అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అధికార వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కలత చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన భార్యపై వైసీపీ నాయకులు దారుణ వ్యాఖ్యలు చేశారని సభ నుంచి వెళ్లిపోయిన బాబు కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే హెడ్కానిస్టేబుల్ విజయకృష్ణ.. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ప్రస్తుత పోలీస్ వ్యవస్థను తప్పుపడుతూ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన ఆవేదనను ఓ వీడియోలో బయటపెట్టారు.
”1998 బ్యాచ్లో సివిల్ కానిస్టేబుల్గా ప్రకాశం జిల్లా టాపర్గా నిలిచా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాకు ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడ చేయి చాచింది లేదు. నీతి నిజాయతీతో ఉద్యోగం చేశా. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో పోలీసులకు తెలుసు, రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. అసెంబ్లీలో హృదయ విదారకర సంఘటన జరిగింది. నైతిక విలువలు నిబద్ధత కొల్పోయిన ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యహరిస్తోంది. అలాంటి వాళ్ల దగ్గర ఉద్యోగం చేస్తున్నందుకు సిగ్గుపడి ఈ నిర్ణయం తీసుకున్నా” అని ఆయన వీడియోలో పేర్కొన్నారు.
“నా ఉద్యోగంలో ఏనాడూ అవినీతికి పాల్పడలేదు. ఈ రోజు పోలీసు వ్యవస్థ నీచంగా తయారైంది. పోస్టింగ్ల కోసం మోకారిల్లే పరిస్థితికి దిగజారింది. నీచమైన సంస్కృతి కనిపిస్తోంది. అలా వచ్చే డబ్బులతో నా పిల్లలకు తిండి పెట్టలేక ఈ మోకారిల్లే పోలీసు ఉద్యోగం చేయలేకపోతున్నా. వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంత తప్పో తెలుసుకోవాలి. నాకు ఈ క్యాప్ వద్దూ.. ఈ బెల్టు వద్దూ.. నా వృత్తికి గౌరవమిస్తూ ప్రజల ముందు నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా. టీ కొట్టు పెట్టుకుంటా.. ఇంకేదో చేసుకుంటా. అంతేకానీ ఇలా మోకారిల్లే ఉద్యోగంలో ఉండలేను” అని భావోద్వేగంతో మాట్లాడిన ఆయన అనంతరం తన పోలీసు డ్రెస్సును తీసేశారు.
This post was last modified on November 20, 2021 10:30 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…