Political News

జ‌గ‌న్ స్పందించ‌క‌పోతే.. 3 వేల కోట్లు ఫట్

అన్ని విష‌యాల్లోనూ యాక్టివ్‌గా ఉండే ఏపీ ప్ర‌భుత్వం.. కీల‌క విష‌యంలో అనుస‌రిస్తున్న ఉదాసీన వైఖ‌రి కార‌ణంగా.. దాదాపు 3 వేల కోట్ల రూపాయ‌ల‌ను పోగొట్టుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇది నిజ‌మా? అంటే.. కేంద్ర ప్ర‌భుత్వ‌మే తాజాగా హెచ్చ‌రించ‌డంతో.. ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. కేంద్ర ప్ర‌భుత్వం జల జీవన మిషన్ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. ఈ ప‌థ‌కం కింద ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం రూ.3000 కోట్లు కేటాయించింది.

ఈ ప‌థ‌కంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయి నీరు అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తి నిధులను భ‌రించాలి. అయితే.. రాష్ట్ర వాటాను ఏపీ ప్రభుత్వం గత రెండేళ్లుగా సమకూర్చలేదు. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఈ పథకం కింద కేంద్రం కేటాయించిన నిధుల నుంచి ఏపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం.. రాష్ట్రానికి రూ. 372.64 కోట్లు కేటాయించి విడుదల చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 121.62 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.790.48 కోట్లు కేటాయించగా.. వాటిలో కేవలం రూ. 297.62 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి అత్యధికంగా రూ. 3180 2.88 కోట్లు కేటాయించగా.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేకపోయింది. 2019-20, 2020-21 సంవత్సరానికి గాను కేంద్రం తన వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 453.66 కోట్ల రూపాయలను ఇంతవరకు ఇవ్వలేదు.

2022 మార్చిలోపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నిధుల విడుదలలో జాప్యం చేస్తే… నిబంధనల ప్రకారం రాష్ట్రానికి జల జీవన్ మిషన్ పథకం కింద కేంద్రం కేటాయించిన 3,183 కోట్ల రూపాయలు మురిగిపోతాయి. ఒక‌వైపు అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రం వివిధ ప‌థ‌కాల కింద ఇస్తున్న నిధుల‌ను తీసుకోవ‌డంలో చేస్తున్న జాప్యంతో నిధులు మురిగిపోతున్నాయ‌ని.. బీజేపీ నాయ‌కులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా.. జ‌గ‌న్ స్పందిస్తే.. 3 వేల కోట్ల రూపాయలు ల‌భిస్తాయి. త‌ద్వారా.. ఏపీలో నీటి కుళాయి స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on December 12, 2021 9:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

12 minutes ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

19 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

4 hours ago