అక్రమాస్తుల కేసుల విచారణలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కాకపోవడం పై సీబీఐ కోర్టులో ఆసక్తికరమైన చర్చ జరిగింది. హెటిరో, అరబిందో కంపెనీలకు భూ కేటాయింపులకు సంబంధించిన వివాదంపై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ప్రధాన నిందితుడైన జగన్ హాజరుకాని విషయాని న్యాయమూర్తి బీ. మధుసూదనరావు ప్రస్తావించారు. దాంతో జగన్ లాయర్ మాట్లాడతు విచారణలో వ్యక్తిగత మినహాయింపు కోరుతూ పిటిషన్ వేసిన విషయాన్ని చెప్పారు. దీనికి న్యాయమూర్తి అంగీకరించలేదు.
ప్రతి విచారణ సందర్భంగా ఏదో కారణం చెప్పి ప్రధాన నిందితుడు విచారణకు హాజరు కావడం లేదని, బెయిల్ షరతుల ప్రకారం ప్రతి విచారణకు నిందితుడు హాజరుకావాల్సిందే కదా అంటు జగన్ లాయర్ ను నిలదీశారు. అప్పుడు జగన్ తరపున లాయర్ మాట్లాడుతూ బెయిల్ షరుతుల సమయంలో నిందితుడు కేవలం ఒక ఎంఎల్ఏ, ఒక ఎంపీగా మాత్రమే ఉన్నారని కానీ ఇపుడు ముఖ్యమంత్రి అన్న విషయాన్ని గుర్తు చేశారు.
అంతేకాకుండా ఒకపుడు విచారణ నెల రోజులకు ఒకసారి జరిగేదని కానీ ఇపుడు వారంలో ఐదు రోజులు జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. బెయిల్ మంజూరు చేసినప్పటి పరిస్ధితులకు ఇప్పటి పరిస్థితుల్లో వచ్చిన తేడాను జగన్ లాయర్ న్యాయమూర్తికి వివరించారు. ఒకవేళ విచారణ సందర్భంగా తమ క్లైంట్ తప్పక హాజరు కావాల్సిందే అని ఆదేశిస్తే హాజరవుతారని లాయర్ చెప్పారు. ఇదే విషయాన్ని మెమో రూపంలో చెప్పాలని న్యాయమూర్తి చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ మధ్య వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా జగన్ బెయిల్ రద్దు చేయాలని, విచారణలో వ్యక్తిగత మినహాయింపు ఇవ్వకూడదని కేసు వేశారు. అయితే ఆయన పిటీషన్ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టేసింది. దాంతో ఎంపీ వెంటనే ఇదే విషయాన్ని హైకోర్టులో సవాలు చేశారు. హైకోర్టులో ఈ కేసు విచారణలో ఉంది. విచిత్రమేమిటంటే జగన్ బెయిల్ రద్దు చేయాలన్న తన డిమాండ్ కు అవసరమైన సాక్ష్యాలను మాత్రం ఎంపీ చూపటం లేదు.
అలాగే విచారణలో జగన్ వ్యక్తిగత మినహాయింపును రద్దు చేయమని కోరుతున్నది చెప్పటంలేదు. ఎంతసేపు బెయిల్ రద్దు చేయాలని, వ్యక్తిగత మినహాయింపు ఇవ్వకూడదని మాత్రమే కోరుతున్నారు. అసలు జగన్ కేసులకు రఘురామకు ఎలాంటి సంబంధం లేదు. జగన్ కేసుల్లో ఎంపీ సాక్షీ కాదు అలాగని బాధితుడూ కాదు. ఏ విధంగాను సంబంధంలేని ఎంపీ జగన్ మీద వ్యక్తిగత కక్షతోనే వరసబెట్టి కేసులు వేస్తున్నారు.
This post was last modified on December 22, 2021 11:38 am
ఈ మధ్య కాలంలో థియేటర్లలో సుదీర్ఘ కాలం ఆడిన సినిమా.. ‘దురంధర్’. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటికీ…
జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం…
మెటా (Meta) ప్రస్తుతం అందరికీ పరిచయం ఉన్న పేరు. వాట్సాప్ ఈ సంస్థకు చెందినదనే విషయం తెలిసిందే. అయితే భారత్లో…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.…
వరల్డ్ మ్యూజిక్ ఐకాన్ మైకేల్ జాక్సన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'మైకేల్' ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఆంటోనీ ఫుక్వా…
ఆ మధ్య డెకాయిట్ టీజర్ లాంచ్ జరిగినప్పుడు పోటీ గురించి ప్రస్తావిస్తూ అడివి శేష్ ఒక మాట అనడం అభిమానులకు…