Political News

గుండెపోటుతో వివేకా మరణించారన్న ప్రచారం చేసింది అతడేనట

కీలక అంశాన్ని గుర్తించింది సీబీఐ. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు కమ్ మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డిని ఆయన ఇంట్లోనే అత్యంత దారుణంగా హతమార్చిన ఉదంతంగురించి తెలిసిందే. అయితే.. వివేకా హత్యకు గురయ్యారన్న విషయం బయటకు రావటానికి ముందు.. ఆయనకు గుండె పోటు వచ్చిందని.. బాత్రూంలో కుప్పకూలిపోయారంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మిగిలిన మీడియా సంస్థల సంగతి ఎలా ఉన్నా.. వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన మీడియా సంస్థలోనూ.. ఇదే తరహా కథనాలు ప్రసారమయ్యాయి.

అయితే.. వైఎస్ వివేకా మరణ వార్త లోకానికి తెలిసిన కాసేపటికే.. ఆయన మరణించింది గుండె పోటుతో కాదని.. దారుణ హత్యకు గురైన బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఆ తర్వాతే సీఎం జగన్ కుటుంబానికి చెందిన మీడియాలోనూ పాత వాదనకు చెక్ చెప్పి.. కొత్త వాదనను వినపించే ప్రయత్నం చేశారు. అయితే.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సొంత బాబాయ్ దారుణ హత్యకు గురైతే.. ఆ వార్తను గుండెపోటు వార్తగా ఎలా టెలికాస్ట్ చేశారన్నది ఇప్పటికి అర్థం కాని ప్రశ్నగా మారింది.

అయితే.. గుండెపోటుతో మరణించారంటూ తప్పుడు ప్రచారానికి కారణమైన వారిని తాజాగా సీబీఐ గుర్తించింది. ఈ తప్పుడు సిద్ధాంతంతో అందరిని మాయ చేయాలన్న ప్లాన్ చేసిన వారిలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిగా సీబీఐ గుర్తించింది. వివేకా డెడ్ బాడీ రక్తపు మడుగులో పడి ఉండటంతో పాటు శరీరంపై తీవ్ర గాయాలు కనిపిస్తున్నా.. గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం చేసింది శివశంకర్ రెడ్డినేనని.. ఇదే విషయాన్నిఆయన సాక్షి టీవీకి కూడా చెప్పినట్లుగా సీబీఐ వెల్లడించింది.

వివేకా గుండెపోటుతో మరణించారని అందరూ నమ్మేందుకు వీలుగా ఆయన పడక గది.. స్నానపు గదిలో రక్తపు మరకల్ని తుడిచేశారని.. హత్యకు సంబంధించిన ఆధారాలన్నింటిని ధ్వంసం చేసినట్లుగా సీబీఐ పేర్కొంది. అంతేకాదు.. వివేకా ఒంటి మీద ఉన్న గాయాలకు గజ్జల జై ప్రకాశ్ రెడ్డి అనే కాంపౌడర్ చేత బ్యాండేజీ వేయించి.. కట్లు కట్టించినట్లుగా గుర్తించామన్నారు. తాజాగా శివశంకర్ రెడ్డి పాత్రపై తమకు లభించిన ఆధారాల్ని కోర్టు ముందు ఉంచింది సీబీఐ. అంతేకాదు.. కేసు కీలక దశలో ఉందని.. ఇలాంటి వేళలో శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని.. ఒకవేళ ఇస్తే.. సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉందన్నారు.

ఈ వాదనకు నిదర్శనంగా ఈ కేసులో అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిరిని శివశంకర్ రెడ్డి ఈ ఏడాది మార్చిలో తన స్నేహితుడైన భయపురెడ్డి ఇంటికి పిలపించారని.. సీబీఐ ఎదుట నా పేరు కానీ.. మిగితా వాళ్ల పేర్లు కానీ చెప్పొద్దని బెదిరించారన్నారు. అలా చేస్తే.. నీ జీవితాన్ని సెటిల్ చేస్తానని దస్తగిరికి వార్నింగ్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. వివేకాను హత్య చేస్తే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తమకు రూ.40 కోట్లు ఇస్తానని చెప్పారని.. దీని వెనుక అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఉన్నట్లు ఎర్ర గంగిరెడ్డి.. సునీల్ యాదవ్.. ఉమాశంకర్ రెడ్డి.. షేక్ దస్తగిరిలతో చెప్పిన దస్తగిరి.. వాచ్ మన్ రంగన్న వాంగ్మూలాన్ని గుర్తుచేశారు. మొత్తంగా తప్పుడు ప్రచారానికి సూత్రధారి ఎవరన్న విషయంపై సీబీఐ క్లారిటీ ఇచ్చిందని చెప్పాలి.

Satya

Recent Posts

నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ మృతి

షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన…

9 minutes ago

NBK 111… ఎప్పుడు వస్తే బాగుంటుంది

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

1 hour ago

వరుణ్ తేజ్ పూర్తిగా రూటు మార్చేశాడు

వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…

2 hours ago

నాగబంధం.. ఈ కొత్త సౌండ్ ఎవరిది?

స్టార్లు లేకపోయినా సరే ఏకంగా వంద కోట్ల బడ్జెట్లో భారీగా తెరకెక్కి, కళ్లు చెదిరే విజువల్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన…

3 hours ago

చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్… అమ్మ కన్నీటి కథ

‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…

5 hours ago

పుష్ప విలన్ కామెడీ చేస్తే…

మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…

5 hours ago