Political News

జ‌గ‌న్ పుట్టిన రోజు.. రిట‌ర్న్ గిఫ్ట్

వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కుటుంబంలో ఏటా అత్యంత ఆడంబ‌రంగా నిర్వ‌హించుకుం టున్న కార్య‌క్ర‌మం జ‌గ‌న్ పుట్టిన రోజు వేడుక‌. ముఖ్యంగా జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత‌.. ఈ వేడుక‌ల‌కు మ‌రింత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయ‌న ఇద్ద‌రు కుమార్తెలు ఎక్క‌డ ఉన్నా.. ఆ రోజు మాత్రం తండ్రి స‌మ‌క్షంలో ఉండాల్సిందే. ఇక‌, గ‌త ఏడాది త‌ల్లి విజ‌య‌మ్మ కూడా పుట్టినరోజు వేడుక‌ల్లో పాల్గొన్నారు.

ఇక‌, ఇప్పుడు ఏడాది పుట్టిన రోజుకు అత్యంత విశేషం ఉంది. అదేంటంటే.. ఈ పుట్టిన రోజుతో జ‌గ‌న్ 50 ఏళ్ల వ‌సంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ క్ర‌మంలో ఈ పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని.. పార్టీలో నాయ‌కులు రెడీ అయ్యారు. మ‌రీ ముఖ్యంగా మంత్రులు కావాల‌ని..ఆశ‌లు ప‌డుతున్న వారు.. ఈ అవ‌కాశాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

దీంతో జ‌గ‌న్ పుట్టిన రోజు వేడుక‌ల‌ను అంగ‌రంగ వైభ‌వంగా చేసి.. ఆయ‌న దృష్టిలో ప‌డేందుకు.. కోటి రూపాయ‌ల‌కు త‌క్కువ కాకుండా.. పెద్ద పెద్ద గిఫ్టుల‌ను జ‌గ‌న్‌కు ఇవ్వ‌నున్నార‌ని.. ఒక‌రిద్ద‌రి నుంచి స‌మాచారం. ముఖ్యంగా తాము ఇచ్చిన గిఫ్టుతో జ‌గ‌న్ ఫిదా అయిపోయి.. త‌మ‌కు మంత్రి ప‌ద‌విని రిట‌ర్న్ గిఫ్ట్‌గా ఇచ్చేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ట‌. ఈ జాబితాలో గుంటూరుకు చెందిన ఓ మ‌హిళా నాయ‌కురాలు.. అదేవిధంగా అనంత‌పురం జిల్లాకు చెందిన మ‌రో మ‌హిళా ఎమ్మెల్యే, విశాఖ‌కు చెందిన యువ నాయ‌కుడు, తూర్పుకు చెందిన‌.. మ‌రో కాపు నాయ‌కుడు.. ముందు వ‌రుస‌లో ఉన్నార‌ని అంటున్నారు.

అంటే.. వీరంతా కూడా మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్న‌వారే. వీరికి జ‌గ‌న్ క‌రుణిస్తారా? లేదా? అనే సంశ‌యం అయితే ఉంది. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను ఆక‌ట్టుకునేందుకు వారు భారీ గిఫ్టుల‌తో తాడేప‌ల్లికి చేరుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. దీని వెనుక‌.. జ‌గన్ ఇచ్చే రిట‌ర్న్ గిఫ్టుగా మంత్రి ప‌ద‌విని పొందాల‌ని.. వారు ఆశిస్తున్న‌ట్టు స‌ద‌రు నేత‌ల అనుచ‌రులు చెబుతున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on December 20, 2021 5:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

4 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

7 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

8 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

9 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

9 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

9 hours ago