తెలంగాణలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కేసీఆర్కు ప్రస్తుతం ప్రతిపక్షాల నుంచి సవాలు ఎదురవుతుందంటే అందుకు బండి సంజయ్ ప్రధాన కారణం. ఏడేళ్లుగా తిరుగులేని కేసీఆర్కు సంజయ్ కొరకరాని కొయ్యలా మారారు. గతేడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఈ కరీంనగర్ ఎంపీ.. దూకుడు పెంచారు.
రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలతో మరింత జోరు పెంచారు. ఇప్పుడిక హుజూరాబాద్ ఉప ఎన్నికలో తమ పార్టీ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ గెలవడంతో బండి పట్టాపగ్గాలు లేకుండా పరుగులు పెడుతోంది.
కేసీఆర్ ఒక్క మాటంటే చాలు.. బండి సంజయ్ వెంటనే పది మాటలతో విరుచుకుపడడం కేంద్రంపై విమర్శలను సమర్థంగా తిప్పుకొట్టడం అధికార పార్టీకి మింగుడుపడడం లేదు. అందుకే ముందు సంజయ్కు చెక్ పెట్టేందుకు కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. లోక్సభ ఎంపీగా సంజయ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్లో ఆయన్ని అడ్డుకునేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అక్కడ టీఆర్ఎస్ను బలోపేతం చేసే దిశగా కీలక పదవులను ఆ జిల్లా నేతలకు కట్టబెడుతున్నారని సమాచారం.
ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ నుంచి ముగ్గురు మంత్రులు, ఓ ప్రణాళిక వైస్ ఛైర్మన్ ఉన్నారు. ఇటీవల ఎస్సీ కార్పోరేషన్, బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను ఆ జిల్లా నాయకులకే కట్టబెట్టారు. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు పదవులిచ్చారు. జనవరిలో ఖాళీ అయ్యే మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా కరీంనగర్కే దక్కుతాయి.
ఇలా కరీంనగర్ నాయకుల పదవుల పంట పండుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సంజయ్ వ్యూహాలను తిప్పి కొట్టేందుకు ఆయన నియోజకవర్గంలో కేసీఆర్ ఇలాంటి వ్యూహాలు రచిస్తున్నారని అందుకే అక్కడి నేతలకు కీలక పదవులు ఇస్తున్నారని సమాచారం. మరి ఆ నాయకులు బండి సంజయ్ను ఏ మేరకు కట్టడి చేస్తారో చూడాలి.
This post was last modified on November 22, 2021 3:31 pm
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…