రాజధాని అమరావతిని మార్చడం ఎవరివల్లా కాదని అధికార పార్టీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరా జు ఉన్నారు. అమరావతి రైతుల న్యాయస్థానం-దేవస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ‘అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ’లో ఆయన పాల్గొన్నారు. ఆసాంతం హుందాగా.. అందరినీ పలకరిస్తూ.. ఆయన సభలో హల్చల్ చేశారు. రాజధానిపై పూర్తిగా తనకు నమ్మకం ఉందని.. రాజధాని ఎక్కడికీ పోదని.. ఆయన వ్యాఖ్యానించారు.
రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని.. కొంతకాలం ఓపిక పడితే అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందన్నారు. పాదయాత్ర చేసిన మహిళల త్యాగానికి ఏదీ సాటిరాదన్నారు. చంద్రబాబు అమరావతి రూపశిల్పి అని కొనియాడారు రఘురామ.. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్గా రూపొం దించారన్నారు. రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్నో కుట్రలకు పాల్పడిందన్నా రు. మహిళలని కూడా చూడకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, చివరికి బయో టాయిలెట్లను కూడా అడ్డుకున్నారని ప్రభుత్వంపై రఘురామ మండిపడ్డారు.
అయినప్పటికీ.. రాజధాని రైతులు.. విజయంసాధిస్తారని.. కష్టపడిన వారు సుఖపడడం చరిత్రలో కొత్తకాద ని.. ఎప్పటికైనా విజయం రైతులదేనని వ్యాఖ్యానించారు. తాను ఇక్కడకు వస్తే.. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో.. తనకు తెలుసునని.. అయినప్పటికీ.. తాను వచ్చానని.. ఎందుకంటే.. ఇంత మంది రైతులు, మహిళలు ధైర్యం చేయగాలేంది.. తాను చేస్తే.. ఏమవుతుందని.. అనుకున్నానని చెప్పారు. రైతులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.
కాగా, రఘురామ కృష్ణ రాజు ఆది నుంచి కూడా రాజధాని అమరావతికి పాజిటివ్గానే స్పందిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయనకు వైసీపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదంసాగుతున్న దరిమిలా.. ఢిల్లీ నుంచే తరచుగా ఆయన స్పందిస్తున్నారు. అయితే.. ఇప్పుడు.. అమరావతి రైతుల జేఏసీ ఆహ్వానం మేరకు రఘురామరాజు హాజరై ప్రసంగించారు. వారిని ఉత్సాహ పరిచారు. ధైర్యం చెప్పారు. అమరావతి నగరం ఎక్కడికీ పోదని భరోసా ఇచ్చారు.
This post was last modified on December 17, 2021 8:05 pm
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…