మూడు వ్యవసాయ చట్టాలు నరేంద్ర మోడీ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఇపుడందరి దృష్టి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంపై పడింది. మూడు వ్యవసాయ చట్టాలను చేసిన తర్వాత రైతుల ఆధ్వర్యంలో ఢిల్లీ శివార్లలో గడచిన 12 మాసాలుగా ఎంత పెద్ద ఉద్యమం నడుస్తోందో అందరికీ తెలిసిందే. ఇంతకాలం చట్టాలను వెనక్కు తీసుకునేది లేదని తెగేసి చెబుతు వచ్చిన మోడి హఠాత్తుగా చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించటమే కాకుండా దేశానికి ప్రత్యేకించి రైతాంగానికి, వారి కుటుంబాలకు మోడీ క్షమాపణ కూడా చెప్పారు. మోడీ ప్రకటన అన్నది కచ్చితంగా రాజకీయ అనివార్యత నేపథ్యంలో మాత్రమే జరిగిందని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ మధ్య జరిగిన ఉపఎన్నికలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలు తగలటం, తొందరలోనే జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే మోడీ వ్యవసాయ చట్టాలను రద్దు చేశారనటంలో సందేహం లేదు.
అలాగే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయాన్ని కూడా మోడీ పునరాలోచించాలంటు డిమాండ్లు మొదలయ్యాయి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకడుగు వేసేదే లేదన్నట్లుగా వ్యవహరించిన మోడీ మొదటిసారి వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా మోడీ వెనక్కు తీసుకోవాలని ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
లాభాల్లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాల్సిన అవసరం లేకపోయినా మోడీ సర్కార్ మాత్రం హిడెన్ అజెండాతోనే స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించటానికి నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో కూడా సుప్రింకోర్టులో కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా కేసులు నడుస్తున్నాయి.
ఒకవేళ మోడి గనుక ప్రజల ఆకాంక్షల మేరకు తన నిర్ణయాన్ని మార్చుకుంటే కేసులను విత్ డ్రా చేసుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు. కాబట్టి వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలని జనాలందరు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ చట్టాల విషయం అంటే రాజకీయ అనివార్యత వల్ల జరిగింది. మరి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మాటేమిటి ?
This post was last modified on November 20, 2021 2:04 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…