Political News

లోక్ సభలో జగన్ పై రఘురామ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీలు వర్సెస్ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ వెర్బల్ వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు కోరగా…జగన్ పై అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం చేయాలని రఘురామ చెప్పడంతో లోక్ సభ సాక్షిగా మాటల తూటాలు పేలాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని రఘురామ లోక్ సభలో షాకింగ్ కామెంట్లు చేశారు.

లోక్‌సభలో 377 నిబంధన కింద లిఖితపూర్వకంగా రఘురామ ఈ విషయాన్ని లేవనెత్తారు. ఏపీ దివాలా తీసేందుకు సిద్ధంగా ఉందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా మారిందని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని నిండు సభలో వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

అంతేకాదు, కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారిన జగన్ రుణాలు తీసుకుంటున్నారని, ఆర్థికంగా దివాళా తీసేందుకు రెడీగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. సభ అనంతరం మీడియాతో మాట్లాడిన రఘురామ జగన్ పై షాకింగ్ కామెంట్లు చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మి నారాయణ ఇంటిపై సీఐడీ పోలీసుల సోదాలు జగన్ కక్ష్య సాధింపు చర్యలేనని అన్నారు. సోదాల సమయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను ఉండమని చెప్పిన విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించారు.

కానీ, మరుసటి రోజు రాధాకృష్ణపై సీఐడీ అధికారులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కక్ష్య సాధింపేనని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం పోలీసులను దారుణంగా వాడుకుంటోందని, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న సంగతి పోలీసులు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. తప్పులు చేసే పోలీసులు కూడా శిక్షలకు సిద్ధంగా ఉండాలని రఘురామ షాకింగ్ కామెంట్లు చేశారు.

This post was last modified on December 13, 2021 8:32 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

హీరామండి రిపోర్ట్ ఏంటి

మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…

18 mins ago

జ్యోతికృష్ణ గెలవాల్సిన సవాల్ పెద్దదే

ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…

35 mins ago

హాట్ టాపిక్‌గా చంద్ర‌బాబు ‘టోపీ’.. ఏంటిది?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. అటు…

1 hour ago

ఇక్కడే చస్తానంటున్న బండ్ల గణేష్ !

బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…

2 hours ago

ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని ఆగుతున్నాం: బొత్స

ఏపీ అధికార పార్టీ వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని…

4 hours ago

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

13 hours ago