కొంత కాలం తర్వాత టీఆర్ఎస్ పార్టీలో తాజాగా సందడి కనిపించింది. ఆ పార్టీ నేతల ముఖాల్లో ఆనందం దర్శనమిచ్చింది. అందుకు కారణం ఎన్నికలు జరిగిన ఆరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడమే. ఇప్పటికే ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఆరు ఆ పార్టీకే ఏకగ్రీవమయ్యాయి. మిగతా ఆరు స్థానాలకు పోలింగ్ జరగ్గా వాటిలోనే గులాబీ జెండానే ఎగిరింది. దీంతో గులాబి దళం ఫుల్ జోష్లో మునిగిపోయింది. ఈ సంతోషంలో ఆ పార్టీ అగ్ర నాయకులు తమకు నచ్చినట్లు ప్రకటనలు జారీ చేశారు. ఇక మంత్రి కేటీఆర్ అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్కు తిరుగులేదని, పార్టీకి ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ పట్టం కడుతున్నారని మురిసిపోయారు.
ఆ ఓటములు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలను గాను అన్ని సొంతం చేసుకోవడంతో టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ ఘన విజయం సాధిస్తూ వస్తోందని తెలిపారు. అయితే ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలపై విపక్షాలు ఎదురు దాడి చేస్తున్నాయి. కేటీఆర్ గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారేమోనని టీఆర్ఎస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండగేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
2014 ఎన్నికల్లో తొలిసారి గెలిచిన తర్వాత టీఆర్ఎస్కు తిరుగులేదని అంతా అనుకున్నారు. 2018 ముందస్తు ఎన్నికల్లోనూ అదే నిజమైంది. కానీ గతేడాది కాలంగా ఆ పార్టీ పరిస్థితి మారింది. బీజేపీ, కాంగ్రెస్ పుంజుకునే ప్రయత్నాలు చేయడంతో కారు పార్టీ వెనకబడింది. అందుకు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇక సవాలే..
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్పై గెలిచిన బీజేపీ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక ఆ పార్టీ జోరు పెరిగింది. ఇక ఇటీవల కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ విజయంతో బీజేపీ దూకుడు మరింత పెరిగింది. ఇప్పుడా పార్టీ టీఆర్ఎస్పై అసంతృప్తితో ఉన్న నేతలను అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులపై కన్నేసింది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ కూడా పరుగులు పెడుతోంది. ఇక మరోవైపు వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కేసీఆర్ ఇచ్చిన హామీలను మర్చిపోవడం.. నిరుద్యోగులను పట్టించుకోవడం, వరి కొనుగోళ్ల వివాదం, దళిత బంధు ఊసు ఎత్తకపోవడం ఇలా అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్పై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయడం ఆ పార్టీకి అంత సులువేం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
This post was last modified on December 15, 2021 6:19 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…