Political News

జగన్ హిట్లర్ అవ్వకూడదు: వైసీపీ ఎంపీ

తాజాగా జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీల మధ్య మాటల యుద్దం జోరుగా సాగుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఆ పార్టీ ఎంపీలు అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై, వైసీపీ నేతలపై రఘురామ మండిపడ్డారు. ఈ క్రమంలోనే జగన్ పై ఆర్ఆర్ఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ కూడా ముస్సోలిని, హిట్లర్ వంటి నియంతలలాగా దుర్మార్గుడిగా చరిత్రలో నిలిచిపోతారేమోనన్నదే తన బాధ అని రఘురామ షాకింగ్ కామెంట్లు చేశారు. చరిత్రలో విలన్లకు చెడుగా గుర్తింపు, హీరోలకు మంచి గుర్తింపు ఉంటుందని, రాముడు, రావణాసురుడు, కృష్ణుడు, కంసుడు…జగన్..ఇలా అందరూ తమ తమ చర్యలకు తగ్గట్టు గుర్తుండిపోయారని ఎద్దేవా చేశారు.ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, జగన్ పాలనను ప్రశ్నించినప్పటి నుంచి తనపై కక్షగట్టారని ఆరోపించారు. స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం వద్దని చెప్పినప్పటి నుంచి తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.

రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించొద్దని చెబితే తనపై అనర్హత వేటు కోసం స్పీకర్ ను కలిశారని అన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు తాను బీజేపీలో చేరుతున్నారన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను రఘురామ ఖండించారు. జేపీతో అంటకాగిందే వైసీపీ నేతలని, ఏది చేసినా బీజేపీకి చెప్పే చేస్తామంటూ గతంలో విజయసాయిరెడ్డి అన్నారని గుర్తు చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి కోసం రైతులు భూములిస్తే.. విశాఖపట్నంలో దుకాణం తెరుస్తామంటూ ప్రభుత్వం చెప్పడం దారుణమని మండిపడ్డారు.

అమరావతి కోసం రైతులు శాంతియుతంగా చేస్తున్న ఉద్యమానికి ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేసిన పాపాలను ప్రశ్నిస్తే బూతులు తిడతారా? అంటూ మండిపడ్డారు. వలంటీర్ వ్యవస్థ దౌర్జన్యపు సైన్యంలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్లకు జీతమిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, ఉద్యోగులకు జీతం ఇవ్వట్లేదని ఆరోపించారు. మరి, రఘురామ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on December 8, 2021 6:42 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు…

5 hours ago

మహేష్ బాబు కోసం వరదరాజ మన్నార్ ?

ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…

5 hours ago

లండ‌న్‌లో జ‌గ‌న్… ఫ‌స్ట్ లుక్ ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా విహార యాత్ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, కుమార్తెలు హ‌ర్ష‌,…

7 hours ago

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…

7 hours ago

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

12 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

13 hours ago