Political News

ఇందుకే బీజేపీ తుడిచి పెట్టుకోపోయింది

ఏపీ ప్రయోజనాల విషయంలో రాష్ట్ర విభజన చట్టాన్ని నరేంద్ర మోడీ సర్కార్ సాంతం తుంగలో తొక్కేసింది. పార్లమెంటులో లేవనెత్తిన ఓ ప్రశ్నకు సమాధానంగా రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ సమాధానమిస్తూ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ఆలోచనేమీ అదని చెప్పారు. విభజన కారణంగా అన్ని విధాలుగా దెబ్బతిన్న ఏపీని ఆదుకునేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ లాంటి హామీలు ఇచ్చింది.

అయితే ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ఏపీ ప్రయోజనాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. మొదట ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కేసింది. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ అని ఇంకోటని దెబ్బకొట్టేసింది. దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇచ్చేది లేదు కాబట్టి ఏపీకి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేందుకు లేదని తేల్చి చెప్పింది. తాజాగా దేశంలో ప్రత్యేక రైల్వేజోన్లను ఏర్పాటు చేయడం లేదు కాబట్టి వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయటం లేదన్నది.

అంటే ఏపీ ప్రయోజనాలకు కీలకంగా ఉంటుందనుకున్న రెండు హామీలను మోడి ప్రభుత్వం దిగ్విజయంగా దెబ్బకొట్టేసింది. ఇక పోలవరం ప్రాజెక్టుకు నిధులు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి లాంటి చాలా అంశాలను కూడా అమలు చేయలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపీ ప్రయోజనాలను కేంద్రం అడుగడుగునా దెబ్బ కొడుతునే ఉంది. రాష్ట్రంలోని బీజేపీ నేతలెవరు ఈ విషయంలో నోరు కూడా విప్పడంలేదు.

కేంద్రం రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దెబ్బకొడుతున్నా కమలనాథులు చోద్యం చూస్తున్నారు తప్ప గట్టిగా మాట్లాడటం లేదు. చివరకు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీరిస్తున్నా ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ ఎలా బలపడుతుంది ? ఏపీని మోడి ఇంతగా ఎందుకని దెబ్బ కొడుతున్నారు ? ఎందుకంటే ఎంత చేసినా ఏపీలో బీజేపీ బలోపేతం కాదని బహుశా మోడీకి అర్థమై ఉంటుంది. అందుకనే ఏమీ ఇవ్వకుండా పక్కన పెట్టేస్తున్నారు.

మోడీ సర్కార్ వైఖరిని గమనించిన తర్వాతే జనాలు కూడా బీజేపీని పూర్తిగా దూరం పెట్టేస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా ఇవ్వలేదు. అలాగే తర్వాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా గెలిపించలేదు. బహుశా రేపటి ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందనటంలో సందేహం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను ఒకవైపు దెబ్బకొడుతు మరోవైపు ఓట్లు రావాలంటే ఎలా వస్తుంది ?

This post was last modified on December 9, 2021 10:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలివైన నిర్ణయం తీసుకున్న సారంగపాణి

ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…

1 hour ago

బాబు చేతులు మీదుగా అంగరంగ వైభవంగా కళ్యాణం

ఏపీలో రాముడి త‌ర‌హా రామ‌రాజ్యం తీసుకురావాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. రామ‌రాజ్యం అంటే.. ఏపీ స‌మ‌గ్ర అభివృద్ధి…

2 hours ago

త‌మిళ‌నాడుకు మంచి రోజులు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

త‌మిళ‌నాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవ‌డంపై ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.…

2 hours ago

మైత్రీకి డబ్బులొచ్చాయ్.. పేరు చెడుతోంది

హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…

2 hours ago

పవన్ కుమారుడిపై అనుచిత పోస్టు.. కేసులు నమోదు

సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ…

9 hours ago

గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్… జైలుకు తరలింపు

వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…

14 hours ago