వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టిగానే కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రమంతా విస్తృతంగా తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ సభలు నిర్వహిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని వదిలేసిన మాజీలందరితోను భేటీ అవుతూ వాళ్ళని మళ్లీ పార్టీలోకి లాక్కొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒకవైపు ఈ పనులు చేస్తూనే మరోవైపు తనంటే మండిపోతున్న సీనియర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద తనతో ఎవరు కలిసొచ్చినా రాకపోయినా తాను మాత్రం క్యాడర్లో జోష్ నింపేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇపుడు చేయబోతున్న పని మాత్రం చాలా కీలకమైనది. అదేమిటంటే గ్రామస్థాయి నుండి జిల్లాస్థాయి వరకు అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా కమిటీలను మార్చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారట.
పీసీసీ అధ్యక్షుడు అయిన దగ్గర నుండి ఇప్పటివరకు జిల్లాల్లో ఎవరెవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు ? పీసీసీ కార్యవర్గంలో పనిచేస్తున్నదెవరు ? కొత్తగా కార్యవర్గంలోకి తీసుకోవాల్సిందెవరిని అనే విషయంలో ఓ క్లారిటి తెచ్చుకున్నారట. దీని ప్రకారం గ్రామ స్థాయి నుంచి జిల్లాల కార్యవర్గాల వరకు మార్పులు చేర్పులు చేయబోతున్నారట. ఇందుకు ఇప్పటికే అధిష్టానం నుండి అనుమతి కోరినట్లు సమాచారం.
ఒకవేళ అధిష్టానం గనుక ఓకే అంటే కొన్ని జిల్లాల అధ్యక్షులతో పాటు కార్యవర్గంలో భారీగా మార్పులు, చేర్పులు చేయబోతున్నారని తెలిసింది. జిల్లా పార్టీలకు అధ్యక్షులుగా మార్చాల్సిందెవరిని ? పగ్గాలు అప్పగించాల్సిందెవరికి అనే విషయంలో ఇప్పటికే రేవంత్ పెద్ద కసరత్తే చేశారట. అంటే జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గం దగ్గర నుండి రాష్ట్రస్ధాయి కార్యవర్గంలో కూడా పూర్తిగా తన వర్గం నేతలను, బాగా పనిచేసే వారినే తీసుకోవాలని అనుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరున్నా చేసేదిదే కాబట్టి ఇందులో తప్పుపట్టాల్సిందేమీ లేదు.
అంతర్గత సమస్యలతో అవస్తలు పడుతున్న పార్టీకి ప్రక్షాళనతోనే జవాబు చెప్పాలనేది రేవంత్ ఆలోచనగా సీనియర్లు చెబుతున్నారు. కొంతమంది కార్యవర్గంలో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో కేసీయార్ కోవర్టులు చాలామందే ఉన్నారన్నది రేవంత్ గట్టి అనుమానం. అనుమానమే కాదు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నట్లు రేవంత్ ఇప్పటికే ప్రకటించున్నారు. కాబట్టి రేవంత్ మార్కు ప్రక్షాళనకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నదే కీలకం.
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…