రాజధాని అమరావతిని మార్చడం ఎవరివల్లా కాదని అధికార పార్టీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరా జు ఉన్నారు. అమరావతి రైతుల న్యాయస్థానం-దేవస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ‘అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ’లో ఆయన పాల్గొన్నారు. ఆసాంతం హుందాగా.. అందరినీ పలకరిస్తూ.. ఆయన సభలో హల్చల్ చేశారు. రాజధానిపై పూర్తిగా తనకు నమ్మకం ఉందని.. రాజధాని ఎక్కడికీ పోదని.. ఆయన వ్యాఖ్యానించారు.
రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని.. కొంతకాలం ఓపిక పడితే అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందన్నారు. పాదయాత్ర చేసిన మహిళల త్యాగానికి ఏదీ సాటిరాదన్నారు. చంద్రబాబు అమరావతి రూపశిల్పి అని కొనియాడారు రఘురామ.. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్గా రూపొం దించారన్నారు. రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్నో కుట్రలకు పాల్పడిందన్నా రు. మహిళలని కూడా చూడకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, చివరికి బయో టాయిలెట్లను కూడా అడ్డుకున్నారని ప్రభుత్వంపై రఘురామ మండిపడ్డారు.
అయినప్పటికీ.. రాజధాని రైతులు.. విజయంసాధిస్తారని.. కష్టపడిన వారు సుఖపడడం చరిత్రలో కొత్తకాద ని.. ఎప్పటికైనా విజయం రైతులదేనని వ్యాఖ్యానించారు. తాను ఇక్కడకు వస్తే.. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో.. తనకు తెలుసునని.. అయినప్పటికీ.. తాను వచ్చానని.. ఎందుకంటే.. ఇంత మంది రైతులు, మహిళలు ధైర్యం చేయగాలేంది.. తాను చేస్తే.. ఏమవుతుందని.. అనుకున్నానని చెప్పారు. రైతులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.
కాగా, రఘురామ కృష్ణ రాజు ఆది నుంచి కూడా రాజధాని అమరావతికి పాజిటివ్గానే స్పందిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయనకు వైసీపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదంసాగుతున్న దరిమిలా.. ఢిల్లీ నుంచే తరచుగా ఆయన స్పందిస్తున్నారు. అయితే.. ఇప్పుడు.. అమరావతి రైతుల జేఏసీ ఆహ్వానం మేరకు రఘురామరాజు హాజరై ప్రసంగించారు. వారిని ఉత్సాహ పరిచారు. ధైర్యం చెప్పారు. అమరావతి నగరం ఎక్కడికీ పోదని భరోసా ఇచ్చారు.
This post was last modified on December 17, 2021 8:05 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…