చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి వల్లభనేని వంశీ క్షమాపణ చెప్పారు. గతంలో భువనేశ్వరిని ఉద్దేశించి వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు వంశీ ప్రకటించారు. తాను అలా మాట్లాడి ఉండకూడదని, పొరపాటున ఓ మాట దొర్లానని తెలిపారు. అలా మాట్లాడటం తప్పేనని, భువనేశ్వరికి క్షమాపణ చెప్పడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
తనకు అందరికన్నా ఎక్కువ పరిచయం భువనేశ్వరితో ఉందని పేర్కొన్నారు. బుధవారం ఓ చానల్లో జరిగిన డిబేట్లో వంశీ మాట్లాడుతూ ఆమెను అక్కా అని పిలిచేవాడిని.. ఆమెతోపాటు తన మాటల వల్ల బాధపడిన వారందరికీ క్షమాపణ చెబుతున్నానని వంశీ ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం భువనేశ్వరిని ఉద్దేశించి వంశీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి.
ఎట్టకేలకు వంశీ పశ్చాత్తాపం ప్రకటించారు. ‘తప్పు జరిగింది. ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడాను. నేను చదువుకున్నాను.. అలా మాట్లాడి ఉండకూడదు. జరిగినదానికి విచారం వ్యక్తం చేస్తున్నా’ అని వంశీ తెలిపారు. కులం నుంచి వెలివేస్తారన్న భయంతో తాను క్షమాపణ చెప్పడం లేదని, నిజంగా ఫీల్ అయ్యాను కాబట్టే తప్పు జరిగిందని చెబుతున్నానని వంశీ వివరించారు. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎవరికీ మంచి కాదన్నారు.
తాను ఆత్మసాక్షిగా.. వ్యక్తిగతంగా బాధపడే భువనేశ్వరికి ఆమెతోపాటు బాధపడిన వారందరికీ క్షమాపణ చెబుతున్నానని వంశీ తెలిపారు. ఇటీవల అసెంబ్లీలో భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేయడం.. వాటిపై చంద్రబాబు తీవ్రంగా కలతచెందారు. మీడియా సమావేశంలో కంటతడి పెట్టుకున్నారు.
This post was last modified on December 1, 2021 10:21 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అప్పుడెప్పుడో తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తొలి సారి…
టాలీవుడ్ లో విలన్ల కొరత వాస్తవం. ఎంత బాలీవుడ్ నుంచి కొందరిని తీసుకొచ్చినా నేటివిటీ సమస్య వల్ల ఒరిజినాలిటి రావడం…
మొన్న శుక్రవారం కోర్ట్ హడావిడిలో పడి వేరే కొత్త సినిమాలు పట్టించుకోలేదు కానీ వాటిలో మలయాళం డబ్బింగ్ 'ఆఫీసర్ ఆన్…
సోషల్ మీడియాలో శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఓ అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగ్ జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది.…
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై తమిళనాడుకు చెందిన అధికార పార్టీ డీఎంకే నాయకులు వరుస పెట్టి విమర్శలు…
మహా కుంభమేళా, భక్తులకే కాదు, వ్యాపారస్తులకు కూడా అపారమైన ఆదాయాన్ని అందించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇటీవల జరిగిన…