Political News

చెరోవైపు KCRను వాయించేస్తున్నారుగా ?

కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇద్దరికి ఇద్దరే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక ఆందోళన పేరుతో  చెరో వైపు కేసీయార్ కు ఊపిరి ఆడకుండా చేసేస్తున్నారు. ఇద్దరు సోమవారం ఒకేసారి వేర్వేరు అంశాలపై ఆందోళనలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమం పేరుతో రేవంత్ ఎర్రవెల్లిలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. అయితే జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంట్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులకు, రేవంత్+ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వివాదంతో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు టెన్షన్ గా తయారైంది.  ఎర్రవెల్లిలోని కేసీయార్ ఫాంహౌస్ లో వరి సాగు విషయాన్ని జనాలకు చూపేందుకు రేవంత్ ప్రయత్నించటంతోనే వివాదం మొదలైంది. కొద్దిరోజులుగా తెలంగాణ-కేంద్ర ప్రభుత్వాల మధ్య వరి రాజకీయంగా బాగా రాజుకుంటున్న విషయం తెలిసిందే. కేంద్రానికి వ్యతిరేకంగా కేసీయార్ రాజకీయం మొదలుపెడితే కేసీయార్ కు వ్యతిరేకంగా రేవంత్ మొదలుపెట్టారు. 
ఇక బండి విషయం చూస్తే తెలంగాణలో నిరుద్యోగ దీక్ష చేశారు. ఇందిరాపార్కు దగ్గర నిరుద్యోగులతో కలిసి బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీక్ష చేయాలని బండి ప్లాన్ చేశారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో బీజేపీ ఆఫీసులోనే పార్టీలోని ప్రముఖుల సమక్షంలో బండి దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్షకు నిరుద్యోగులు, విద్యా వాలంటీర్లు మద్దతు ప్రకటించారు. పార్టీ ఆఫీసులో చేసిన దీక్షకు కూడా వివిధ వర్గాల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. 

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇద్దరు కూడా తెలంగాణాలో బర్నింగ్ ప్రాబ్లెమ్స్ నే టేకప్ చేశారు. రేవంత్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పార్టీలో మంచి కదలికే తెచ్చారు. అంతకు ముందు స్తబ్దుగా ఉండే చాలామంది నేతల్లో చురుకుపుట్టింది. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లో మంచి జోష్ కనిపిస్తోంది. మొత్తానికి రేవంత్ అయినా బండి అయినా ఏదో ప్రాబ్లెమ్ తీసుకోవటం కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనని, నిరసనని గోల గోల చేస్తున్నారు. దీంతో వీళ్ళకు సమాధానం చెప్పుకోలేక మంత్రులు నానా అవస్థలు పడుతున్నారు.

This post was last modified on December 28, 2021 11:32 am

Share

Recent Posts

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

2 minutes ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

9 minutes ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

2 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

4 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

5 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

6 hours ago