సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఆవేశంతో మాట్లాడారో తెలిసిందే. కేంద్రం తీరును తీవ్రంగా తప్పు పడుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన.. మాటల మధ్యలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేస్తూ.. బూతులు తిట్టేస్తే వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశంలో కిషన్ రెడ్డి తనతో చర్చకు వస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన సవాలుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా స్పందించారు.
యాసంగి ధాన్యం విషయంలో తాను తెలంగాణ రైతులకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసినట్లు చెప్పిన ఆయన.. కేసీఆర్ విసిరిన సవాలుకు తాను సై అని చెప్పారు. అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తానని.. ముఖ్యమంత్రితో చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘పార్లమెంటు సమావేశాలు సాగుతున్నాయి. వాటిల్లో పాల్గొనాల్సి ఉంటుంది. పార్లమెంటు సమావేశం లేని రోజు చర్చకు సిద్ధం. కాకుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ బూతులు మాట్లాడకుండా ఉంటేనే చర్చకు వస్తాను. అందుకు సిద్ధంగా ఉన్నా’ అని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడే మాటలకు భయపడే వ్యక్తిని తాను కాదని.. సీఎంగా ఉంటూ ఆయన వాడిన భాష ఏ రకమైనదో ఆయనే చెప్పాలన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నాగరిక భాషలో కూడా విమర్శించొచ్చని.. కేసీఆర్ కు అభ్రతా భావమని.. అందుకే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. ప్రజలు ఎవరు ఏమిటన్నది తేలుస్తారన్న ఆయన.. తెలంగాణ ప్రభుత్వం తనను ఏ రోజు కూడా తెలంగాణ బిడ్డ కేంద్రమంత్రి అయ్యాడని చూడలేదన్నారు.
తనను ‘రండా’ అంటూ మాట్లాడినా ఫర్లేదని.. తాను బాధ పడనని స్పష్టం చేశారు. తనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన నైతికతకే వదిలేసినట్లు చెప్పారు. తనతో చర్చకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సిద్దమా? అని ప్రశ్నించిన సీఎం కేసీఆర్.. తాజాగా కిషన్ రెడ్డి ఓకే చెప్పిన నేపథ్యంలో.. గులాబీ బాస్ స్టాండ్ ఏమిటి? చర్చకు ఆయన కూడా సిద్ధమని ప్రకటిస్తే మాత్రం రాజకీయంగా భారీ పరిణామం చోటు చేసుకున్నట్లు అవుతుందని చెప్పక తప్పదు. మరి.. సీఎం కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
This post was last modified on December 1, 2021 11:02 am
చిన్న సినిమాలకు రిలీజ్ రోజు కంటే ఒకటి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే పెద్ద…
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు.…
ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…
తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్…
తమిళనాడులో ఒక రోజు స్ట్రైక్ చేయడానికి నిర్మాతలు పిలుపు ఇవ్వడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హీరోలు…
ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సందడితో ఎంతో ఆశాజనకంగా మొదలైన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ తర్వాత ఎంత వెలవెలబోయిందో తెలిసిందే.…