ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వ్యవహారంపై ఇటు నెటిజన్లు, అటుతెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు నివ్వెర పోతున్నారు. శనివా రం ఉదయం స్వర్గస్తులైన మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు నివాళులు అర్పించేందుకు ఎక్కడెక్కడ నుచో అనేక మంది నాయకులు హైదరాబాద్కు క్యూకట్టారు. ఆరోగ్యం బాగోక పోవడంతో.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం.. తన తరఫున కర్ణాటకకు చెందిన మల్లిఖార్జున ఖర్గేను పంపించి.. నివాళులర్పించారు. సంతాప సందేశాన్ని రోశయ్య కుటుంబ సభ్యులకు పంపించారు. ఇక, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలోనే రోశయ్యను చూసేందుకు ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నేతలు.. పార్టీలకు అతీతంగా కూడా బీజేపీ, కమ్యూనిస్టు, ఫార్వర్డ్ నాయకులు వచ్చారు.
అయితే.. ఇక్కడ నెటిజన్లు కానీ.. కాంగ్రెస్ సీనియర్లు కానీ.. విస్మయం వ్యక్తం చేస్తున్న అంశం.. రోశయ్య తన జీవిత కాలంలో ఎవరి కోసం అయితే.. తాపత్రయ పడ్డారో.. ఎవరిని సంతోషపరచడం కోసం.. తన మనసు చంపుకుని మరీ.. బడ్జెట్కు కూర్పులు, చేర్పులు చేశారో.. ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన ఇ ప్పుడు భౌతికంగా లేరు. ఉండి ఉంటే.. రోశయ్య పాడెమోసి మరీ రుణం తీర్చుకునేవారని.. కాంగ్రెస్నేతలు గుసగుసలాడుకున్నారు. ఇక, ఆయన లేకపోయినా.. ఆయన సతీమణి విజయమ్మ ఉన్నారు. ఆయన కుమారుడు జగన్ ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక, వైఎస్ కుమార్తె.. రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. హైదరాబాద్లోనే ఉన్నారు.కానీ, ఒక్కరంటే ఒక్కరు వచ్చి.. రోశయ్య పార్థివ దేహాన్ని చూసింది లేదు. నివాళులర్పించింది లేదు.
దీంతో ఈ విషయం.. అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు కాంగ్రెస్ నేతల మధ్య కూడా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణకు చెందిన వీ. హనుమంతరావు.. ఆఫ్ దిరికార్డుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.”జగన్ కు దక్కాల్సిన సీఎం పదవిని రోశయ్య కొట్టేశారనేది ఆ కుటుంబం ఏడుపు. కానీ.. అది కరెక్ట్ కాదు. బహుశ అందుకే వచ్చి ఉండరు” అని అన్నారు. ఇక, మాజీ మంత్రి జీ. గీతారెడ్డి కూడా వైఎస్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా రాకపోవడాన్ని తీవ్రంగా స్పందించారు. విశ్వాసం లేని వారి గురించి ఏం మాట్లాడతాం! అని ఆమె వీహెచ్తోనే వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక, కాంగ్రెస్ నేతల నుంచి వినిపించిన వ్యాఖ్యలను బట్టి.. జగన్.. తనకు తన తండ్రి మరణాంతరం దక్కాల్సిన సీఎం పదవిని రోశయ్య కొట్టుకుపోయారనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.
అంతేకాదు.. తాను ఓదార్పు యాత్రలు చేస్తే.. వాటిని అడ్డుకునేలా రోశయ్య నివేదికలు పంపారని.. జగన్ భావించి ఉంటారని.. అంటున్నారు. ఈ క్రమంలోనే రోశయ్యకు కనీసం అంతిమ నివాళి అర్పించేందుకు కూడా రాలేదని.. కాంగ్రెస్ సీనియర్లు గుసగుస లాడుకోవడం.. రోశయ్య అంత్యక్రియల ప్రాంగణంలో స్పష్టంగా వినిపించింది. అయితే.. ఇక్కడ కొసమెరుపు ఉంది. ఒకవేళ.. రోశయ్య అలా చేసి ఉంటే.. విజయమ్మకు ఏమైంది? వైఎస్ అంతటివాడే.. రోశయ్యను దేవుడిచ్చిన అన్నగా అసెంబ్లీలోనే పేర్కొన్న ఆయన సతీమణి ఎందుకు వెళ్లలేక పోయారు. ఒక్క పుష్పగుచ్ఛం ఎందుకు సమర్పించలేక పోయారు.. ? అంటే.. ఏపీలోని తాడేపల్లి నుంచి వచ్చిన “ఫోన్ కాల్“తోనే ఆమె ఇంటికి పరిమితమయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలను గమనించిన నెటిజన్లు.. “శభాష్ జగనన్నా!!“ వైఎస్ ఆత్మ నీవల్ల చాలా చాలా హ్యాపీగా ఉంటుంది!! అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
This post was last modified on December 6, 2021 8:13 pm
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…