Political News

రైతుల‌పై ప్రేమ కురిపించిన మోడీ.. ఫుల్ స్పీచ్ ఇదే

దేశ‌వ్యాప్త రైతాంగంపై గ‌డిచిన 9 నెలల కాలంగా తీవ్ర మౌనం పాటించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఆక‌స్మికంగా.. గ‌ళం విప్పారు. నిజానికి ఈ ఏడాది జ‌న‌వ‌రి-ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య కేంద్ర ప్ర‌భుత్వం మూడు వ్య‌వ‌సాయ నూతన చ‌ట్టాలు తీసుకువ‌చ్చింది. వీటిలో కార్పొరేట్ రంగాన్ని ప్రోత్స‌హించేలా.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంద‌ని.. రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ చ‌ట్టాల‌ను అధ్య‌యనం చేసిన‌.. మేధావులు కూడా త‌ప్పుబ‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ.. మోడీ స్పందించ‌లేదు. కానీ, తాజాగా ఆయ‌న రైతుల‌పై ప్రేమ కురిపించారు.

గురునాన‌క్ జ‌యంతి ని పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం ప్ర‌ధాని జాతినుద్దేశించి ప్ర‌సంగించారు. ప్ర‌జ‌లందరికీ గురునాన‌క్ జ‌యంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ క్ర‌మంలో రైతుల ఇబ్బందులు ద‌గ్గ‌ర‌నుండి చూశాన‌ని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌న్నారు. తాము అధికారంలోకి వ‌చ్చాక వ్య‌వ‌సాయ రంగానికి ప్రాధాన్యం పెంచిన‌ట్టు తెలిపారు. దేశంలో 80శాతం మంది చిన్న స‌న్న‌కారు రైతులేన‌న‌ని, వారికి మేలు క‌లిగే నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే రైతుల‌కు ల‌బ్ధి క‌లిగేలా భూసార ప‌రీక్ష‌లకు శ్రీకారం చుట్టామ‌ని తెలిపారు.

కోట్లాదిమంది రైతుల‌కు సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేశామ‌న్నారు. రైతుల‌కు పెట్టుబ‌డి సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జ‌మ‌చేస్తున్నామ‌న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్య‌వ‌సాయ మౌలిక వ‌స‌తులు పెంచుతు న్నామ‌ని వివ‌రించారు. వ్య‌వ‌సాయ‌రంగంలో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చామ‌ని తెలిపారు. మైక్రో ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌పై దృష్టిసారించామ‌ని మోడీ వివ‌రించారు. రైతుల‌కు రుణాలివ్వ‌డాన్ని సుల‌భ‌త‌రం చేశామ‌ని పేర్కొన్నారు. రైతుల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుతున్నామ‌న్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా సుల‌భంగా రుణాలు పొందేలా రైతుల‌కు వెసులుబాటు క‌ల్పించిన‌ట్టుచెప్పారు.

అంతేకాదు.. చిన్న రైతుల అభివృద్ధే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌ని ప్ర‌ధాని మోడీ వివ‌రించారు. రైతుల సంక్షేమ‌మే తొలి ప్రాధాన్యమ‌ని వివ‌రించారు. రైతుల క‌ష్టాలు తీర్చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. ప‌దికోట్ల‌కు పైగా చిన్న‌, స‌న్న‌కారు రైతులున్నారని, గ‌త ప్ర‌భుత్వాలు రైతుల సంక్షేమాన్ని నిర్ల‌క్ష్యంచేశాయ‌ని వివ‌రించారు. ఈ క్ర‌మంలో తాము తీసుకువ‌చ్చిన మూడు సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అయితే.. అదేస‌మ‌యంలో ఈ మూడు చ‌ట్టాలు కూడా రైతుల‌కుప్ర‌యోజ‌నక‌ర‌మేన‌ని ముక్తాయించ‌డం గ‌మ‌నార్హం. ఇత‌మిత్థంగా ప్ర‌ధాని ప్ర‌సంగం మొత్తం అన్న‌దాతల చుట్టే తిర‌గ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 19, 2021 10:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

3 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

6 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

7 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

8 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

8 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

9 hours ago