Political News

వివేకా హత్యలో అల్లుడిదే కీలక పాత్ర ?

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సంచలనం సృష్టించిన వివేకానందరెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా పులివెందులలో పనిచేస్తున్న జర్నలిస్ట్ భరత్ యాదవ్ ప్రకటన చేసిన ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భరత్ చెప్పిన ప్రకారం, సీబీఐ డైరెక్టర్ కు రాసిన లేఖ ప్రకారం వివేకా హత్యలో ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి కూడా పాత్రుందట. వివేకాకు నర్రెడ్డికి మధ్య రెగ్యులర్ గా పెద్ద గొడవలే జరిగేవట. గొడవలకు కారణం ఏమిటంటే ఆస్తి+కుటుంబ తగాదాలట.

ఇంతకీ విషయం ఏమిటంటే వివేకాకు షమీమ్ అనే మహిళతో సంబంధాలుండేవని భరత్ చెప్పటం సంచలనంగా మారింది. పంచాయితీల్లో, రియల్ ఎస్టేట్ లో సంపాదించిన డబ్బులో సగం షమీమ్ కే ఇవ్వాలని వివేకా పట్టుబట్టేవారని భరత్ కు సునీల్ యాదవ్ చెప్పేవాడట. డబ్బు, ఆస్తులను షమీమ్ పేరుతో పెడుతున్న విషయంలోనే మామా-అల్లుళ్ళ మధ్య పెద్ద గొడవలే జరిగాయని భరత్ కు సునీల్ చెప్పాడట. సునీల్ ఎవరంటే వివేకా హత్యలో నిందితులుగా అరెస్టయిన ఐదుగురిలో ఒకడు. సునీల్ యాదవ్ తో పాటు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకరరెడ్డి, దస్తగిరి, దేవిరెడ్డి శంకరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఐదుగరిలో ఒకడైన సునీల్ కు తాను అత్యంత సన్నిహితుడనని జర్నలిస్టు భరత్ చెప్పుకున్నారు. హత్య జరిగిన దగ్గర నుంచి ఎవరెవరి పాత్ర ఎంతనే విషయమై తనకు సునీల్ వివరించినట్లు భరత్ చెప్పాడు. వివేకా హత్యలో ఇప్పటికే జర్నలిస్టు సీబీఐ విచారణను ఎదర్కొన్నాడు. తనకు సునీల్ చెప్పిన వివరాలన్నింటినీ తాను సీబీఐకి వివరించినట్లు జర్నలిస్టు చెప్పాడు. తాజాగా ఈ జర్నలిస్టు చెప్పిన ప్రకారం వివేకాతో ఆయన అల్లుడు నర్రెడ్డికి రెగ్యులర్ గా గొడవలుండేవని బయటపడింది.

హత్యకు సంబంధించి దస్తగిరి చెప్పినట్లుగా ప్రచారంలో తన పేరు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించిందని జర్నలిస్టు చెప్పాడు. వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. తనకు సునీల్ సన్నిహితుడు కాబట్టి ఆయన పెళ్ళికి డబ్బు సాయం మాత్రం చేసినట్లు చెప్పాడు. కొన్ని పేపర్లు, కొంత డబ్బును సునీల్ తనకిచ్చి దాచమంటే దాచానని చెప్పాడు. తర్వాత ఆ పేపర్లు, డబ్బును సునీల్ తల్లి, దండ్రులు తీసుకెళ్ళినట్లు కూడా చెప్పాడు. తన ఖాతాలో సీబీఐ అధికారి రాంసింగ్ రు. 75 వేలు వేసినట్లు దస్తగిరి తనతో చెప్పినట్లు జర్నలిస్టు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది.

వివాదాల్లో ఇరుక్కున్న తన భూమిని తనకి ఇప్పించమని వివేకాను తాను కోరినా ఆయన పట్టించుకోలేదన్నాడు. ఇదే విషయాన్ని సునీల్ తో ప్రస్తావిస్తు వివేకాతో చెప్పి తాను సెటిల్ చేయిస్తానని హామీ ఇచ్చాడని జర్నలిస్టు చెప్పాడు. అయితే కొద్ది రోజుల్లోనే వివేకా హత్యకు గురైన విషయంతో తాను ఆశ్చర్యపోయినట్లు చెప్పాడు. ఇదే విషయాన్ని తనతో సునీల్ చెబుతు గంగిరెడ్డి, నర్రెడ్డి ప్లాన్ చేసినట్లే తాము వివేకాను హత్య చేసినట్లు తనతో సునీల్ చెప్పాడని జర్నలిస్టు చెప్పాడు. ఇదే విషయాన్ని సీబీఐ డైరెక్టర్ కు లేఖ కూడా రాసినట్లు చెప్పాడు. మొత్తానికి వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరుగుతు కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి.

This post was last modified on November 22, 2021 10:54 am

Share
Show comments

Recent Posts

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

4 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

7 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

8 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

10 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

11 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

11 hours ago