Political News

అమరావతి రైతులపై మరోసారి వైసీపీ కక్ష సాధింపు

ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో రాజధాని మహిళలు, రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ మహా పాదయాత్రకు విశేష స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా రైతులు, మహిళలు ఈ మహా పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్ర చేస్తున్న రైతులకు సంఘీభావంగా కొందరు వారికి సహాయం చేస్తున్నారు.

అయితే, పాదయాత్ర చేస్తున్న రైతులను నిబంధనల పేరుతో పోలీసులు, వైసీపీ నేతలు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణ రాజు… నిన్న లోక్ సభలో కూడా ప్రస్తావించారు. అయినప్పటికీ పాదయాత్ర చేస్తున్నవారిపై వైసీపీ నేతల కక్ష సాధింపు చర్యలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని విమర్శలు వస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఎంపేడు వద్ద అమరావతి రైతులపై మరోసారి వైసీపీ నేతలు దాష్టీకాన్ని ప్రదర్శించిన వైనం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఎంపేడు మీదుగా పాదయాత్ర జరుగుతున్న సందర్భంగా అమరావతి రైతులు భోజనం తినేందుకు వీలుగా ఓ రైతు తన పొలాన్ని ఇచ్చాడు. అయితే, అక్కడ భోజన ఏర్పాట్లు చేయడానికి వీలులేదంటూ ఆ స్థలాన్ని స్థానిక వైసీపీ నేత, సర్పంచ్ ట్రాక్టర్ తో  దున్నించారు. దీంతో, ఆ ప్రాంతంలో కూర్చొని భోజనం చేయడానికి వీలు లేకుండా పోయింది.

కావాలనే ఇలా కక్ష సాధింపునకు పాల్పడ్డారని, పాదయాత్రకు వస్తున్న విశేష స్పందనను చూసి ఓర్వలేకే ఇలా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతిలో ఉన్న న్యాయస్థానం నుంచి మొదలుబెట్టిన ఈ మహా పాదయాత్రను కలియుగ వెంకన్న దైవం కొలువైన దేవస్థానం తిరుపతివరకు కొనసాగించి తీరతామని రైతులు చెబుతున్నారు

This post was last modified on December 7, 2021 12:29 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

జ‌గ‌న్‌లో ఓట‌మి భ‌యానికిది సంకేత‌మా?

ఆంధ్ర‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకో వార‌మే స‌మ‌యం ఉంది. ఈ ఎన్నిక‌లు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు, అటు ప్ర‌తిప‌క్ష…

4 hours ago

ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…

5 hours ago

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

8 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

11 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

12 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

13 hours ago