Political News

నోటి దురుసుతో ఆ మంత్రి అడ్డంగా బుక్క‌య్యాడే!

అధికారంలో ఉన్న‌వారికి ఉండ‌కూడంది ఏదైనా ఉంటే.. అది నోటి దురుసే!  కానీ. ఏపీలోని వైసీపీ మంత్రుల‌కు ఉన్న‌దే అది! అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ఎవ‌రిని క‌దిలించినా….వైసీపీ నేతల నోటి దురుసు కామెంట్లే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి వాళ్లే.. సోష‌ల్ మీడియాకు అడ్డంగా దొరికిపోతున్నారు. స‌ద‌రు మంత్రుల నోటి దురుసును బాగానే ఎండ‌గ‌డుతున్నారు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఏపీకి జీవ నాడి వంటి పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో.. వైసీపీ ప్ర‌భుత్వం రాగానే.. అత్యుత్సాహంతో కూడిన ప్ర‌క‌ట‌న‌లు చేసింది. ముందు వెనుక ఆలోచించ‌కుండానే.. ప్రాజెక్టుపై కామెంట్లు చేసింది. ఈ క్ర‌మంలోనే ఇరిగేష‌న్ మంత్రిగా ఉన్న ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాద‌వ్‌.. అసెంబ్లీలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

2021 డిసెంబ‌రు నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేస్తాం.. చేసి తీరుతాం.. చేస్తాం! అంటూ.. టీడీపీ నేత‌ల‌వైపు చూపిస్తూ.. కామెంట్లు సంధించారు. కానీ, ఇప్పుడు.. పోల‌వ‌రం ప‌రిస్థితి ఎలా ఉందో.. అంద‌రికీ తెలిసిందే. ఒక్క అడుగు కూడా ముందుకు సాగ‌డం లేదు. అయితే.. మంత్రి అనిల్ చెప్పిన గ‌డువు వ‌చ్చేసింది. దీంతో టీడీపీ నేత‌లు.. అనిల్ కామెంట్ల‌ను జోరుగా వైర‌ల్ చేస్తున్నారు. అంతేకాదు.. వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ఏడాది క్రితం టీడీపీ ఎమ్మెల్యేలు పోలవరంపై ప్రశ్నిస్తే వాళ్లను ఎద్దేవా చేస్తూ డిసెంబర్ 2021 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని భీకర‌స్వరంతో శాసనసభలో ప్రకటించిన అనిల్‌ను ఇప్పుడు వారు టార్గెట్ చేస్తున్నారు.

ప్రాజెక్టు పూర్తి చేసేందుకు గతంలో పెట్టిన డెడ్ లైన్లపై సోషల్ మీడియాలో సెటైర్లు మొదలయ్యాయి. మంత్రి అనిల్ కుమార్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. ఆనాడు అసెంబ్లీ వేదికగా టీడీపీ నేతలను ఎద్దేవా చేస్తూ అన్న మాటలను ప్రస్తుతం టీడీపీ నేత‌లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. మంత్రిపై పడుతున్న పంచ్‌లు మామూలు రేంజ్‌లో లేవు.

‘ప్రాజెక్టు పూర్తి చేశారు కదా ప్రారంభిస్తున్నారా?’

‘పోలవరం పూర్తి అయిందా? ఇంకా సంగతులేంటి?. ఓపెనింగ్‌కు ఎవరొస్తున్నారు?’

 ‘డిసెంబర్ 1న నేను పోలవరం వెళ్తున్నా.. ఎవరైనా వస్తారా?’ అని సెటైర్లు పేలుస్తున్నారు.

మొత్తానికి మంత్రి అనిల్ నోటి దురుసుపై టీడీపీ నేత‌ల సెటైర్లు.. బాగా పండుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on December 1, 2021 9:56 pm

Share
Show comments

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

4 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

5 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

5 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

5 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

6 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

6 hours ago