Political News

జగన్ హిట్లర్ అవ్వకూడదు: వైసీపీ ఎంపీ

తాజాగా జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీల మధ్య మాటల యుద్దం జోరుగా సాగుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఆ పార్టీ ఎంపీలు అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై, వైసీపీ నేతలపై రఘురామ మండిపడ్డారు. ఈ క్రమంలోనే జగన్ పై ఆర్ఆర్ఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ కూడా ముస్సోలిని, హిట్లర్ వంటి నియంతలలాగా దుర్మార్గుడిగా చరిత్రలో నిలిచిపోతారేమోనన్నదే తన బాధ అని రఘురామ షాకింగ్ కామెంట్లు చేశారు. చరిత్రలో విలన్లకు చెడుగా గుర్తింపు, హీరోలకు మంచి గుర్తింపు ఉంటుందని, రాముడు, రావణాసురుడు, కృష్ణుడు, కంసుడు…జగన్..ఇలా అందరూ తమ తమ చర్యలకు తగ్గట్టు గుర్తుండిపోయారని ఎద్దేవా చేశారు.ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, జగన్ పాలనను ప్రశ్నించినప్పటి నుంచి తనపై కక్షగట్టారని ఆరోపించారు. స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం వద్దని చెప్పినప్పటి నుంచి తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.

రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించొద్దని చెబితే తనపై అనర్హత వేటు కోసం స్పీకర్ ను కలిశారని అన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు తాను బీజేపీలో చేరుతున్నారన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను రఘురామ ఖండించారు. జేపీతో అంటకాగిందే వైసీపీ నేతలని, ఏది చేసినా బీజేపీకి చెప్పే చేస్తామంటూ గతంలో విజయసాయిరెడ్డి అన్నారని గుర్తు చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి కోసం రైతులు భూములిస్తే.. విశాఖపట్నంలో దుకాణం తెరుస్తామంటూ ప్రభుత్వం చెప్పడం దారుణమని మండిపడ్డారు.

అమరావతి కోసం రైతులు శాంతియుతంగా చేస్తున్న ఉద్యమానికి ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేసిన పాపాలను ప్రశ్నిస్తే బూతులు తిడతారా? అంటూ మండిపడ్డారు. వలంటీర్ వ్యవస్థ దౌర్జన్యపు సైన్యంలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్లకు జీతమిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, ఉద్యోగులకు జీతం ఇవ్వట్లేదని ఆరోపించారు. మరి, రఘురామ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on December 8, 2021 6:42 pm

Share

Recent Posts

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

43 minutes ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

3 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

3 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

4 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

4 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

5 hours ago