దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అవబోతున్నారు. తెలంగాణా, ఏపీ, కర్నాటక రాష్ట్రాల ఎంపీలు, ముఖ్యనేతలకు మోడీ బ్రేక్ ఫాస్ట్ ఇస్తున్నారు. పై రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, సమస్యలు, పరిష్కారాలపై మోడీ చర్చిస్తారట. దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేకంగా మోడీ భేటీ అవ్వడం బహుశా ఇదే మొదటిసారి. భేటీ అయితే జరుగుతుంది కానీ అందులో ఎంపీలు, ముఖ్యనేతలు వాస్తవ పరిస్థితులను మోడీకి వివరిస్తారా ? అన్నదే అసలైన ప్రశ్న.
2014లో జరిగిన రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ ప్రయోజనాల కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వం కొన్ని హామీలనిచ్చింది. ప్రత్యేక హోదా, వైజాగ్ ప్రత్యేక రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు లాంటి అనేక హామీలున్నాయి. వీటిల్లో చాలా హామీలను నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాతే తుంగలో తొక్కారు. 2014 ఎన్నికల ప్రచారంలో హోదా, రైల్వే జోన్ లాంటి హామీలను ప్రస్తావించిన మోడీ తర్వాత వాటిని పూర్తిగా గాలికొదిలేశారు.
ఏపీ ప్రయోజనాల విషయంలో అడుగడుగునా మోడీ దెబ్బ కొడుతూనే ఉన్నారు. ఇలాంటి అనేక కారణాల వల్లే జనాలు కూడా కాంగ్రెస్ తో పాటు బీజేపీని కూడా ఎన్నికల సమయంలో బొంద పెట్టేస్తున్నారు. కాంగ్రెస్ కు అయినా బీజేపీకి అయినా ఎన్నికల్లో జనాలు ఎక్కడా డిపాజిట్లు కూడా ఇవ్వటం లేదు. పార్టీ బలోపేతమవ్వాలంటే ముందు ఏపీ ప్రయోజనాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే సాధ్యం కాదు. మరి ఈ విషయాన్ని ఎంపీలు, ముఖ్యనేతలు మోడీకి చెప్పే ధైర్యం చేయగలరా ?
ఫలానా పార్టీ తమను మోసం చేసిందని జనాలు ఫిక్సయిన తర్వాత మళ్ళీ ఆ పార్టీని జనాలు దగ్గరకు తీసుకోరు. జనాల మనసులు గెలవాలంటే సదరు పార్టీ తన చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సుంటుంది. కానీ బీజేపీ పదే పదే జనాలను మోసం చేస్తునే ఉంది. పైగా ఈరోజు భేటీలో సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి, సత్యమూర్తి, కన్నా లక్ష్మీనారాయణ హాజరవబోతున్నారు.
వీరిలో టీజీ వెంకటేష్ మాత్రమే కాస్తనయం. ఎందుకంటే టీజీ ఎంఎల్ఏగా రెండుమూడుసార్లు గెలిచున్నారు. మిగిలిన వారిలో ఎవరికీ జనాలతో ప్రత్యక్ష సంబంధాల్లేవు. వీళ్ళవల్ల పార్టీకి పట్టుమని వంద ఓట్లు కూడా వస్తాయో రావో అనుమానమే. ఇలాంటి వారితో మోడీ ఎన్నిసార్లు భేటీలు జరిపినా ఏమీ ఉపయోగం ఉండదు. ఇలాంటి నేతలను నమ్ముకునేకన్నా నేరుగా రాష్ట్రానికి మంచిచేసి జనాలను నమ్ముకుంటేనే బీజేపీకి ఏమైనా లాభముంటుంది. లేకపోతే ఎన్ని దశాబ్దాలైన ఇదే పరిస్ధితి.
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…