Political News

అమరావతి రైతులపై మరోసారి వైసీపీ కక్ష సాధింపు

ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో రాజధాని మహిళలు, రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ మహా పాదయాత్రకు విశేష స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా రైతులు, మహిళలు ఈ మహా పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్ర చేస్తున్న రైతులకు సంఘీభావంగా కొందరు వారికి సహాయం చేస్తున్నారు.

అయితే, పాదయాత్ర చేస్తున్న రైతులను నిబంధనల పేరుతో పోలీసులు, వైసీపీ నేతలు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణ రాజు… నిన్న లోక్ సభలో కూడా ప్రస్తావించారు. అయినప్పటికీ పాదయాత్ర చేస్తున్నవారిపై వైసీపీ నేతల కక్ష సాధింపు చర్యలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని విమర్శలు వస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఎంపేడు వద్ద అమరావతి రైతులపై మరోసారి వైసీపీ నేతలు దాష్టీకాన్ని ప్రదర్శించిన వైనం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఎంపేడు మీదుగా పాదయాత్ర జరుగుతున్న సందర్భంగా అమరావతి రైతులు భోజనం తినేందుకు వీలుగా ఓ రైతు తన పొలాన్ని ఇచ్చాడు. అయితే, అక్కడ భోజన ఏర్పాట్లు చేయడానికి వీలులేదంటూ ఆ స్థలాన్ని స్థానిక వైసీపీ నేత, సర్పంచ్ ట్రాక్టర్ తో  దున్నించారు. దీంతో, ఆ ప్రాంతంలో కూర్చొని భోజనం చేయడానికి వీలు లేకుండా పోయింది.

కావాలనే ఇలా కక్ష సాధింపునకు పాల్పడ్డారని, పాదయాత్రకు వస్తున్న విశేష స్పందనను చూసి ఓర్వలేకే ఇలా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతిలో ఉన్న న్యాయస్థానం నుంచి మొదలుబెట్టిన ఈ మహా పాదయాత్రను కలియుగ వెంకన్న దైవం కొలువైన దేవస్థానం తిరుపతివరకు కొనసాగించి తీరతామని రైతులు చెబుతున్నారు

This post was last modified on December 7, 2021 12:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగోళ్లు లేపుతుంటే… తమిళోళ్లు ముంచేస్తున్నారు

ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…

33 minutes ago

సీఎంకు మ‌రో టెస్ట్‌.. రెండు సీట్ల కోసం ప‌దుల సంఖ్య‌లో పోటీ!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మ‌రో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం చూస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఎవ‌రిని…

1 hour ago

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

5 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

6 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

9 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

9 hours ago