టీడీపీలో నేతల మధ్య పోరు.. సహజంగానే కనిపిస్తూ ఉంటుంది. పైకి ఎంత శాంతంగా ఉన్నా.. ఆధిపత్యం, అధికారం కోసం నేతలు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కుస్తీలు పడుతూనే ఉన్నారు. అయితే.. వీరంతా కూడా పురుష నేతలు. నియోజవర్గాల్లో బాధ్యతల కోసం.. ఎన్నికల్లో టికెట్ల కోసం.. పార్టీ అధినేత చంద్రబాబు దగ్గర మార్కులు వేయించుకునేందుకు కోసం.. వీరు పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
అయితే.. ఎప్పటికప్పుడుచంద్రబాబు వీరిని కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఈ పోరు.. అటు తిరిగి ఇటు తిరిగి.. ఇద్దరు మహిళా నేతల మధ్య ఏర్పడింది. గతంలో పార్టీ కీలక నాయకురాలిగా ఉన్న నన్నపనేని రాజకుమారి సుదీర్ఘ కాలం పాటు.. టీడీపీలో సేవ చేశారు. ఇప్పుడు కూడా పార్టీలోనే ఉన్నా.. ఆమె పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. పైగా ఎలాంటి పదవి కూడా లేదు.
దీంతో ఆమె సాధ్యమైనంత వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా నే ఉంటున్నారు. ఇటీవల అసెంబ్లీలో రగడ తర్వాత.. చంద్రబాబు కన్నీరు పెట్టిన ఘటన నేపథ్యంలో వచ్చి పరామర్శించి వెళ్లారు. అంతేకానీ.. పార్టీలో యాక్టివ్గా కనిపించడం లేదు. అయితే.. ఆమె రేంజ్లో ఎవరూ లేరనే లోటు మాత్రం కనిపిస్తోంది. నిజానికి నన్నపనేని సామాజికవర్గం పరంగానే కాకుండా.. అన్ని పార్టీలతోనూ సఖ్యతగా ఉన్నారు.
పదునైన విమర్శలుచేసినా.. ఏనాడూ వివాదాల జోలికి పోలేదు. గత ఐదేళ్లు పార్టీ అధికారంలో ఉన్నప్పు డు.. మహిళా కమిషన్ చైర్ పర్సన్గానూ బాధ్యతలు వహించారు. ఎమ్మెల్సీగానూ ఉన్నారు. కానీ, ఇప్పుడు ఆమె లేకపోవడంతో ఆమె లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. అంటే.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు. అవసరమైతే.. ప్రత్యర్థులను కలిసి.. సమస్యకు పరిష్కారం చూపించేవారు.
ఇప్పుడు అలాంటి నేత ఉంటే బాగుంటుందని మహిళా నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో నన్నపనేని రోల్ను పోషించేందుకు ఇద్దరు కీలక మహిళా నాయకులు పోటీ పడుతున్నారు. వారేప్రస్తుతం తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఉన్న వంగలపూడి అనిత, మరో మహిళా నేత..పంచుమర్తి అనురాధ. ఇద్దరూ కూడా యాక్టివ్గానే ఉన్నారు. పంచుమర్తి అధికార ప్రతినిధిగా.. పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో నన్నపనేని మాదిరిగా ఫైర్ బ్రాండ్ ముద్ర వేయించుకునేందుకు కృషి చేస్తున్నారు. ఒకరిని మించి ఒకరు విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ను విమర్శిస్తున్నారు అయితే.. ఇంతగా దూకుడు చూపిస్తున్నా.. వారికి నన్నపనేని స్థానాన్ని భర్తీ చేయడం సాధ్యం కావడం లేదు. అయినప్పటికీ.. ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఎవరు పుంజుకుంటారో చూడాలని అంటున్నారు సీనియర్లు.
This post was last modified on December 24, 2021 9:52 am
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…
కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.…
పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట…
తమిళనాడు ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…