నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం. మర్యాదల్ని వదిలేయటం.. ఎంత మాట పడితే అంత మాట అనేయటం ఈ మధ్యన రాజకీయాల్లో ఎక్కువైంది. ఎవరెంత కసిగా మాట్లాడితే అంత పోటుగాడన్నట్లుగా తెలుగు రాజకీయాలు మారిపోయాయి. వయసును పట్టించుకోకుండా..అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. తానున్న పదవికి తగ్గట్లుగా మాట్లాడాలన్న ఆలోచన లేని నేతలు ఎక్కువ అవుతున్నారు. ఫైర్ బ్రాండ్ నేత అన్నంతనే ఏపీ అధికార పక్షంలో బోలెడంత మంది ముందుకు వస్తారు. వీరిలో చంద్రబాబును.. ఆయన కొడుకును నోటికి వచ్చినట్లుగా తిట్టటంలో మొదట ఎవరుంటారనే దానికి కొడాలి నాని..వల్లభనేని వంశీ తెగ పోటీపడుతుంటారు. కొడాలితో పోలిస్తే.. వల్లభనేని వంశీ ఆర్టిస్టిక్ గా తిడుతుంటారు.
కొడాలికి మాత్రం ఇవేమీ పట్టవు. రోత మాటల్ని అదే పనిగా మాట్లాడే ఆయన తీరు అంతకంతకూ ముదిరిపోతోంది. అదేమంటే.. చంద్రబాబు చేష్టలు గుర్తుకువస్తే చాలు ఒళ్లు మండిపోతోందన్నట్లుగా ఆయన మాటలు ఉంటాయి. బాబు మీద ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరుకున్న వేళ.. లాజిక్ లేకుండా మాట్లాడే మాటలు ఎక్కువ అవుతున్నాయి. దీనిపై తీవ్ర విమర్శలతో పాటు.. అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విలేకరులతో మాట్లాడి సందర్భంగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్లో ఆణిముత్యాల్లాంటివి చూస్తే..
తాజాగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. ఎన్టీఆర్ మీద తనకున్న అభిమానాన్ని గొప్పగా చెప్పినంత వరకు ఓకే. తాజా ఎపిసోడ్ లో అదే ఎన్టీఆర్ కుమార్తె మీద అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని ఏమనాలి? ఎన్టీఆర్ మీద అంత అభిమానం ఉన్నప్పుడు.. చంద్రబాబు మీద గుస్సా ఉంటే.. అది బాబు మీద తీర్చుకోవాలే కానీ.. ఎన్టీఆర్ కుమార్తెను అనుచిత వ్యాఖ్యలతో ఇబ్బంది పెడుతుంటే ఊరుకోకూడదు కదా?
అంతేకాదు.. జూనియర్ ఎన్టీఆర్ తనకు టికెట్ ఇప్పించారని.. అతడు కూడా తనకు రాజకీయ భిక్ష పెట్టిన జాబితాలో చేర్చిన కొడాలి నాని మాటలు.. తారక్ కు డ్యామేజ్ చేసేలా ఉన్నాయని అంటున్నారు. భువనేశ్వరి మీద చేసిన వ్యాఖ్యల్ని తారక్ ఖండించినప్పుడు.. కొడాలి నాని కూడా ఖండించాలి కదా? మరి.. అలా చేయని తీరు చూస్తే.. చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతన లేదన్న భావన కలుగక మానదు. ఇలాంటివి కొడాలి ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేస్తాయన్న వాస్తవాన్ని ఆయన గమనిస్తే మంచిది.
This post was last modified on November 24, 2021 12:23 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…