కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పేరు టీఆర్ఎస్ వర్గాలతో పాటు మీడియాలోనూ ఎక్కువగా వినిపించింది. దళిత బంధు కోసం కేసీఆర్ ప్రగతి భవన్లో నిర్వహించిన సమీక్షలో ఆయన సీఎం పక్కన కూర్చోవడం.. ఆ తర్వాత అసెంబ్లీలో ప్రసంగం సమయంలోనే మోత్కుపల్లి శాసనసభకు వెళ్లడం లాంటి విషయాలే అందుకు కారణం. ఆయన్ని టీఆర్ఎస్లో చేర్చుకున్న కేసీఆర్ దళిత బంధు ఛైర్మన్గా చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత కేసీఆర్.. దళిత బంధు ఊసే ఎత్తకపోవడంతో అసలు మోత్కుపల్లి పరిస్థితి ఏంటీ అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
కేసీఆర్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో ఎవరికి అంతు చిక్కదని అంటుంటారు. పార్టీ గెలుపు కోసం ఆయన అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఇటీవల ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం కోసం మిగతా పార్టీలకు చెందిన కీలక నేతలను పార్టీలో చేర్చుకున్నారు. అందులో కౌశిక్ రెడ్డి, పెద్దిరెడ్డి లాంటి నాయకులున్నారు. మరోవైపు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మోత్కుపల్లిపై కూడా కన్నేసిన కేసీఆర్.. ఆయన మెడలో గులాబీ కండువా కప్పేశారు. దీంతో ఆయనకు కేసీఆర్ ఏదో మంచి పదవే కట్టబెడతారనే ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా దళిత బంధు పథకం పర్యవేక్షణ ఆయనే చూసుకుంటారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
మోత్కుపల్లి టీఆర్ఎస్లో చేరకముందే కేసీఆర్ దళిత బంధుపై చేపట్టిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. దీంతో దళిత బంధు పథకానికి చట్టబద్ధత కల్పించి దానికి ఛైర్మన్గా మోత్కుపల్లిని నియమించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం సాగింది. ఆ పదవికి కేబినేట్ హోదా కూడా ర్యాంకు కూడా కల్పిస్తారని వార్తలు వచ్చాయి. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత కేసీఆర్ అసలు దళిత బంధు ప్రస్తావనే చేయడమే లేదు.
ఆ పథకాన్ని కచ్చితంగా అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ దానిపై సమీక్ష కూడా నిర్వహించలేదు. దీంతో ఇదే అదునుగా తీసుకుని ఈ విషయంపై విపక్షాలు అధికార టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో ప్రాధాన్యత కలిగిన పదవి వస్తుందని భావించిన మోత్కుపల్లి ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారనే చర్చ సాగుతోంది. బయట ఎక్కువగా కనిపించడం లేదు. పరిస్థితులు ఎలా ఎన్నా కేసీఆర్ మాత్రం తనకు న్యాయమే చేస్తారని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.
This post was last modified on December 8, 2021 3:26 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…