Political News

మోడీతో చెప్పేంత దమ్ముందా?

దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అవబోతున్నారు. తెలంగాణా, ఏపీ, కర్నాటక రాష్ట్రాల ఎంపీలు, ముఖ్యనేతలకు మోడీ బ్రేక్ ఫాస్ట్ ఇస్తున్నారు. పై రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, సమస్యలు, పరిష్కారాలపై మోడీ చర్చిస్తారట. దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేకంగా మోడీ భేటీ అవ్వడం బహుశా ఇదే మొదటిసారి. భేటీ అయితే జరుగుతుంది కానీ అందులో ఎంపీలు, ముఖ్యనేతలు వాస్తవ పరిస్థితులను మోడీకి వివరిస్తారా ? అన్నదే అసలైన ప్రశ్న.

2014లో జరిగిన రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ ప్రయోజనాల కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వం కొన్ని హామీలనిచ్చింది. ప్రత్యేక హోదా, వైజాగ్ ప్రత్యేక రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు లాంటి అనేక హామీలున్నాయి. వీటిల్లో చాలా హామీలను నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాతే తుంగలో తొక్కారు. 2014 ఎన్నికల ప్రచారంలో హోదా, రైల్వే జోన్ లాంటి హామీలను ప్రస్తావించిన మోడీ తర్వాత వాటిని పూర్తిగా గాలికొదిలేశారు.

ఏపీ ప్రయోజనాల విషయంలో అడుగడుగునా మోడీ దెబ్బ కొడుతూనే ఉన్నారు. ఇలాంటి అనేక కారణాల వల్లే జనాలు కూడా కాంగ్రెస్ తో పాటు బీజేపీని కూడా ఎన్నికల సమయంలో బొంద పెట్టేస్తున్నారు. కాంగ్రెస్ కు అయినా బీజేపీకి అయినా ఎన్నికల్లో జనాలు ఎక్కడా డిపాజిట్లు కూడా ఇవ్వటం లేదు. పార్టీ బలోపేతమవ్వాలంటే ముందు ఏపీ ప్రయోజనాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే సాధ్యం కాదు. మరి ఈ విషయాన్ని ఎంపీలు, ముఖ్యనేతలు మోడీకి చెప్పే ధైర్యం చేయగలరా ?

ఫలానా పార్టీ తమను మోసం చేసిందని జనాలు ఫిక్సయిన తర్వాత మళ్ళీ ఆ పార్టీని జనాలు దగ్గరకు తీసుకోరు. జనాల మనసులు గెలవాలంటే సదరు పార్టీ తన చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సుంటుంది. కానీ బీజేపీ పదే పదే జనాలను మోసం చేస్తునే ఉంది. పైగా ఈరోజు భేటీలో సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి, సత్యమూర్తి, కన్నా లక్ష్మీనారాయణ హాజరవబోతున్నారు.

వీరిలో టీజీ వెంకటేష్ మాత్రమే కాస్తనయం. ఎందుకంటే టీజీ ఎంఎల్ఏగా రెండుమూడుసార్లు గెలిచున్నారు. మిగిలిన వారిలో ఎవరికీ జనాలతో ప్రత్యక్ష సంబంధాల్లేవు. వీళ్ళవల్ల పార్టీకి పట్టుమని వంద ఓట్లు కూడా వస్తాయో రావో అనుమానమే. ఇలాంటి వారితో మోడీ ఎన్నిసార్లు భేటీలు జరిపినా ఏమీ ఉపయోగం ఉండదు. ఇలాంటి నేతలను నమ్ముకునేకన్నా నేరుగా రాష్ట్రానికి మంచిచేసి జనాలను నమ్ముకుంటేనే బీజేపీకి ఏమైనా లాభముంటుంది. లేకపోతే ఎన్ని దశాబ్దాలైన ఇదే పరిస్ధితి.

This post was last modified on December 15, 2021 10:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…

22 minutes ago

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…

37 minutes ago

ఈ నలుగురు కొడితే 10 వేల కోట్లా?

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…

1 hour ago

కన్నడ హీరోయిన్ ప్రశ్న… జవాబు చెప్పగలమా?

దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…

1 hour ago

చంద్రబాబు మీద సీరియస్ బయోపిక్

దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర…

2 hours ago

థియేటర్ల ఆకలి తీర్చే ఆహారం ఎక్కడ

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…

2 hours ago