ప్రపంచదేశాల్లో లాగే ఇండియాలో కూడా ఒమిక్రాన్ కేసులు చాలా స్పీడుగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికి అధికారికంగా నమోదైన కేసులే 170 ఉన్నాయి. ఇంకా నిర్ధారణ కానీ, పరీక్షల దశలో ఉన్న కేసులు ఎన్ని ఉన్నాయో తెలీదు. మొత్తానికి ఒమిక్రాన్ కేసుల తీవ్రత అయితే చాలా స్పీడుగా పెరిగిపోతోందని అర్ధమవుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నమోదైన కేసులన్నీ మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, కర్నాటకలోనే ఎక్కువగా ఉన్నాయి.
మహారాష్ట్రలో అత్యధికంగా 60 కేసులు నమోదయ్యాయి. తర్వాత తెలంగాణలో 28 కేసుల వరకు బయటపడ్డాయి. అలాగే కర్ణాటక, కేరళలో కూడా చెరో 35 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, గుజరాత్ లో కూడా కేసులు నమోదయ్యాయి. ఇంకా చాలా కేసుల విషయం తేలాల్సుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కన్ఫర్మ్ అయిన ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికానికి ట్రావెల్ బ్యాక్ గ్రౌండ్ ఉండటమే. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు లేదా విదేశాల నుంచి తిరిగి వచ్చిన వాళ్ళల్లోనే ఎక్కువగా ఒమిక్రాన్ వైరస్ బయటపడుతోంది.
ఎప్పుడైతే ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయో వెంటనే ప్రభుత్వాలన్నీ అలర్టవుతున్నాయి. పబ్లిక్ ప్లేసులపై ఆంక్షలు విధించటంతో పాటు నైట్ కర్ఫ్యూలు విధించే ఆలోచన కూడా చేస్తున్నాయి. మాస్కు ధరించటాన్ని కంపల్సరీ చేశాయి. ఒక వైపు ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నా మరోవైపు కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. మన దగ్గర ఇలాగుంటే ఐరోపా దేశాల్లో చాలా స్పీడుగా కేసులు పెరిగిపోతున్నాయి.
బ్రిటన్లో వేలాది ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. అంతేకాకుండా ఒక్కరోజులోనే పదుల మరణించటం బ్రిటన్లో కలకలం రేపుతోంది. చాలా దేశాల్లో పరిస్ధితి ఇలాగే ఉంది. ఇక ఏపీలో అయితే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఇంటింటి ఆరోగ్య సర్వే మొదలుపెట్టింది. వాలంటీర్లు+ఆశా వర్కర్లను ప్రతి ఇంటికి పంపటం ద్వారా ఇంట్లోని సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై నివేదిక తెప్పించుకుంటోంది. మరి చివరకు ఒమిక్రాన్ ఎంతటి అలజడి రేపుతుందో ఏమో చూడాల్సిందే.
This post was last modified on December 21, 2021 9:55 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…