Political News

వైసీపీలో విషాదం.. ఎమ్మెల్సీ కరీమున్నీసా కన్నుమూత

ఏపీ అధికారపక్షంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్సీ అనారోగ్యంతో కన్నుమూశారు. 65 ఏళ్ల వయసున్న పార్టీ ఎమ్మెల్సీ కరీమున్నీసా అకాలమరణం చెందారు. శుక్రవారం సైతం ఆమెకు మండలి సమావేశాలకు హాజరు అయ్యారు. అలాంటి ఆమె రోజు గడిచేసరికి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారన్న వాస్తవాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న సభలో తమతో ఉన్న వ్యక్తి.. ఈ రోజు నుంచి ఇక ఎప్పటికి లేరన్న బాధ వారిని వేధిస్తోంది.

కాంగ్రెస్ లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కరీమున్నీసా.. వైఎస్ జగన్ పార్టీ పెట్టటంతో కాంగ్రెస్ నుంచి ఆయన పార్టీలోకి వచ్చేశారు. పార్టీని పెట్టిన నాటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరించిన ఆమె.. విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి.. కార్పొరేటర్ గా విజయం సాధించారు. పార్టీకి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్సీగా అవకాశం లభించింది. మార్చిలో ఆమెకు ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. విజయవాడ ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన కరీమున్నీసా.. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్సీ స్థాయి వరకు సొంతంగా ఎదిగారు.

శుక్రవారం ఉదయం వరకు బాగానే ఉన్న ఆమె.. మండలి సమావేశాలకు హాజరయ్యారు. అనంతరం ఇంటికి వచ్చిన ఆమెకు రాత్రి వేళ అస్వస్థతకు గురికావటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. గుండె పోటు కారణంగా ఆమె మరణించినట్లుగా వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి గడిచిన వారం రోజులుగా ఆమె ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

శుక్రవారం రాత్రి ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పటంతో ఆమె కుమారుడు రుహుల్లా ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాసేపటికే తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి ఆమె భౌతికకాయాన్ని ఇంటికి చేర్చారు. ఆమె మరణ వార్త విన్న వైసీపీ నేతలంతా భారీ షాక్ కు గురవుతున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆకస్మిక మరణంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

This post was last modified on November 20, 2021 10:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

55 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago