Political News

కేంద్రం తెలివి – ఏపీ రాజధాని హైదరాబాద్ !

కొందరు అన్నట్లుగా ఏపీకి ఏదో శాపం ఉన్నట్లుంది. మద్రాసు నుంచి సొంతంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న నాటి నుంచి.. రాజధాని ఏర్పాటు విషయంలో మాత్రం ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తమకు మించిన తోపులు మరెవరూ ఉండరన్నట్లుగా.. అన్నింట్లోనూ తామే మొనగాళ్లమన్న భావన ఆంధ్రోళ్లలో ఎక్కువంటారు. అలాంటి అతిశయమే వారికి ఒక రాజధాని అంటూ లేకుండాపోయిందన్న ఆగ్రహం కొందరి నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది.

అయితే.. ఇదే వాదనను మరికొందరు మరోలా చెబుతుంటారు. ఆంధ్రోళ్లకు ఇవ్వటమే కానీ తీసుకోవటం తెలీదని.. కానీ ఆ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పటంలో ఆ ప్రాంతానికి చెందిన మేధావులు.. నేతలు ఎప్పుడూ చెప్పింది లేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

ఇంతకూ ఇదంతా ఎందుకంటే.. ఏపీ రాజధానికి సంబంధించి కేంద్రం తీరుకు సంబంధించిన సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. ఏపీ రాజధానికి సంబంధించి కేంద్రం ఏమనుకుంటుంది? అన్న సూటి ప్రశ్నకు వచ్చే సమాధానం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. కేంద్రం ఇప్పుడు ఏపీ రాజధానిగా హైదరాబాద్ గానే ప్రస్తావిస్తోంది. విభజన తర్వాత కూడా పదేళ్ల పాటు ఏపీ రాజధాని నగరంగా హైదరాబాద్ ఉంటుంది.

పేరుకు పదేళ్ల పాటు హైదరాబాద్ రాజధాని అని చెప్పినా.. సాంకేతికతలోకి వెళితే.. హైదరాబాద్ లోని ఒక నియోజకవర్గంలోని కొంత భాగాన్ని మాత్రమే ఏపీ రాజధానిగా పేర్కొనటం కనిపిస్తుంది. అయినా.. 2014లో అధికారంలోకి చంద్రబాబు ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిగా ప్రకటించటం.. కేంద్రం కూడా గుర్తించింది కదా? అన్న సందేహం కలగొచ్చు. అయితే.. బాబు తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు అమరావతికి బదులుగా మూడు రాజధానులుగా పేర్కొనటం.. దానికి సంబంధించిన అంశాలు కోర్టులో నలుగుతున్న వైనం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఏపీ రాజధానిగా టెక్నికల్ గా తప్పు లేని హైదరాబాద్ పేరుతో ఉత్తర ప్రత్యుత్తరాల్ని కేంద్రం జరుపుతుందని చెబుతున్నారు. సాంకేతికంగా వంక పెట్టటానికి వీల్లేని మార్గాన్ని కేంద్రం ఎంపిక చేసుకుందన్న మాట వినిపిస్తోంది. కోర్టు కేసుల నేపథ్యంలో అమరావతిని రాజధానిగా అంటే ఒక తలనొప్పి.. అలా అని.. మూడు రాజధానుల పేర్లలో పాలనా రాజధానిగా చెప్పిన విశాఖపట్నాన్నిప్రస్తావిస్తే మరో తిప్పలు. అందుకే.. ఎవరికి ఎలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా.. అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకుండా హైదరాబాద్ ను ప్రస్తావించటం ద్వారా కేంద్రం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on November 19, 2021 10:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

2 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

5 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

6 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

6 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

7 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

7 hours ago