. త‌న‌కు ఆశించిన టికెట్ ఇవ్వ‌లేద‌ని పేర్కొంటూ.. పార్టీ మారిపో యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న టీడీపీ వాయిస్ గ‌ట్టిగానే వినిపిస్తున్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో ఆయ‌న అలా త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని ప్ర‌క‌టించారో.. లేదో.. వెంట‌నే.. వైసీపీ స్పందించ‌డం వెనుక‌.. రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు.

ఒక‌టి కాపుల‌కు తాము క‌ల్పిస్తున్న భ‌ద్ర‌త ఇంకెవ‌రు క‌ల్పించ‌డం లేద‌నే సంకేతాలు ఇస్తున్నార‌ని చెబుతున్నారు. ప్ర‌త్య‌ర్థి అయిన‌ప్ప‌టికీ.. కాపుల‌ను కాపాడుతున్నామ‌నే వాద‌న‌ను తీసుకెళ్లే వ్యూహం ఉంద‌ని అంటున్నారు. రెండు.. టీడీపీలో ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోయినా.. తాము ప‌ట్టించుకున్నామ‌నే సంకేతాలు పంపుతున్నార‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ.. రాధాను పార్టీలోకి తీసుకునే ఆలోచ‌న ఉంద‌నే సంకేతాలు కూడా పంపిన‌ట్టు అయింద‌ని అంటున్నారు.

This post was last modified on December 28, 2021 11:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీ కూటమితో విజ‌య్ క‌లుస్తారా?.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విజ‌య్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…

1 minute ago

‘టైగర్ తమ్ముళ్ల’ ఆశలు మళ్లీ చిగురించాయి

లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…

5 minutes ago

JD చక్రవర్తిని ఇలాగేనా వాడుకోవడం

శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…

12 minutes ago

విజ‌య్‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే వాళ్ళ కొంప ముంచిందా?

త‌మిళ‌నాట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ విజ‌య‌దుందుభి మోగించారు. ఏక‌ప‌క్షంగా 110 స్థానాల్లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా…

23 minutes ago

జాక్ పాట్ కొట్టిన జన నాయకుడు

నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…

49 minutes ago

రాకెట్ లా దూసుకుపోతున్న దళపతి పార్టీ

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…

1 hour ago