Political News

ర‌చ్చ‌బండ‌కు దారి బంద్‌: రేవంత్‌రెడ్డి ఫైర్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ఈ రోజు చేప‌ట్టాల‌ని భావించిన ర‌చ్చ‌బండ్‌కు ప్ర‌భుత్వం అనుమ‌తించ‌లేదు. ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కారం ఈ రోజు ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సన్నద్ధమయ్యారు. వరి సాగుతో పాటు అన్నదాతల సమస్యలపై గళమెత్తాలని నిర్ణయించారు.  అయితే.. దీనికి అనుమ‌తించ‌ని పోలీసులు రేవంత్ ఎర్రవల్లికి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఆయ‌న‌ ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది.

పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసుల దారులన్నీ తన ఇంటివైపే ఉన్నాయని.. స్వాగతిస్తున్నానంటూ ఎద్దేవా చేశారు. అయితే.. “ఎన్ని నిర్బంధాలున్నా.. ఎర్రవల్లికి వెళ్లి రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాం. ఎర్రవల్లి గ్రామం ఏమైనా నిషేధిత ప్రాంతమా? పోలీసులు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? తాను చేపట్టిన రచ్చబండకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?  టీఆర్ ఎస్‌, బీజేపీ కలిసి ధాన్యం అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయి. ఉమ్మడి కుట్రలో భాగంగానే మంత్రులు ఢిల్లీ వెళ్లొచ్చారు‌. ఇప్పుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు“ అని రేవంత్ నిప్పులు చెరిగారు.

ఇదే అంశంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కాంగ్రెస్ నాయ‌కుడు మ‌ల్లుర‌వి.. కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వాన్ని నడపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు ఉన్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఆరోపించారు. రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్.. ఆయన ఫామ్ హౌజ్లో 150 ఎకరాల్లో వరి ఎలా పండిస్తున్నారని ప్రశ్నించారు.

“ఢిల్లీ వెళ్లిన మంత్రులు ధాన్యం కొనుగోలు విషయంలో ఏం చేశారు? కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలనే పోలీసులు ఎందుకు అడ్డుకుంటు న్నారు? రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వాన్ని నడపాలని కేసీఆర్‌ భావిస్తున్నారా? రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్‌ తన భూమిలో వరి ఎందుకు సాగు చేశారు? కాంగ్రెస్ నేతలు ఎర్రవల్లి గ్రామానికి వెళ్తే తప్పా? మేము కేసీఆర్‌ ఫామ్ హౌస్‌ ముట్టడికి వెళ్లటం లేదు కదా?“ అని మ‌ల్లు ర‌వి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మొత్తానికి రేవంత్ ర‌చ్చ‌బండ‌.. ఆదిలోనే ర‌చ్చ‌గా మారింది.  

This post was last modified on December 27, 2021 2:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనుష్క అదృశ్యం….దర్శనం ఎప్పుడంటే

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత కనిపించకుండా పోయిన అనుష్క శెట్టి అనుకున్న ప్రకారం అన్నీ జరిగి…

18 minutes ago

5వ త‌ర‌గ‌తి నుంచే ఏఐ పాఠాలు: చంద్ర‌బాబు

రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో 5వ త‌ర‌గ‌తి నుంచే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ను ప్ర‌వేశ పెట్టాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్నట్టు సీఎం…

5 hours ago

వంక పెట్ట‌లేని విధంగా ఎంపిక‌.. చంద్ర‌బాబు విజ‌న్ అంటే ఇదే!

రాష్ట్రంలో ప్ర‌భుత్వానికి స‌ల‌హాదారులు అవ‌స‌రం. అప్పుడు వైసీపీకి అయినా.. ఇప్పుడు కూట‌మి ప్ర‌బుత్వానికి అయినా స‌ల‌హాదారులు కావాల్సిందే. అస‌లు కేంద్ర…

8 hours ago

యూట్యూబ్ ఆదాయానికి కోత‌… సంచ‌ల‌న నిర్ణ‌యం?

అమెరికాకు చెందిన ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా మాధ్య‌మం యూట్యూబ్‌.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. అమెరికా అధ్య‌క్షుడు…

10 hours ago

పహల్గాం వైరల్ వీడియో.. ఆ జంటది కాదు

సోషల్ మీడియా కనిపించే పోస్టుల్లో.. వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోల్లో ఏది ఒరిజినలో ఏది ఫేకో అర్థం కాని పరిస్థితి.…

14 hours ago

నీళ్ళూ సినిమాలూ అన్నీ ఆపాల్సిందే

దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైన పెహల్గామ్ సంఘటన ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంది. అక్కడికి వెళ్లని వాళ్ళు సైతం జరిగిన…

16 hours ago