Political News

అమ‌రావ‌తి ఎక్క‌డికీ పోదు: RRR

రాజధాని అమరావతిని మార్చడం ఎవరివల్లా కాదని అధికార పార్టీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరా జు ఉన్నారు. అమరావతి రైతుల న్యాయస్థానం-దేవస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ‘అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ’లో ఆయన పాల్గొన్నారు. ఆసాంతం హుందాగా.. అంద‌రినీ ప‌ల‌క‌రిస్తూ.. ఆయ‌న స‌భ‌లో హ‌ల్చ‌ల్ చేశారు. రాజ‌ధానిపై పూర్తిగా త‌న‌కు న‌మ్మ‌కం ఉందని.. రాజ‌ధాని ఎక్క‌డికీ పోద‌ని.. ఆయ‌న వ్యాఖ్యానించారు.

రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని.. కొంతకాలం ఓపిక పడితే అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందన్నారు. పాదయాత్ర చేసిన మహిళల త్యాగానికి ఏదీ సాటిరాదన్నారు. చంద్రబాబు అమరావతి రూపశిల్పి అని కొనియాడారు రఘురామ.. అమరావతిని సెల్ఫ్‌ ఫైనాన్సింగ్ మోడల్‌గా రూపొం దించారన్నారు. రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్నో కుట్రలకు పాల్పడిందన్నా రు. మహిళలని కూడా చూడకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, చివరికి బయో టాయిలెట్లను కూడా అడ్డుకున్నారని ప్రభుత్వంపై రఘురామ మండిపడ్డారు.

అయిన‌ప్ప‌టికీ.. రాజ‌ధాని రైతులు.. విజ‌యంసాధిస్తార‌ని.. క‌ష్ట‌ప‌డిన వారు సుఖ‌ప‌డ‌డం చ‌రిత్ర‌లో కొత్త‌కాద ని.. ఎప్ప‌టికైనా విజ‌యం రైతుల‌దేన‌ని వ్యాఖ్యానించారు. తాను ఇక్క‌డ‌కు వ‌స్తే.. ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయో.. త‌న‌కు తెలుసున‌ని.. అయిన‌ప్ప‌టికీ.. తాను వ‌చ్చాన‌ని..  ఎందుకంటే.. ఇంత మంది రైతులు, మ‌హిళ‌లు ధైర్యం చేయ‌గాలేంది.. తాను చేస్తే.. ఏమవుతుంద‌ని.. అనుకున్నాన‌ని చెప్పారు. రైతుల‌కు త‌న సంపూర్ణ మద్ద‌తు ఉంటుంద‌ని చెప్పారు.

కాగా, ర‌ఘురామ కృష్ణ రాజు ఆది నుంచి కూడా రాజ‌ధాని అమ‌రావ‌తికి పాజిటివ్‌గానే స్పందిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న‌కు వైసీపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య జ‌రుగుతున్న వివాదంసాగుతున్న ద‌రిమిలా.. ఢిల్లీ నుంచే త‌ర‌చుగా ఆయ‌న స్పందిస్తున్నారు. అయితే.. ఇప్పుడు.. అమ‌రావ‌తి రైతుల జేఏసీ ఆహ్వానం మేర‌కు ర‌ఘురామ‌రాజు హాజ‌రై ప్ర‌సంగించారు. వారిని ఉత్సాహ ప‌రిచారు. ధైర్యం చెప్పారు. అమ‌రావ‌తి న‌గ‌రం ఎక్క‌డికీ పోద‌ని భ‌రోసా ఇచ్చారు. 

This post was last modified on December 17, 2021 8:05 pm

Share

Recent Posts

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

15 minutes ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

18 minutes ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

58 minutes ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

4 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

4 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

5 hours ago