రాజధాని అమరావతిని మార్చడం ఎవరివల్లా కాదని అధికార పార్టీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరా జు ఉన్నారు. అమరావతి రైతుల న్యాయస్థానం-దేవస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ‘అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ’లో ఆయన పాల్గొన్నారు. ఆసాంతం హుందాగా.. అందరినీ పలకరిస్తూ.. ఆయన సభలో హల్చల్ చేశారు. రాజధానిపై పూర్తిగా తనకు నమ్మకం ఉందని.. రాజధాని ఎక్కడికీ పోదని.. ఆయన వ్యాఖ్యానించారు.
రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని.. కొంతకాలం ఓపిక పడితే అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందన్నారు. పాదయాత్ర చేసిన మహిళల త్యాగానికి ఏదీ సాటిరాదన్నారు. చంద్రబాబు అమరావతి రూపశిల్పి అని కొనియాడారు రఘురామ.. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్గా రూపొం దించారన్నారు. రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్నో కుట్రలకు పాల్పడిందన్నా రు. మహిళలని కూడా చూడకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, చివరికి బయో టాయిలెట్లను కూడా అడ్డుకున్నారని ప్రభుత్వంపై రఘురామ మండిపడ్డారు.
అయినప్పటికీ.. రాజధాని రైతులు.. విజయంసాధిస్తారని.. కష్టపడిన వారు సుఖపడడం చరిత్రలో కొత్తకాద ని.. ఎప్పటికైనా విజయం రైతులదేనని వ్యాఖ్యానించారు. తాను ఇక్కడకు వస్తే.. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో.. తనకు తెలుసునని.. అయినప్పటికీ.. తాను వచ్చానని.. ఎందుకంటే.. ఇంత మంది రైతులు, మహిళలు ధైర్యం చేయగాలేంది.. తాను చేస్తే.. ఏమవుతుందని.. అనుకున్నానని చెప్పారు. రైతులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.
కాగా, రఘురామ కృష్ణ రాజు ఆది నుంచి కూడా రాజధాని అమరావతికి పాజిటివ్గానే స్పందిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయనకు వైసీపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదంసాగుతున్న దరిమిలా.. ఢిల్లీ నుంచే తరచుగా ఆయన స్పందిస్తున్నారు. అయితే.. ఇప్పుడు.. అమరావతి రైతుల జేఏసీ ఆహ్వానం మేరకు రఘురామరాజు హాజరై ప్రసంగించారు. వారిని ఉత్సాహ పరిచారు. ధైర్యం చెప్పారు. అమరావతి నగరం ఎక్కడికీ పోదని భరోసా ఇచ్చారు.
This post was last modified on December 17, 2021 8:05 pm
ఇండస్ట్రీలో అంతే. ఒక్క హిట్ జాతకాలను మార్చేస్తుంది. ఒక్క ఫ్లాప్ ఎక్కడికో కిందకు తీసుకెళ్తుంది. డ్రాగన్ రూపంలో సూపర్ సక్సెస్…
లోకనాయకుడు కమల్ హాసన్ చాలా ప్లాన్డ్ గా ప్రమోషన్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆకట్టుకునేలా ఉంది. వచ్చే నెల జూన్…
భారత్ అంటే నరనరాన పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు… ఇప్పటిదాకా భారత్ పై లెక్కలేనన్ని దాడులకు దిగారు.…
ఇప్పటి దర్శకులకు వేగం అలవడటం లేదు. కారణాలు సవాలక్ష ఉండొచ్చు కానీ పరిశ్రమకు అవసరమైన స్పీడ్ అంది పుచ్చుకుని ఎక్కువ…
నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత కొత్త జీవిత భాగస్వామి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం చూస్తూనే…
వైసీపీ అధినేత జగన్ .. ఇటీవల పార్టీ పార్లమెంటరీ స్థాయి ఇంచార్జ్లను నియమించారు. ఇది జరిగి దాదాపు వారం అవుతోంది.…