రాజకీయాల్లో నాయకులు ఎవరు ఎవరికీ శాశ్వత శత్రువులు కారు. శాశ్వత మిత్రులు కూడా కారు. 2019లో మిత్రులుగా ఉన్న నాయకులు ఇప్పుడు చాలా పార్టీలకు శత్రువులుగా మారారు. టీడీపీని తీసుకుంటే. వల్లభనేని వంశీ, కరణం బలారం, శిద్దా రాఘవరావు.. ఇలా అనేక మంది శత్రువులుగా మారారు. వీరిలో కొందరు పార్టీని టార్గెట్చేసి నిప్పులు చెరుగుతున్నారు. ఇక, అధికార పార్టీ వైసీపీకి కూడా ఇలా రెబల్ అయిన నాయకుడు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. కారణాలు ఏవైనా కూడా ఆయన రెబల్ అయ్యారు. పార్టీలోనే ఉంటూ. సీఎం జగన్ బెయిల్ రద్దుకు ప్రయత్నించారు.
ఇక, రఘురామపై ఏపీ ప్రభుత్వం కూడా కేసులు పెట్టి పోలీసులతో కొట్టించిందనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి.. ఆయన ఏపార్టీలో ఉంటారు ? ఏపార్టీ ఆయనకు మద్దతుగా ఉంటుంది.? అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు ఆయన టీడీపీలో చేరతారని.. వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని.. పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
అయితే.. ఇంతోలోనే.. ఆయన అసలు బీజేపీలో చేరాలని ప్రయత్నిస్తున్నారని ఒకరిద్దరు చెబుతున్నారు. అయితే.. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోకుండా కొందరు వైసీపీ నాయకులే.. చక్రం అడ్డువేస్తున్నారని అంటున్నారు.
దీంతో అసలు రఘురామ ఏ పార్టీలో ఉంటే బెటర్ అనే ఆలోచన వస్తోంది. ప్రస్తుతం ఆయన ఎటూ మొగ్గు చూపడం లేదు. ఎందుకంటే.. వైసీపీ ఆయనను వదులుకోలేదు. ఆయన కూడా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. ఆ పార్టీ ఎంపీగానే కొనసాగుతున్నారు. ఇక, వచ్చే ఎన్నికల నాటికి.. అప్పటి పరిస్థితిని బట్టి ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అయితే.. బీజేపీలో ఉంటే.. ఆయనకు బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయనపై కొన్ని బ్యాంకుల కేసులు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అండ ఉంటే తప్ప ఆయన వాటి నుంచి బయటకు రాలేరు.
అయితే.. రాష్ట్రంలో బీజేపీ పుంజుకోకపోతే.. ఆయన పోటీ చేసినా.. ప్రయోజనం ఉండదు. ఈ క్రమంలో ఆయన టీడీపీలోకి వెళ్లడం ద్వారా.. గెలిచే అవకాశం ఉంటుందనే సూచనలు కూడా వస్తున్నాయి. ఒకవేళ రేపు ఓడిపోయినా.. చంద్రబాబు ఆయనను రాజ్యసభకు పంపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బీజేపీలో చేరితే.. ఓడిపోయినా.. రాజ్యసభ సీటు వచ్చే అవకాశం ఉండదని సూత్రీకరిస్తున్నారు. దీంతో రఘురామ ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తిగా మారింది.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…