ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అనూహ్యంగా అప్పటి వరకు ఉన్న ప్రాజెక్టులపై రివర్స్ మంత్రం పఠించింది. గత చంద్రబాబు ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి.. ఎక్కువ మొత్తాలకు పనులు అప్పగించిందని.. తాము ప్రజాధనాన్ని కాపాడుతామని.. చెప్పిన సీఎం జగన్.. దాదాపు అన్ని కాంట్రాక్టు లకు రివర్స్ మంత్రం అమలు చేశారు. దీంతో కొంత మేరకు ఆయన ప్రజాధనాన్ని వెనక్కి రప్పించారు. అయితే.. ఇప్పుడు ఇదే ఆయన ప్రభుత్వంపై పగబట్టిందని అంటున్నారు పరిశీలకులు.
దీనికి కారణం.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు.. ఏకమయ్యారు. అందరూ సిండికేట్ అయ్యారు. ప్రభుత్వం ఏపనిచేయాలన్నా.. కాంట్రాక్టర్లతోనే పని. అయితే.. గతంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటికే రివర్స్ దెబ్బపడింది. దీనికితోడు గత పనులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదు. ముఖ్యంగా ఇసుక రవాణా.. సహా ప్రాజెక్టులకు సంబంధించి పెట్టబడులు పెట్టి పనులు చేసిన కాంట్రాక్టర్లు.. ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. కొందరు ఇప్పటికే కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేసి.. తమ సొమ్ములు రాబట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో.. కాంట్రాక్టర్లు అందరూ ఏకమై.. ప్రభుత్వ పనులు చేయరాదని.. నిర్ణయించుకున్నట్టు ప్రభుత్వ వర్గాల్లోనే వినిపిస్తోంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం తాజాగా రోడ్లను బాగు చేసేందుకు జగన్ సర్కారు టెండర్లు పిలిస్తే.. ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. దీనిపై అధికారులు ఆరా తీయగా.. మీరు ఇప్పటి కే ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదని.. పైగా రివర్స్ అంటున్నారని ఇది మాకు నష్టాలు తెస్తోందని కాంట్రాక్టర్లు తెగేసి చెబుతున్నారట. ముందు డబ్బులు చెల్లించాలి.
అదే సమయంలో రివర్స్ అనే మాట వినిపించకూడదని.. వారు షరతులు పెడుతున్నారట. దీంతో ఇప్పుడు ఏం చేయాలనే విషయంపై జగన్ సర్కారు తలపట్టుకుంది. పోనీ.. సొంత పార్టీలోనే నేతలకు కాంట్రాక్టులు ఇద్దామని అనుకున్నా.. ప్రభుత్వం చెబుతున్న ధరలకు తాము చేసేది లేదని.. వారు కూడా మొండికేస్తున్నారట. దీంతో ఇప్పుడు.. రివర్స్.. రివర్స్ అయిందేనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. మరి దీనిపై ఏం చేస్తారో చూడాలని అంటున్నారు సీనియర్ అధికారులు.
This post was last modified on November 21, 2021 8:39 pm
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…