Political News

మోడీతో చెప్పేంత దమ్ముందా?

దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అవబోతున్నారు. తెలంగాణా, ఏపీ, కర్నాటక రాష్ట్రాల ఎంపీలు, ముఖ్యనేతలకు మోడీ బ్రేక్ ఫాస్ట్ ఇస్తున్నారు. పై రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, సమస్యలు, పరిష్కారాలపై మోడీ చర్చిస్తారట. దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేకంగా మోడీ భేటీ అవ్వడం బహుశా ఇదే మొదటిసారి. భేటీ అయితే జరుగుతుంది కానీ అందులో ఎంపీలు, ముఖ్యనేతలు వాస్తవ పరిస్థితులను మోడీకి వివరిస్తారా ? అన్నదే అసలైన ప్రశ్న.

2014లో జరిగిన రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ ప్రయోజనాల కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వం కొన్ని హామీలనిచ్చింది. ప్రత్యేక హోదా, వైజాగ్ ప్రత్యేక రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు లాంటి అనేక హామీలున్నాయి. వీటిల్లో చాలా హామీలను నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాతే తుంగలో తొక్కారు. 2014 ఎన్నికల ప్రచారంలో హోదా, రైల్వే జోన్ లాంటి హామీలను ప్రస్తావించిన మోడీ తర్వాత వాటిని పూర్తిగా గాలికొదిలేశారు.

ఏపీ ప్రయోజనాల విషయంలో అడుగడుగునా మోడీ దెబ్బ కొడుతూనే ఉన్నారు. ఇలాంటి అనేక కారణాల వల్లే జనాలు కూడా కాంగ్రెస్ తో పాటు బీజేపీని కూడా ఎన్నికల సమయంలో బొంద పెట్టేస్తున్నారు. కాంగ్రెస్ కు అయినా బీజేపీకి అయినా ఎన్నికల్లో జనాలు ఎక్కడా డిపాజిట్లు కూడా ఇవ్వటం లేదు. పార్టీ బలోపేతమవ్వాలంటే ముందు ఏపీ ప్రయోజనాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే సాధ్యం కాదు. మరి ఈ విషయాన్ని ఎంపీలు, ముఖ్యనేతలు మోడీకి చెప్పే ధైర్యం చేయగలరా ?

ఫలానా పార్టీ తమను మోసం చేసిందని జనాలు ఫిక్సయిన తర్వాత మళ్ళీ ఆ పార్టీని జనాలు దగ్గరకు తీసుకోరు. జనాల మనసులు గెలవాలంటే సదరు పార్టీ తన చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సుంటుంది. కానీ బీజేపీ పదే పదే జనాలను మోసం చేస్తునే ఉంది. పైగా ఈరోజు భేటీలో సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి, సత్యమూర్తి, కన్నా లక్ష్మీనారాయణ హాజరవబోతున్నారు.

వీరిలో టీజీ వెంకటేష్ మాత్రమే కాస్తనయం. ఎందుకంటే టీజీ ఎంఎల్ఏగా రెండుమూడుసార్లు గెలిచున్నారు. మిగిలిన వారిలో ఎవరికీ జనాలతో ప్రత్యక్ష సంబంధాల్లేవు. వీళ్ళవల్ల పార్టీకి పట్టుమని వంద ఓట్లు కూడా వస్తాయో రావో అనుమానమే. ఇలాంటి వారితో మోడీ ఎన్నిసార్లు భేటీలు జరిపినా ఏమీ ఉపయోగం ఉండదు. ఇలాంటి నేతలను నమ్ముకునేకన్నా నేరుగా రాష్ట్రానికి మంచిచేసి జనాలను నమ్ముకుంటేనే బీజేపీకి ఏమైనా లాభముంటుంది. లేకపోతే ఎన్ని దశాబ్దాలైన ఇదే పరిస్ధితి.

This post was last modified on December 15, 2021 10:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోనాలిసా పెళ్లి… లవ్ జిహాద్ కాదట

గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన…

54 seconds ago

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

2 hours ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

2 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

5 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

6 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

7 hours ago