Political News

పోలీసుల అష్ట‌దిగ్భందంలో TRS భ‌వ‌న్‌

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ కేంద్ర కార్యాల‌యం వ‌ద్ద వేల మంది పోలీసుల‌తో అత్యంత ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త క‌ల్పించారు. హైద‌రాబాద్ న‌డిబొడ్డున బంజారాహిల్స్‌లోని తెలంగాణభవన్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దారిలో వెళ్లే వాహ‌నాల‌నుకూడా ప‌క్క దారి గుండా.. మ‌ళ్లిస్తున్నారు. అంతేకాదు.. పార్టీ నేత‌ల‌ను కూడా టీఆర్ ఎస్ భ‌వ‌న్ ఇంచార్జ్ అనుమ‌తి లేకుండా అటు వైపు రానివ్వ‌డం లేదు. ఇది ఆక‌స్మికంగా తీసుకున్న‌నిర్ణ‌య‌మ‌ని అధికారులు తెలిపారు. దీనికి కార‌ణం ఏంటి?  ఎప్పుడూ.. సంద‌డిగా ఉంటే.. టీఆర్ ఎస్ భ‌వ‌న్‌ను ఎందుకు ఇంత క‌ట్టుదిట్టం చేశారు? అనేప్ర‌శ్న‌లు స‌ర్వత్రా వినిపిస్తున్నాయి.

విష‌యంలోకి వెళ్తే.. బీజేపీ నాయ‌కుడు.. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మీద దాడి జరిగింది. ఆయ‌న‌ను టీఆర్ ఎస్ ఐటీ విభాగం సిబ్బంది.. చెంప దెబ్బ‌లు కొట్టారు. దీంతో ముందస్తుగా పోలీసులు బందోబస్తును పెంచారు. తీన్మార్‌ మల్లన్న… స‌హా బీజేపీ నేత‌లు కొంద‌రు..  తెలంగాణ భవన్‌ను ముట్టడించేందుకు వస్తున్నారన్న సమాచారంలో అప్రమత్తమైన పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కూడా టీఆర్  ఎస్ నేత‌ల ఇళ్లు, భ‌వ‌నాన్ని ముట్ట‌డించాల‌ని.. పిలుపునిచ్చారు. దీంతో ఒక్క‌సారిగా.. టీఆర్ ఎస్‌, బీజేపీ పార్టీల మ‌ధ్య అగ్గిరాజుకున్న‌ట్టు అయింది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

తీన్మార్‌ మల్లన్న యూట్యూబ్‌ చానల్‌లో నిర్వహించిన ఓ పోల్‌లో తన కుమారుడిపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడంపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా కుటుంబ సభ్యులనుద్దేశించి తామూ స్పందిస్తే ఊరుకుంటారా అంటూ ధ్వజమెత్తారు. కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి నీచంగా వ్యాఖ్యలు చేయడం సంస్కారమా అని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు ఇదే నేర్పిస్తున్నారా? అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ప్రశ్నించారు. ఇక‌, కేటీఆర్ అనంత‌రం.. మంత్రులు.. నిరంజ‌న్‌రెడ్డి, అజ‌య్ స‌హా.. నేత‌.. బాల్కా సుమ‌న్ వంటివారు మ‌రింతగా తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై ఫైర‌య్యారు.

ఇక‌, ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన బీజేపీ నాయ‌కులు కూడా అంతే రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు. టీఆర్ ఎస్‌పై విరుచుకుప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ ట్వీట్ తర్వాత తన ఆఫీస్పై, తనపై దాడి జరిగిందంటూ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. కేటీఆర్ మనుషులు ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు. ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న తెలంగాణ భవన్ను ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు బందోబస్తు పెంచారు. ప్ర‌స్తుతం ఈ ఆఫీస్‌కు దారితీసే అన్ని దారుల‌ను నిలిపివేశారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on December 26, 2021 9:18 am

Share

Recent Posts

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

12 minutes ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

38 minutes ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

1 hour ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

1 hour ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

2 hours ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

5 hours ago