Political News

ఇండియాలో డేంజర్ బెల్స్ ?

ప్రపంచదేశాల్లో లాగే ఇండియాలో కూడా ఒమిక్రాన్ కేసులు చాలా స్పీడుగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికి అధికారికంగా నమోదైన కేసులే 170 ఉన్నాయి. ఇంకా నిర్ధారణ కానీ, పరీక్షల దశలో ఉన్న కేసులు ఎన్ని ఉన్నాయో తెలీదు. మొత్తానికి ఒమిక్రాన్ కేసుల తీవ్రత అయితే చాలా స్పీడుగా పెరిగిపోతోందని అర్ధమవుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నమోదైన కేసులన్నీ మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, కర్నాటకలోనే ఎక్కువగా ఉన్నాయి.

మహారాష్ట్రలో అత్యధికంగా 60 కేసులు నమోదయ్యాయి. తర్వాత తెలంగాణలో 28 కేసుల వరకు బయటపడ్డాయి. అలాగే కర్ణాటక, కేరళలో కూడా చెరో 35 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, గుజరాత్ లో కూడా కేసులు నమోదయ్యాయి. ఇంకా చాలా కేసుల విషయం తేలాల్సుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కన్ఫర్మ్ అయిన ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికానికి ట్రావెల్ బ్యాక్ గ్రౌండ్ ఉండటమే. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు లేదా విదేశాల నుంచి తిరిగి వచ్చిన వాళ్ళల్లోనే ఎక్కువగా ఒమిక్రాన్ వైరస్ బయటపడుతోంది.

ఎప్పుడైతే ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయో వెంటనే ప్రభుత్వాలన్నీ అలర్టవుతున్నాయి. పబ్లిక్ ప్లేసులపై ఆంక్షలు విధించటంతో పాటు నైట్ కర్ఫ్యూలు విధించే ఆలోచన కూడా చేస్తున్నాయి. మాస్కు ధరించటాన్ని కంపల్సరీ చేశాయి. ఒక వైపు ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నా మరోవైపు కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. మన దగ్గర ఇలాగుంటే ఐరోపా దేశాల్లో చాలా స్పీడుగా కేసులు పెరిగిపోతున్నాయి.

బ్రిటన్లో వేలాది ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. అంతేకాకుండా ఒక్కరోజులోనే పదుల మరణించటం బ్రిటన్లో కలకలం రేపుతోంది. చాలా దేశాల్లో పరిస్ధితి ఇలాగే ఉంది. ఇక ఏపీలో అయితే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఇంటింటి ఆరోగ్య సర్వే మొదలుపెట్టింది. వాలంటీర్లు+ఆశా వర్కర్లను ప్రతి ఇంటికి పంపటం ద్వారా ఇంట్లోని సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై నివేదిక తెప్పించుకుంటోంది. మరి చివరకు ఒమిక్రాన్ ఎంతటి అలజడి రేపుతుందో ఏమో చూడాల్సిందే.

This post was last modified on December 21, 2021 9:55 pm

Share
Show comments
Published by
Satya
Tags: omicron

Recent Posts

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం…

2 hours ago

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు…

5 hours ago

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

6 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

9 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

10 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

11 hours ago