Political News

కేసీఆర్ వ్యూహం.. మ‌ళ్లీ పార్ల‌మెంటు ద‌ద్ద‌రిల్లాలె!

రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ ప్రయోజనాల కోసం ఎంత వరకైనా వెళ్లాలని, పార్లమెంట్ సమావేశాల్లో బలంగా వాణి వినిపించాలని టీఆర్ ఎస్‌ ఎంపీలకు ఆ పార్టీ అధినేత‌, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సోమవారం నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్… ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.

ధాన్యం కొనుగోళ్ల విధానం, కేంద్రం అనుసరిస్తున్న తీరు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో జరిపిన చర్చల వివరాలు… తదితరాలపై భేటీలో చర్చ జరిగింది. ఈ సంద‌ర్భంగా ఎంపీలు ఎక్క‌డా త‌గ్గాల్సిన అవ‌స‌రం లేద‌ని.. కేంద్రంపై కోట్లాడాల‌ని కేసీఆర్ సూచించారు.

ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్… పంటల కొనుగోలుకు సంబంధించి జాతీయ విధానం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టం, విద్యుత్ చట్టాల రద్దు కోసం పోరాడాలని ఎంపీలకు సూచించారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం పట్టుబట్టాలని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటి విషయమై ప్రశ్నించాలని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న ముఖ్యమంత్రి… కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదని అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోవాలన్న ఆయన… పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ, స‌హా పార్టీ వాణి బలంగా వినిపించాలని ఎంపీలకు తెలిపారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి సహకారం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దన్నారు. ధాన్యం కొనుగోళ్లు,. విద్యుత్‌ చట్టాల ఉపసంహరణ.. విద్యుత్‌ మీటర్లపై కేంద్రాన్ని పార్లమెంటులో నిలదీయాలని కేసీఆర్‌ సూచించారు. అదేస‌మ‌యంలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ఎండగడుతూ పార్లమెంట్లో తీవ్ర నిరసనలు వ్యక్తం చేయాలని టీఆర్ ఎస్‌ భావిస్తోంది. వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా రైతుల సమస్యలు, ధాన్యం సేకరణపై సమగ్రవిధానం వంటి వాటిని ప్రస్తావించే వీలుంది.

This post was last modified on November 28, 2021 8:42 pm

Share

Recent Posts

సిద్దార్థ్ సిరీస్ బాగా ట్రెండ్ అవుతోంది

సినిమాల్లో సక్సెస్ కోసం కిందా మీద పడుతున్నాడు కానీ సిద్దార్థ్ కు డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ దొరుకుతోంది.…

10 minutes ago

టాక్సిక్ కొంచెం జాగ్రత్త పడాల్సిందే

నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి…

47 minutes ago

‘మల్లెపూల పల్లకి’ విమర్శలపై దర్శకుడేమన్నాడంటే?

అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…

1 hour ago

పదో తరగతి విద్యార్థులే రూపారెడ్డి హంతకులు

నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…

1 hour ago

పెంచిన టికెట్ల రేట్లలో 20 పర్సంట్ కట్టాల్సిందే

ఒకప్పటితో పోలిస్తే తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుకి సంబంధించి అంత తేలిగ్గా జీవోలు రావట్లేదు. ఓవైపు ప్రభుత్వం అంత తేలిగ్గా జీవోకు అంగీకరించట్లేదు. ఇంకోవైపు…

2 hours ago

అభిమాని చిరకాల కోరిక తీర్చిన రామ్

సినీ హీరోల మీద ఫ్యాన్స్ వీరాభిమానానికి సంబందించి ఎన్నో ఉదంతాలు చూశాం. కానీ ఇది చాలా చిత్రమైన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు…

2 hours ago