Political News

శాఖాహార రాష్ట్రంగా మార్చేయాలనుకుంటున్న బీజేపీ

గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో మాంసాహారం అమ్మటంపై ఆంక్షలు విధిస్తోంది. ఈ ఆంక్షలను ప్రభుత్వం తీసుకున్నది అని కాకుండా స్ధానిక సంస్ధలు తీసుకున్నాయనే కలరింగ్ ఇస్తోంది బీజేపీ. ఇంతకీ విషయం ఏమిటంటే గుజనాత్ లో కొద్దిరోజులుగా మాంసాహారంపై స్ధానికంగా గొడవలు మొదలయ్యాయి. మాంసాహార వంటలను, స్నాక్స్ ను అమ్మే రోడ్డుపక్క బండ్లు, షాపులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి.

ఎందుకంటే గుజరాత్ మొత్తాన్ని శాఖాహార రాష్ట్రంగా మార్చేయాలన్న అధికార పార్టీ ఆలోచనే దీనికి కారణమని సమాచారం. నిజానికి ఆహారమన్నది వ్యక్తిగత ఇష్టం. ఎవరు ఏ ఆహారం తీసుకుంటారన్నది పూర్తిగా వాళ్ళ ఇష్టమని అందరికీ తెలిసిందే. మాంసాహారం తీసుకునే వాళ్ళల్లో కొందరికీ ప్రతిరోజు మాంసాహారం లేనిదే ముద్దదిగదు. ఈ విషయం తెలిసినా గుజరాత్ లోని స్వాధ్యాయ పరివార్, స్వామి నారాయణ్ సంస్ధల ముసుగులో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నాయి.

పై సంస్ధలకు బీజేపీ నేతలు కూడా తోడవ్వటంతో వ్యాపారులకు ఏమి చేయాలో అర్ధం కావటంలేదు. వడోదర, రాజ్ కోట్, జూనాగడ్, భావ్ నగర్ మున్సిపాలిటి ప్రాంతాల్లో మాంసాహారం అమ్మే షాపులపైన, రోడ్డు పక్కన మాంసాహార వంటకాలను అమ్మే బండ్లపైన వరుసబెట్టి దాడులు జరుగుతున్నాయి. దాంతో మాంసాహారం అమ్మే వాళ్ళు భయపడిపోయి తమ వ్యాపారాలను మూసేసుకున్నారు. వరుసదాడుల కారణంగా ఇపుడు పై ప్రాంతాల్లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ లాంటి వంటకాలను అమ్మే షాపులు ఎక్కడా కనబడటంలేదు.

తాజా పరిమాణాలతో మాంసాహార ప్రియులకు ప్రభుత్వంపై మండిపోతోంది. పై మున్సిపాలిటి ప్రాంతాల్లో అనధికారికంగా మాంసాహారం అమ్మే దుకాణాలపై దాడులు జరుగుతున్నాయని, మాంసాహార విక్రయాలను నిషేధించారని జనాలు ప్రభుత్వంతో మొత్తుకున్నా పట్టించుకోవటంలేదు. మాంసాహార అమ్మకాలపై నిషేధమంతా పూర్తిగా అనధికారికంగానే జరుగుతోంది కాబట్టే ప్రభుత్వం ఏమాత్రం స్పందించటంలేదు.

పై రెండుసంస్ధలతో పాటు బీజేపీ నేతలపై మామూలు జనాలు మండిపోతున్నారు. తాము ఇదే ఆహారం తినాలని చెప్పేందుకు బీజేపీ నేతలకు అధికారం ఏముందంటు గోల చేస్తున్నారు. కాకపోతే అధికారికంగా తీసుకున్న నిర్ణయం కాకపోవటంతో పార్టీ కూడా స్పందించటంలేదు. ఇలాంటి అనేక చర్యలతో బీజేపీపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. మాంసాహార అమ్మకాలను నిలిపేసే బదులు ఏరులై పారుతున్న మద్యాన్ని నియంత్రించాలంటు జనాల్లో గోల పెరిగిపోతోంది. అయినా జనాల గోలను ఎవరూ పట్టించుకోవటంలేదు.

This post was last modified on November 24, 2021 11:42 am

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

21 minutes ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

2 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

2 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

2 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

4 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

7 hours ago