ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో న్యాయ స్థానం టు దేవ స్థానం పేరుతో అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, పాదయాత్ర ముగింపు సందర్భంగా రైతులు నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించారు.
ఈ క్రమంలోనే రైతులు అనుమతి కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అమరావతి రైతుల ముగింపు సభకు హైకోర్టు అనుమతినిచ్చింది. డిసెంబరు 17వతేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సభ నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సభ జరుపుకోవాలని సూచించింది.
కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం సభకు అనుమతినివ్వాలని అమరావతి పరిరక్షణ సమితి తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సభకు అనుమతినిచ్చింది. అయితే, ఈ సభకు అనుమతివ్వడం వల్ల రెండు ప్రాంతాల మధ్య ఘర్షణలు ఏర్పడే ప్రమాదముందని ప్రభుత్వ తరఫు న్యాయవాది సుధాకర్రెడ్డి వాదించారు.
ఇరు వర్గాల వాదనలను విన్న కోర్టు సభ నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది. మరోవైపు, ఈ రోజు తిరుమలలో వెంకన్నను దర్శించుకునేందుకు రైతులకు టీటీడీ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. 500 మంది రైతులు ఒకేసారి దర్శనం చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
This post was last modified on December 15, 2021 8:31 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…