Political News

కేసీయార్-పీకే బృందం మధ్య భేటీ ?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రగతి భవన్లో కేసీయార్ తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం భేటీ అయ్యిందట. గతంలోనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీయార్ కొడుకు కేటీఆర్-పీకే మధ్య భేటీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సో తాజాగా పీకే బృందంతో కేసీయార్ భేటీ అయ్యారనే విషయాన్ని చాలామంది నమ్ముతున్నారు. గడచిన ఏడేళ్ళలో ప్రభుత్వం తీసుకున్న రాజకీయపరమైన నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలపై కేసీయార్ చర్చించారట.

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు, తీసుకుంటున్న నిర్ణయాలపై జనాలు ఏ విధంగా స్పందిస్తున్నారు, పథకాలు వాస్తవంగా ఎంతమందికి రీచవుతున్నాయి అనే అంశాలపై ఫీడ్ బ్యాక్ కావాలని కేసీయార్ పీకే బృందాన్ని కోరినట్లు సమాచారం. పనిలో పనిగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్ధితులపైన కూడా చర్చించారట. పార్టీ, ప్రభుత్వం తరపున పీకే బృందానికి పెద్ద క్వశ్చనియర్ ఇచ్చి అందులోని అంశాలపై డీటైల్డ్ గా సర్వే జరిపి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కేసీయార్ కోరినట్లు తెలుస్తోంది.

ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్ రెడ్డి సీఎంకు వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తమదే అధికారం అంటు ఇద్దరూ నానా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఒక విధంగా చూస్తే ఇద్దరు కూడా కేసీయార్ పై మైండ్ గేమ్ ఆడుతున్నారు. వీళ్ళ దెబ్బకు కేసీయార్ కూడా టెన్షన్ పడుతున్నట్లే ఉన్నారు. లేకపోతే నెలకు ఒకసారి కూడా మంత్రులు, ఉన్నతాధికారులను కలవటానికే ఇష్టపడని కేసీయార్ ఇపుడు వరుసగా మీడియా సమావేశాలు పెడుతున్నారు.

కేంద్రంపై దాదాపుగా యుద్ధం ప్రకటించారు. కేంద్రంపై యుద్ధానికి కేసీయార్ వరి కొనుగోలును ఆయుధంగా మార్చుకున్నారు. ఈ రాజకీయం, పోరాటం ఎంతకాలం చేయగలరో ? ఎంతగా వర్కవుటవుతుందో తెలీదు కానీ కొద్దిరోజులుగా కేసీయార్ అయితే జనాలందరికీ అందుబాటులో ఉంటున్నది వాస్తవం. ఈ ఘనత హుజూరాబాద్ ఉపఎన్నికలకే దక్కుతుందనటంలో సందేహం లేదు. ఎప్పుడైతే ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయారో వెంటనే కేసీయార్ కళ్ళు తెరిచినట్లు అనుకోవాలి.

ఉపఎన్నికలో గెలుపుకు కేసీయార్ ఎంతచేయాలో అంతా చేశారు. అయినా జనాలు మాత్రం టీఆర్ఎస్ ను ఘోరంగా ఓడగొట్టారు. దీంతోనే కేసీయార్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. దాంతో వెంటనే జనాల్లోకి రావటం, సమస్యల పరిష్కారినికి కేంద్రంపై యుద్ధమని హడావిడి చేస్తున్నారు. ఎలాగూ తొందరలోనే ముందస్తు ఎన్నికలు జరగటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కాబట్టే కేసీయార్ పీకే బృందంతో భేటీ జరిపినట్లు తెలుస్తోంది. వివిధ రాజకీయ పార్టీల పరిస్ధితి ఏమిటి ? టీఆర్ఎస్ గెలుపు అవకాశాలు ఎంత ? గెలవడానికి చేయాల్సిందేమిటి ? అనే అంశాలపై డీటైల్డ్ గా చర్చించినట్లు సమాచారం. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on December 2, 2021 11:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`అదే మీడియా` నిల‌బెట్టిన విష‌యం మ‌రిచారా జ‌గ‌న్‌?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రాష్ట్రంలోని ఓ వ‌ర్గం మీడియాపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయ‌న…

1 hour ago

గొడ‌వ ప‌డ్డ హీరోకు తండ్రి స్థానమిచ్చిన ద‌ర్శ‌కుడు

ఒక‌ప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌, అగ్ర క‌థానాయిక న‌య‌న‌తార‌.. కొన్ని కార‌ణాల వ‌ల్ల శ‌త్రువులుగా…

2 hours ago

తెలుగులో డ‌బ్బింగ్ చెప్పి, వెన‌క్కి త‌గ్గిన హీరో

ఎప్పుడు ఎవ‌రి కెరీర్ ఎలా మ‌లుపు తిరుగుతుందో చెప్ప‌లేం. త‌మిళ కుర్రాడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌కు... నాలుగేళ్ల ముందు వ‌ర‌కు త‌మిళ‌నాడులోనే…

3 hours ago

క‌విత‌కు `సీనియార్టీ` సంక‌టం.. సీరియ‌స్‌!

బీఆర్ ఎస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ సీఎం కేసీఆర్ త‌న‌య‌, మాజీ ఎంపీ క‌విత ఈ నెలలో…

4 hours ago

చెన్నైని అసలైనోళ్లే ముంచేస్తున్నారు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో…

5 hours ago

రిపేర్లు సరే ముందు డ్యామేజ్ చూడండి

ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…

5 hours ago