Political News

ఆ కామెంట్లతో జగన్ పరువు తీసిన చంద్రబాబు

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరద ఉధృతికి కడపలోని అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడం, ఆ వరద నీటి ప్రభావానికి 62 మండి మరణించడం పెను దుమారం రేపింది. గ్రీజు పెట్టకపోవడం వల్లే గేట్ సకాలంలో తెరుచుకోలేదని, అందుకే ఈ ప్రమాదం జరిగిందన్న ఆరోపణలతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఘటనపై టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు.

గేటుకు గ్రీజు కూడా పెట్టలేని సీఎం…3 రాజధానులు ఏం నిర్మిస్తారు అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. గతంలో ఆ ప్రాజెక్టుకు వరదలు వచ్చిన సందర్భంలో గేట్లు తెరిచి ఉంచేవారని, కాబట్టి వరద నీరు వృథాగా పోయి ప్రాణనష్టం జరిగేది కాదని గుర్తు చేశారు..గేట్ ఓపెన్ కాలేదని వైసీపీ నేతలు చేతులు దులుపుకుంటున్నారని, ఆ గేట్ సమస్య చాలాకాలం నుంచి ఉన్నా పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు.

అంతేకాదు, ఇసుక కోసం నదిలోకి వెళ్లిన టిప్పర్లను రక్షించేందుకు నీటిని దిగువకు విడుల చేయలేదని,  వరద హెచ్చరికలున్నా సకాలంలో జగన్ స్పందించలేదని ఆరోపించారు. తెలిసో తెలియకో ఓట్లేసిన పాపానికి ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యంతోనే  ప్రాణ నష్టం జరిగిందని, రూ. 6 వేల కోట్ల పంట, ఆస్తి నష్టం సంభవించిందని ఆరోపించారు.

Satya

Recent Posts

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

3 minutes ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

40 minutes ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

48 minutes ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

58 minutes ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

2 hours ago

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న…

2 hours ago