Political News

వైసీపీలో సోమ‌వారం టెన్ష‌న్‌.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌..!

అవును… ఇప్పుడు అంద‌రి దృష్టీ ఏపీ అసెంబ్లీ వైపే ఉంది. శుక్ర‌వారం జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. మీడియా ముందుకు రావ‌డం.. క‌న్నీరు పెట్ట‌డం.. ఇది నంద‌మూరి కుటుంబాన్ని కూడా క‌దిలించ‌డం.. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిర‌స‌న‌లు రావ‌డం.. వంటి ప‌రిణామాలు తెలిసిందే.

ముఖ్యంగా నంద‌మూరి కుటుంబం మొత్తం ఏక‌మై.. స‌భా కార్య‌క్ర‌మాల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం.. టీడీపీ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం.. అంద‌రినీ ఆలోచ‌న‌కు గురిచేసింది. ఈ నేప‌థ్యంలో రంగంలోకి దిగిన మంత్రులు పేర్నినాని, బాలినేని శ్రీనివాస‌రెడ్డి, క‌న్న‌బాబు వంటి వారు వివ‌ర‌ణ ఇచ్చారు.

అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు విష‌యంలో ర‌గిలిన చిచ్చు.. ఆరే ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. దీనికితోడు.. ఆయ‌న చేసిన శ‌ప‌థం.. నేను సీఎం అయ్యే వ‌ర‌కు.. స‌భ‌లోకి అడుగుపెట్ట‌న‌న్న విష‌యం కూడా ఇంకా చ‌ర్చ‌నీయాశం గానే మారింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు.. వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు అన్ని వైపుల నుంచి ఒకింత ఒత్తిడైతే పెరిగింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జ‌గ‌న్ ఏం చేస్తారు? అనే చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలోనే అంద‌రి చూపూ.. అసెంబ్లీ వైపు ప‌డింది. శుక్ర‌వారం తీవ్ర వివాదంతో వాయిదా ప‌డిన స‌భ‌.. సోమ‌వారం ప్రారంభం కానుంది.

ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ప్రారంభ‌మ‌య్యే స‌భ‌లో స్వ‌యంగా సీఎం జ‌గ‌నే ఈ వివాదంపై వివ‌ర‌ణ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఎందుకంటే..ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు విష‌యంలో నంద‌మూరి కుటుంబం పెద్ద‌గా స్పందించ‌లేదు. కానీ, భువ‌నేశ్వ‌రి విష‌యంలో వ‌చ్చిన వివాదం నేప‌థ్యంలో ఈ ఫ్యామిలీ ఒకింత భావోద్వేగంతోనే రియాక్ట్ అయింది. దీనికితోడు ఈ అంశంపై జ‌గ‌న్ ఏం చెబుతారో ఎదురు చూస్తున్నామంటూ ఎన్టీఆర్‌ కుటుంబ స‌భ్యులు వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ప‌క్షాన జ‌గ‌న్ చేసే కామెంట్లకు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇక‌, రాజ‌కీయంగా కూడా జ‌గ‌న్‌పై మ‌ర‌క‌లు ప‌డుతున్న నేప‌థ్యంలో ఆయ‌న ఖ‌ఛ్చితంగా స్పందించి తీరుతార‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on November 21, 2021 11:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం…

4 hours ago

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు…

8 hours ago

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

8 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

12 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

13 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

13 hours ago