Political News

ర‌చ్చ‌బండ‌కు దారి బంద్‌: రేవంత్‌రెడ్డి ఫైర్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ఈ రోజు చేప‌ట్టాల‌ని భావించిన ర‌చ్చ‌బండ్‌కు ప్ర‌భుత్వం అనుమ‌తించ‌లేదు. ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కారం ఈ రోజు ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సన్నద్ధమయ్యారు. వరి సాగుతో పాటు అన్నదాతల సమస్యలపై గళమెత్తాలని నిర్ణయించారు.  అయితే.. దీనికి అనుమ‌తించ‌ని పోలీసులు రేవంత్ ఎర్రవల్లికి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఆయ‌న‌ ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది.

పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసుల దారులన్నీ తన ఇంటివైపే ఉన్నాయని.. స్వాగతిస్తున్నానంటూ ఎద్దేవా చేశారు. అయితే.. “ఎన్ని నిర్బంధాలున్నా.. ఎర్రవల్లికి వెళ్లి రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాం. ఎర్రవల్లి గ్రామం ఏమైనా నిషేధిత ప్రాంతమా? పోలీసులు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? తాను చేపట్టిన రచ్చబండకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?  టీఆర్ ఎస్‌, బీజేపీ కలిసి ధాన్యం అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయి. ఉమ్మడి కుట్రలో భాగంగానే మంత్రులు ఢిల్లీ వెళ్లొచ్చారు‌. ఇప్పుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు“ అని రేవంత్ నిప్పులు చెరిగారు.

ఇదే అంశంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కాంగ్రెస్ నాయ‌కుడు మ‌ల్లుర‌వి.. కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వాన్ని నడపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు ఉన్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఆరోపించారు. రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్.. ఆయన ఫామ్ హౌజ్లో 150 ఎకరాల్లో వరి ఎలా పండిస్తున్నారని ప్రశ్నించారు.

“ఢిల్లీ వెళ్లిన మంత్రులు ధాన్యం కొనుగోలు విషయంలో ఏం చేశారు? కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలనే పోలీసులు ఎందుకు అడ్డుకుంటు న్నారు? రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వాన్ని నడపాలని కేసీఆర్‌ భావిస్తున్నారా? రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్‌ తన భూమిలో వరి ఎందుకు సాగు చేశారు? కాంగ్రెస్ నేతలు ఎర్రవల్లి గ్రామానికి వెళ్తే తప్పా? మేము కేసీఆర్‌ ఫామ్ హౌస్‌ ముట్టడికి వెళ్లటం లేదు కదా?“ అని మ‌ల్లు ర‌వి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మొత్తానికి రేవంత్ ర‌చ్చ‌బండ‌.. ఆదిలోనే ర‌చ్చ‌గా మారింది.  

This post was last modified on December 27, 2021 2:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

5 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

7 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

8 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

8 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

9 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

11 hours ago