పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పును రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎత్తి చూపారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని అనుకున్న జగన్మోహన్ రెడ్డి చాలా సింపుల్ గా అయిపోయేదాన్ని పెద్ద సమస్యగా తయారు చేసుకున్నట్లు ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. ఆయన మాటల్లోనే మూడు రాజధానులు అని జగన్ చెప్పటంతోనే సాంకేతిక, న్యాయ సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జస్టిస్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా వైజాగ్, కర్నూలు, అమరావతిని ప్రకటించిన విషయం తెలిసిందే.
మూడు ప్రాంతాలకు క్యాపిటల్స్ అని కాకుండా సింపుల్ గా తాను అనుకున్నట్లే జగన్ చేసుకునే అవకాశముందన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం తాను వైజాగ్ లో కూర్చుంటానని జగన్ చెబితే ఎవరు కూడా అడ్డుకునే అవకాశమే ఉండేది కాదన్నారు. అలాగే హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నట్లు ప్రకటిస్తే అందులో తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదన్నారు. పబ్లిక్ కన్వీనియంట్ అనే పేరుతో జగన్ ఏమి చేసినా చెల్లుబాటవుతుందని ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.
చాలా సింపుల్ గా జరిగిపోయే ప్రక్రియను జగన్ క్యాపిటల్స్ అనే పేరుతో బాగా సమస్యాత్మకం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి వేసవి కాలం విడిది పేరుతో ఢిల్లీ నుండి హైదరాబాద్ కు రావటాన్ని ఎవరైనా అభ్యంతరం చెబుతున్నారా ? అని ప్రశ్నించారు. దేశ రాజధానిలోనే ఆర్బీఐ ఉండాలని ఎక్కడా లేదన్నారు. పరిపాలనంతా ఒక్క రాజధానిలోనే ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలన్నీ అమరావతిలోనే ఉంచాలని ఏ చట్టమూ నిర్దేశించలేందన్నారు.
పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని శాఖలను వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయటాన్ని ఏ కోర్టు కూడా తప్పు పట్టే అవకాశం లేదన్నారు. తాను అనుకున్నట్లుగానే వైజాగ్, కర్నూలుకు ప్రభుత్వ విభాగాలను, శాఖల హెడ్ క్వార్టర్స్ ను తరలించేసుంటే సరిపోయేదని ప్రొఫెసర్ స్పష్టంగా చెప్పారు. అలాకాకుండా మూడు క్యాపిటల్స్ అనగానే దీనికొక బిల్లు, ఉభయసభల ఆమోదంతో పాటు సాంకేతిక సమస్యలు, లీగల్ అభ్యంతరాలు తలెత్తాయన్నారు.
రాజకీయంగా అధికారంలో ఉన్న పార్టీ తీసుకున్న నిర్ణయాలు మిగిలిన పార్టీలు వ్యతిరేకించటం, అభ్యంతరాలు వ్యక్తం చేయటం, కోర్టుల్లో కేసులు వేయించటం ఎప్పుడూ ఉండేదే అని ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. రాజకీయపార్టీల అభ్యంతరాలను కాకుండా న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందన్నారు. చాలా సింపుల్ గా అయిపోయే వ్యవహారాన్ని జగన్ ఎందుకింత సంక్లిష్టం చేసుకున్నారో అర్ధం కావడం లేదన్నారు.
This post was last modified on November 23, 2021 10:12 am
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…