Political News

కేసీయార్-పీకే బృందం మధ్య భేటీ ?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రగతి భవన్లో కేసీయార్ తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం భేటీ అయ్యిందట. గతంలోనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీయార్ కొడుకు కేటీఆర్-పీకే మధ్య భేటీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సో తాజాగా పీకే బృందంతో కేసీయార్ భేటీ అయ్యారనే విషయాన్ని చాలామంది నమ్ముతున్నారు. గడచిన ఏడేళ్ళలో ప్రభుత్వం తీసుకున్న రాజకీయపరమైన నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలపై కేసీయార్ చర్చించారట.

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు, తీసుకుంటున్న నిర్ణయాలపై జనాలు ఏ విధంగా స్పందిస్తున్నారు, పథకాలు వాస్తవంగా ఎంతమందికి రీచవుతున్నాయి అనే అంశాలపై ఫీడ్ బ్యాక్ కావాలని కేసీయార్ పీకే బృందాన్ని కోరినట్లు సమాచారం. పనిలో పనిగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్ధితులపైన కూడా చర్చించారట. పార్టీ, ప్రభుత్వం తరపున పీకే బృందానికి పెద్ద క్వశ్చనియర్ ఇచ్చి అందులోని అంశాలపై డీటైల్డ్ గా సర్వే జరిపి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కేసీయార్ కోరినట్లు తెలుస్తోంది.

ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్ రెడ్డి సీఎంకు వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తమదే అధికారం అంటు ఇద్దరూ నానా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఒక విధంగా చూస్తే ఇద్దరు కూడా కేసీయార్ పై మైండ్ గేమ్ ఆడుతున్నారు. వీళ్ళ దెబ్బకు కేసీయార్ కూడా టెన్షన్ పడుతున్నట్లే ఉన్నారు. లేకపోతే నెలకు ఒకసారి కూడా మంత్రులు, ఉన్నతాధికారులను కలవటానికే ఇష్టపడని కేసీయార్ ఇపుడు వరుసగా మీడియా సమావేశాలు పెడుతున్నారు.

కేంద్రంపై దాదాపుగా యుద్ధం ప్రకటించారు. కేంద్రంపై యుద్ధానికి కేసీయార్ వరి కొనుగోలును ఆయుధంగా మార్చుకున్నారు. ఈ రాజకీయం, పోరాటం ఎంతకాలం చేయగలరో ? ఎంతగా వర్కవుటవుతుందో తెలీదు కానీ కొద్దిరోజులుగా కేసీయార్ అయితే జనాలందరికీ అందుబాటులో ఉంటున్నది వాస్తవం. ఈ ఘనత హుజూరాబాద్ ఉపఎన్నికలకే దక్కుతుందనటంలో సందేహం లేదు. ఎప్పుడైతే ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయారో వెంటనే కేసీయార్ కళ్ళు తెరిచినట్లు అనుకోవాలి.

ఉపఎన్నికలో గెలుపుకు కేసీయార్ ఎంతచేయాలో అంతా చేశారు. అయినా జనాలు మాత్రం టీఆర్ఎస్ ను ఘోరంగా ఓడగొట్టారు. దీంతోనే కేసీయార్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. దాంతో వెంటనే జనాల్లోకి రావటం, సమస్యల పరిష్కారినికి కేంద్రంపై యుద్ధమని హడావిడి చేస్తున్నారు. ఎలాగూ తొందరలోనే ముందస్తు ఎన్నికలు జరగటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కాబట్టే కేసీయార్ పీకే బృందంతో భేటీ జరిపినట్లు తెలుస్తోంది. వివిధ రాజకీయ పార్టీల పరిస్ధితి ఏమిటి ? టీఆర్ఎస్ గెలుపు అవకాశాలు ఎంత ? గెలవడానికి చేయాల్సిందేమిటి ? అనే అంశాలపై డీటైల్డ్ గా చర్చించినట్లు సమాచారం. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on December 2, 2021 11:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగోళ్లు లేపుతుంటే… తమిళోళ్లు ముంచేస్తున్నారు

ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…

33 minutes ago

సీఎంకు మ‌రో టెస్ట్‌.. రెండు సీట్ల కోసం ప‌దుల సంఖ్య‌లో పోటీ!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మ‌రో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం చూస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఎవ‌రిని…

1 hour ago

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

5 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

6 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

9 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

9 hours ago