రాజధాని అమరావతిని మార్చడం ఎవరివల్లా కాదని అధికార పార్టీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరా జు ఉన్నారు. అమరావతి రైతుల న్యాయస్థానం-దేవస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ‘అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ’లో ఆయన పాల్గొన్నారు. ఆసాంతం హుందాగా.. అందరినీ పలకరిస్తూ.. ఆయన సభలో హల్చల్ చేశారు. రాజధానిపై పూర్తిగా తనకు నమ్మకం ఉందని.. రాజధాని ఎక్కడికీ పోదని.. ఆయన వ్యాఖ్యానించారు.
రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని.. కొంతకాలం ఓపిక పడితే అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందన్నారు. పాదయాత్ర చేసిన మహిళల త్యాగానికి ఏదీ సాటిరాదన్నారు. చంద్రబాబు అమరావతి రూపశిల్పి అని కొనియాడారు రఘురామ.. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్గా రూపొం దించారన్నారు. రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్నో కుట్రలకు పాల్పడిందన్నా రు. మహిళలని కూడా చూడకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, చివరికి బయో టాయిలెట్లను కూడా అడ్డుకున్నారని ప్రభుత్వంపై రఘురామ మండిపడ్డారు.
అయినప్పటికీ.. రాజధాని రైతులు.. విజయంసాధిస్తారని.. కష్టపడిన వారు సుఖపడడం చరిత్రలో కొత్తకాద ని.. ఎప్పటికైనా విజయం రైతులదేనని వ్యాఖ్యానించారు. తాను ఇక్కడకు వస్తే.. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో.. తనకు తెలుసునని.. అయినప్పటికీ.. తాను వచ్చానని.. ఎందుకంటే.. ఇంత మంది రైతులు, మహిళలు ధైర్యం చేయగాలేంది.. తాను చేస్తే.. ఏమవుతుందని.. అనుకున్నానని చెప్పారు. రైతులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.
కాగా, రఘురామ కృష్ణ రాజు ఆది నుంచి కూడా రాజధాని అమరావతికి పాజిటివ్గానే స్పందిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయనకు వైసీపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదంసాగుతున్న దరిమిలా.. ఢిల్లీ నుంచే తరచుగా ఆయన స్పందిస్తున్నారు. అయితే.. ఇప్పుడు.. అమరావతి రైతుల జేఏసీ ఆహ్వానం మేరకు రఘురామరాజు హాజరై ప్రసంగించారు. వారిని ఉత్సాహ పరిచారు. ధైర్యం చెప్పారు. అమరావతి నగరం ఎక్కడికీ పోదని భరోసా ఇచ్చారు.
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…