Political News

జగన్ చేసిన తప్పేంటో తెలుసా ?

పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పును రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎత్తి చూపారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని అనుకున్న జగన్మోహన్ రెడ్డి చాలా సింపుల్ గా అయిపోయేదాన్ని పెద్ద సమస్యగా తయారు చేసుకున్నట్లు ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. ఆయన మాటల్లోనే మూడు రాజధానులు అని జగన్ చెప్పటంతోనే సాంకేతిక, న్యాయ సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జస్టిస్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా వైజాగ్, కర్నూలు, అమరావతిని ప్రకటించిన విషయం తెలిసిందే.

మూడు ప్రాంతాలకు క్యాపిటల్స్ అని కాకుండా సింపుల్ గా తాను అనుకున్నట్లే జగన్ చేసుకునే అవకాశముందన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం తాను వైజాగ్ లో కూర్చుంటానని జగన్ చెబితే ఎవరు కూడా అడ్డుకునే అవకాశమే ఉండేది కాదన్నారు. అలాగే హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నట్లు ప్రకటిస్తే అందులో తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదన్నారు. పబ్లిక్ కన్వీనియంట్ అనే పేరుతో జగన్ ఏమి చేసినా చెల్లుబాటవుతుందని ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.

చాలా సింపుల్ గా జరిగిపోయే ప్రక్రియను జగన్ క్యాపిటల్స్ అనే పేరుతో బాగా సమస్యాత్మకం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి వేసవి కాలం విడిది పేరుతో ఢిల్లీ నుండి హైదరాబాద్ కు రావటాన్ని ఎవరైనా అభ్యంతరం చెబుతున్నారా ? అని ప్రశ్నించారు. దేశ రాజధానిలోనే ఆర్బీఐ ఉండాలని ఎక్కడా లేదన్నారు. పరిపాలనంతా ఒక్క రాజధానిలోనే ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలన్నీ అమరావతిలోనే ఉంచాలని ఏ చట్టమూ నిర్దేశించలేందన్నారు.

పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని శాఖలను వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయటాన్ని ఏ కోర్టు కూడా తప్పు పట్టే అవకాశం లేదన్నారు. తాను అనుకున్నట్లుగానే వైజాగ్, కర్నూలుకు ప్రభుత్వ విభాగాలను, శాఖల హెడ్ క్వార్టర్స్ ను తరలించేసుంటే సరిపోయేదని ప్రొఫెసర్ స్పష్టంగా చెప్పారు. అలాకాకుండా మూడు క్యాపిటల్స్ అనగానే దీనికొక బిల్లు, ఉభయసభల ఆమోదంతో పాటు సాంకేతిక సమస్యలు, లీగల్ అభ్యంతరాలు తలెత్తాయన్నారు.

రాజకీయంగా అధికారంలో ఉన్న పార్టీ తీసుకున్న నిర్ణయాలు మిగిలిన పార్టీలు వ్యతిరేకించటం, అభ్యంతరాలు వ్యక్తం చేయటం, కోర్టుల్లో కేసులు వేయించటం ఎప్పుడూ ఉండేదే అని ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. రాజకీయపార్టీల అభ్యంతరాలను కాకుండా న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందన్నారు. చాలా సింపుల్ గా అయిపోయే వ్యవహారాన్ని జగన్ ఎందుకింత సంక్లిష్టం చేసుకున్నారో అర్ధం కావడం లేదన్నారు.

This post was last modified on November 23, 2021 10:12 am

Share

Recent Posts

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

38 minutes ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

1 hour ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

1 hour ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

2 hours ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

2 hours ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

2 hours ago